Swati Maliwal assault Case: స్వాతి మలివాల్పై దాడి కేసుపై తొలిసారి స్పందించిన కేజ్రీవాల్.. ఏమన్నారంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swati Maliwal assault Case: రాజ్యసభ ఎంపీ, ఆప్ నేత స్వాతి మలివాల్పై దాడి అంశం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆప్ పార్టీ ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు బీజేపీ ఆప్ లక్ష్యంగా విమర్శలు చేస్తోంది. స్వాతి మలివాల్పై సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడ్డాడు. ఈ వ్యవహారంలో బిభవ్ కుమార్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో బీజేపీ పథకం ప్రకారం స్వాతి మలివాల్ని ఉపయోగించుకుంటోందని ఆప్ ఆరోపిస్తోంది. ఆమె అవినీతి కేసులో ఇరుక్కోవడంతో బీజేపీ బ్లాక్మెయిల్ చేసిందని ఢిల్లీ మంత్రి అతిషీ ఆరోపించారు.
Read Also: Election Commission: రాహుల్ గాంధీ “అగ్నివీర్”, “రాజ్యాంగం రద్దు” వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం..
Also Read
- Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
- PM Modi: ‘జో ఖేలేగా, వో ఖిలేగా’.. కామన్వెల్త్ పతక విజేతలతో మోడీ భేటీ, వీడియో వైరల్
- Delimitation Bill 2026: పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. డీఎంకే 22 మంది ఎంపీలే కీలకం, ఎన్డీఏకు పరీక్ష
- Uttar Pradesh: ‘‘నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు’’.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు
ఇదిలా ఉంటే ఈ కేసులో సీఎం కేజ్రీవాల్ మౌనంగా ఉండటాన్ని బీజేపీ ప్రశ్నిస్తూ వస్తోంది. తాజాగా ఆయన తొలిసారిగా స్వాతిమలివాల్పై దాడి ఘటనపై స్పందించారు. దాడిపై న్యాయమైన దర్యాప్తు జరుగుతుందని ఆశిస్తున్నట్లు బుధవారం చెప్పారు. ఈ కేసు న్యాయపరిధిలో ఉందని, తన వ్యాఖ్యలు విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని చెప్పారు. న్యాయమైన విచారణ జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ వ్యవహారంలో రెండు వెర్షన్లు ఉన్నాయని, పోలీసులు రెండు వెర్షన్లను న్యాయంగా విచారించాలని, న్యాయం చేయాలని అన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో మీరు అక్కడే ఉన్నారా..? అని అడిగనప్పుడు, తాను ఘటనా స్థలంలో లేనని చెప్పారు.
మరోవైపు బుధవారం స్వాతి మలివాల్ సంచలన ఆరోపణలు చేశారు. తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయాలని, తన పర్సనల్ ఫోటోలను లీక్ చేయాలని పార్టీ పలువురిపై ఒత్తిడి తీసుకువస్తోందని ఆమె ఆరోపించారు. ఈ విషయాన్ని సీనియర్ ఆప్ నాయకులు ఫోన్ చేసి చెప్పినట్లు వెల్లడించారు. నిందితుడు శక్తివంతమైన వ్యక్తి అని, అతనికి వ్యతిరేకంగా పెద్ద నాయకులు కూడా మాట్లాడటం లేదని నిరాశను వ్యక్తం చేశారు. ఎవరో ప్రెస్ కాన్ఫరెస్ డ్యూటీని చేస్తుంటే, మరొకరు ట్వీట్స్ చేసే బాధ్యత అప్పగించబడిందని ఆప్లో పలువురు నాయకుల గురించి పరోక్షంగా విమర్శించారు.
తాజావార్తలు
-
John Abraham: జాన్ అబ్రహం డబుల్ యాక్షన్.. హిట్ డైరెక్టర్తో మరోసారి భారీ కాంబినేషన్?
-
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
-
Venky Atluri : OTTలో వెబ్ సిరీస్తో భారీ ప్రయోగం చేయబోతున్న వెంకీ అట్లూరి
-
Jharkhand JPSC Exam Scam: జార్ఖండ్ JPSC పరీక్షలో అవకతవకలు.. రంగంలోకి ఈడీ, దర్యాప్తు ముమ్మరం
-
NTA Recruitment: ఉద్యోగార్థులకు అలెర్ట్.. కంటెంట్, మీడియా, రీసెర్చ్, ఫైనాన్స్లో జాబ్స్కి నోటిఫికేషన్..!
ట్రెండింగ్
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!