Swati Maliwal assault Case: స్వాతి మలివాల్పై దాడి కేసుపై తొలిసారి స్పందించిన కేజ్రీవాల్.. ఏమన్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal assault Case: రాజ్యసభ ఎంపీ, ఆప్ నేత స్వాతి మలివాల్పై దాడి అంశం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆప్ పార్టీ ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు బీజేపీ ఆప్ లక్ష్యంగా విమర్శలు చేస్తోంది. స్వాతి మలివాల్పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారంలో బిభవ్ కుమార్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో బీజేపీ పథకం ప్రకారం స్వాతి మలివాల్ని ఉపయోగించుకుంటోందని ఆప్ ఆరోపిస్తోంది. ఆమె అవినీతి కేసులో ఇరుక్కోవడంతో బీజేపీ బ్లాక్మెయిల్ చేసిందని ఢిల్లీ మంత్రి అతిషీ ఆరోపించారు.
Read Also: Election Commission: రాహుల్ గాంధీ “అగ్నివీర్”, “రాజ్యాంగం రద్దు” వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం..
Also Read
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
ఇదిలా ఉంటే ఈ కేసులో సీఎం కేజ్రీవాల్ మౌనంగా ఉండటాన్ని బీజేపీ ప్రశ్నిస్తూ వస్తోంది. తాజాగా ఆయన తొలిసారిగా స్వాతిమలివాల్పై దాడి ఘటనపై స్పందించారు. దాడిపై న్యాయమైన దర్యాప్తు జరుగుతుందని ఆశిస్తున్నట్లు బుధవారం చెప్పారు. ఈ కేసు న్యాయపరిధిలో ఉందని, తన వ్యాఖ్యలు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు. న్యాయమైన విచారణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో రెండు వెర్షన్లు ఉన్నాయని, పోలీసులు రెండు వెర్షన్లను న్యాయంగా విచారించాలని, న్యాయం చేయాలని అన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో మీరు అక్కడే ఉన్నారా..? అని అడిగనప్పుడు, తాను ఘటనా స్థలంలో లేనని చెప్పారు.
మరోవైపు బుధవారం స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయాలని, తన పర్సనల్ ఫోటోలను లీక్ చేయాలని పార్టీ పలువురిపై ఒత్తిడి తీసుకువస్తోందని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని సీనియర్ ఆప్ నాయకులు ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. నిందితుడు శక్తివంతమైన వ్యక్తి అని, అతనికి వ్యతిరేకంగా పెద్ద నాయకులు కూడా మాట్లాడటం లేదని నిరాశను వ్యక్తం చేశారు. ఎవరో ప్రెస్ కాన్ఫరెస్ డ్యూటీని చేస్తుంటే, మరొకరు ట్వీట్స్ చేసే బాధ్యత అప్పగించబడిందని ఆప్లో పలువురు నాయకుల గురించి పరోక్షంగా విమర్శించారు.
తాజావార్తలు
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
-
Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!