Ajit Pawar: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నవంబర్ 20న రాష్ట్రంలోని 288 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి తలపడుతున్నాయి. బీజేపీ ఇప్పటికే రాష్ట్రంలో తన ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. ఇదిలా ఉంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ‘‘బాటేంగే తో కటేంగే’’( విడిపోతే, దెబ్బతింటాం) అనే నినాదంపై వివాదం చెలరేగింది.
మహారాష్ట్రకు సంబంధించి బీజేపీ తీర్మానం లేఖను హోంమంత్రి అమిత్ షా ఆదివారం విడుదల చేశారు. దీని తర్వాత.. తన ప్రసంగంలో అమిత్ షా ముఖ్యమంత్రి పదవికి సంబంధించి పెద్ద ప్రకటన చేశారు.
Maharashtra : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తీర్మానం లేఖను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అంటే ఆదివారం ఉదయం 10.15 గంటలకు ముంబైలో విడుదల చేయనున్నారు.
Asaduddin Owaisi: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అక్కడ రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రధాని నరేంద్రమోడీ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. ‘‘ఓట్ జిహాద్’’ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ప్రధాని మోడీ అరబ్ దేశాలకు వెళ్లిన సమయంలో ఇదే భాషను ఉపయోగిస్తారా..? అని ప్రశ్నించారు. మహరాష్ట్రలో రైతు ఆత్మహత్యల వంటి ప్రధాన సమస్యలపై అధికార పార్టీ దృష్టి మళ్లించిందని ఆరోపించారు.
Amit Shah: కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాహుల్ గాంధీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధినేత రాజ్యాంగానికి సంబంధించిన నకిలీ కాపీని చూపి అవమానిస్తు్న్నారడని అమిత్ షా మండిపడ్డారు. మైనారిటీలకు రిజర్వేషన్లు అమలు చేయడాన్ని బీజేపీ ఎప్పటికీ అంగీకరించడని షా అన్నారు.
Hemant Soren : జార్ఖండ్ ముఖ్యమంత్రి, జార్ఖండ్ ముక్తి మోర్చా అధ్యక్షుడు హేమంత్ సోరెన్ శనివారం భారతీయ జనతా పార్టీ (బిజెపి) పై తీవ్ర దాడిని ప్రారంభించారు.
59 మందికి నామినేటెడ్ పోస్టులు కట్టబెడుతూ.. రెండో జాబితా విడుదల చేసింది కూటమి ప్రభుత్వం.. 59 మందితో విడుదల చేసిన జాబితాలో జనసేన నుంచి 9 మందికి.. బీజేపీ నుంచి ఇద్దరికి అవకాశం దక్కగా.. మిగతా పోస్టులు తెలుగుదేశం పార్టీకి చెందినవారికి దక్కాయి..
PM Modi : జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్రమోడీ రెండోసారి నవంబర్ 10న వారంలోపే వస్తున్నారు. ఇక్కడ రాజధాని రాంచీలో బీజేపీ అభ్యర్థితో కలిసి రోడ్ షో చేయనున్నారు.
హిమాచల్ప్రదేశ్ రాజకీయాలను సమోసా వివాదం కుదిపేస్తోంది. అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ వ్యవహారం రచ్చరచ్చ చేస్తోంది. ఇప్పటికే నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. సమోసాల మిస్సింగ్పై అధికార కాంగ్రెస్ పార్టీ సీఐడీ విచారణకు ఆదేశించడం పెను దుమారం చెలరేగింది
Uddhav Thackeray: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘‘బాటేంగే తో కటేంగే’’(విడిపోతే, నాశనం అవుతాం) వ్యాఖ్యలపై ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ అభ్యంతరం చెప్పారు. బీజేపీ కూటమిలో భాగస్వామిగా ఉన్న అజిత్ పవార్ ఈ వ్యాఖ్యల్ని తిరస్కరించడంపై ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) కూటమి విమర్శలు ఎక్కుపెడుతోంది.