Somu Veerraju : కూటమి ప్రభుత్వంలో ప్రజా పాలన సాగుతుంది
- Somu Veerraju
- YSRCP
- BJP AP
- Andhra Pradesh Government
- AP Development
- Polavaram Project
- Pawan Kalyan
- Rahul Gandhi
- AP Pension Scheme
- AP Welfare Policies
- BJP Opposition
- Double Engine Sarkar
- Andhra Pradesh Politics.. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచి అమలు చేస్తున్నారు
- ఇప్పుడు ఉచిత గ్యాస్ పథకం కూడా అమల్లోకి తీసుకు వచ్చారు
- అంచలు అంచలుగా ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తారు
- వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో తప్పుడు నిర్ణయాలు చేశారు : సోము వీర్రాజు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Somu Veerraju : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి సమస్యలపై అర్జీలు స్వీకరించారు సోము వీర్రాజు. అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం లో ప్రజా పాలన సాగుతుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పెంచి అమలు చేస్తున్నారన్నారు. ఇప్పుడు ఉచిత గ్యాస్ పధకం కూడా అమల్లోకి తీసుకు వచ్చారని, అంచలు అంచలుగా ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తారన్నారు సోము వీర్రాజు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో తప్పుడు నిర్ణయాలు చేశారని, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులను సరిదిద్దుతూ.. ముందుకు వెళుతున్నారన్నారు. ఆర్ధిక పరిస్థితి మెరుగు పరచుకుంటూ… ఉద్యోగులకు ఒకటో తేదీనే ఇస్తున్నారని, కూటమి పాలనపై సందేహాలు వ్యక్తం చేయాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు సోము వీర్రాజు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు కూడా చెల్లిస్తూ.. అభివృద్ది కూడా చేస్తున్నారని, మరోవైపు సంక్షేమ పధకాల ద్వారా పేదలను ఆదుకుంటున్నారన్నారు సోము వీర్రాజు.
Trump Victory Speech: అమెరికా ప్రజలు గొప్ప విజయాన్ని అందించారు..
Also Read
- India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
- ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
- Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
- Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
అంతేకాకుండా..’ఎటువంటి అభివృద్ది లేకుండా గత ఐదేళ్లల్లో పూర్తిగా వదిలేశారు. కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్దికి సమాన ప్రాధాన్యత ఇస్తుంది. అనేక కొత్త పాలసీలను అమలు చేస్తూ.. పరిశ్రమలను తీసుకు వచ్చే విషయంలో ప్రభుత్వం సంప్రదింపులు చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ని సమగ్రాభివృద్ది దిశగా తీసుకు వెళ్లేలా ప్రభుత్వం పని చేస్తుంది. ఈ అంశాలపై వైసీపీ నేతలు అధ్యయనం చేసి మాట్లాడితే బాగుంటుంది. నేడు డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఎపీ అన్ని విధాలా అబివృద్ది చెందుతుంది. అనేక ఆలోచనలతో ముందుకు సాగుతున్న తీరుపై మనసుతో వైసీపీ నేతలు ఆలోచించాలి. నేడు అమరావతి అభివృద్ది, పరిశ్రమల పై పాలసీ, పోలవరం వంటి అంశాలపై వారు ఎందుకు ఆలోచన చేయడం లేదు. కేవలం ఒకే ఆలోచనతో వైసీపీ ప్రభుత్వం పని చేయడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. ఎన్నికలలో ఇచ్చిన అన్ని అంశాలను అమలు చేస్తాం. కేంద్ర, రాష్ట్ర మంత్రులు సమన్వయంతో పని చేసి అభివృద్దిలో భాగస్వామ్యం అవుతున్నారు. నిత్యావసర వస్తువులను తగ్గించి ఇచ్చేలా పౌరసరఫరాలశాఖ మంత్రి ఆదేశాలు ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ తన శాఖల పట్ల సమీక్షలు, పని తీరు చూస్తున్నాం. ఇలా ఎవరికి వారు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తున్నారు. అయినా వైసీపీ మాత్రం ఏకపక్షంగా విమర్శలు చేయడం మంచి విధానం కాదు. రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా ఘోరంగా విఫలమయ్యారు. కెనడాలో హిందూ ఆలయాలపై దాడులు జరిగినా.. ఇప్పటి వరకు ఆయన స్పందించక పోవడం ఆయన నైజాన్ని తెలియ చేస్తుంది. గాజా ఘటనపై మాత్రం వెంటనే స్పందించిన తీరు సెక్యూలరిజానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అర్దం అవుతుంది. ప్రతిపక్ష నేతగా భిన్న వర్గాలు, భిన్న మతాలను సమానంగా చూడాలి. ఆయన వైఖరితో అసలు ప్రతిపక్ష నేతగా ఉండే అర్హత రాహుల్ గాంధీకి ఉందా. గాజాలో ఎలా అయితే స్పందించారో.. కెనడాలో హిందువులపై జరిగిన దాడులను ఖండించాలి. బీజేపీని వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి కూడా ఈ అంశాలను ప్రస్తావించకపోవడం చూస్తే.. మత రాజకీయాలను వారు ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తుంది’ అని సోము వీర్రాజు అన్నారు.
తాజావార్తలు
-
India-US: భారత్-అమెరికా మధ్య వాణిజ్య బంధం.. ఈ నెలాఖరులో అమెరికాకు పీయూష్ గోయల్!
-
ATM Charges: ఏటీఎం విత్డ్రాయల్పై భారీ మార్పులు.. ఆ బ్యాంక్ కస్టమర్లు తెలుసుకోవాల్సిన కొత్త ఛార్జీలు
-
Egg Prices: 40% పెరిగిన కోడిగుడ్ల ధరలు.. E20 విధానమే కారణమా.?
-
Ponguleti Srinivas Reddy : సన్న వడ్లకు రూ.500 బోనస్.. పొంగులేటి కీలక ప్రకటన
-
Ayodhya Ram Temple: రామ మందిర తొలి సీఈవోగా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా నియామకం
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!