Home
Bjp Tamil Nadu
Bjp Tamil Nadu News
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
Tamil Nadu: తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఒరవడిని కలిగి ఉంటాయి. దశాబ్దాలుగా అక్కడ ద్రావిడ సిద్ధాంతాలు, డీఎంకే (DMK)-ఏఐఏడీఎంకే (AIADMK) ద్వంద్వ పోరాటాలే శాసించాయి. అయితే 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ ఆరు దశాబ్దాల రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. కేవలం రెండేళ్ల క్రితం ‘తమిళగ వెట్రి కళగం’ (TVK) పార్టీని స్థాపించిన ప్రముఖ నటుడు విజయ్.. తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే స్థాయికి ఎదిగారు. మొత్తం 234 స్థానాలకు గాను… -
K Annamalai: “కొత్త రాజకీయ ఉద్యమం మొదలు పెడుతున్నా”.. అన్నామలై సంచలన ప్రకటన..
K Annamalai: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. భారతీయ జనతా పార్టీ (BJP) రాష్ట్ర అధ్యక్షుడిగా దూకుడుగా వ్యవహరించిన కే. అన్నామలై ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి తక్షణమే రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన సంచలన నిర్ణయాన్ని ప్రకటిస్తూ, రాబోయే రోజుల్లో ఒక సరికొత్త రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నట్లు స్పష్టం చేశారు. ఈ మార్పు తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని ఒక్కసారిగా మార్చేసేలా కనిపిస్తోంది. తమిళనాడుకు సంబంధించి పార్టీ కేంద్ర నాయకత్వంతో ఉన్న రాజకీయ వ్యూహాత్మక… -
Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
Annamalai: బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకే అన్నామలై సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన తన రాజీనామా ఇచ్చేందుకు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే, జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్, అమిత్ షా, బీఎల్ సంతోష్ వంటి అగ్రనేతలతో భేటీ అయ్యారు. తన రాజీనామా ఇప్పటికే సమర్పించినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు అన్నామలై పార్టీలో కొనసాగేలా ఒప్పించేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. బుధవారం వరకు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు. బీజేపీకి తమిళనాడులో ఆశాకిరణంగా కనిపించిన అన్నామలై, రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసేందుకు అనేక… -
Annamalai: బీజేపీకి గుడ్బై చెప్పనున్న అన్నామలై.. సొంత పార్టీపై ఫోకస్
Annamalai: తమిళనాడులో బీజేపీకి ఆశాకిరణంగా కనిపించిన కే. అన్నామలై, ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఇప్పటికే ఆయన జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్కు రాజీనామా లేఖ అప్పగించినట్లు సమాచారం. గత కొన్నేళ్లుగా అన్నామలై తమిళనాడులో బీజేపీని నడిపించేందుకు ప్రయత్నించారు. రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, బీజేపీ ఆయనను పక్కన పెట్టింది. ఆయన ఆకస్మిక నిర్ణయం వెనక ఏఐడీఎంకేతో పొత్తు, ఎన్నికల వైఫల్యాలు, పార్టీ కేంద్ర నాయకత్వ ప్రణాళిక మధ్య పెరుగుతున్న అంతరాలు దాగి ఉన్నాయి. తమిళనాడు మాజీ బీజేపీ… -
Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
Tamil Politics: తమిళనాడులో కొత్త ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. ఇలా బాధ్యతలు తీసుకున్న కొన్ని గంటలకే విజయ్పై విమర్శలు మొదలయ్యాయి. ప్రతిపక్ష డీఎంకే, అధికార టీవీకేను విమర్శించింది. ప్రమాణస్వీకారంలో ‘వందేమాతరం’’ ముందుగా పాడటంపై డీఎంకే అభ్యతరం వ్యక్తం చేసింది. ‘‘తమిళ రాష్ట్ర గీతానికి’’ ప్రాధాన్యత ఇవ్వలేదని డీఎంకే మండిపడింది. తమిళ గీతానికి అవమానం జరిగిందని ఆరోపించింది. Read Also: PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల… -
Tamil Nadu Elections: తమిళనాడులో కుదిరిన డీఎంకే పొత్తు.. కాంగ్రెస్కు ఎన్ని స్థానాలంటే.?
Tamil Nadu Elections: తమిళనాడు ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనే క్లారిటీ వచ్చింది. ఈరోజు (శనివారం) డీఎంకే కూటమి తన పొత్తుల్ని ఖరారు చేసింది. మొత్తం 234 నియోజకవర్గాల్లో డీఎంకే 164 సీట్లలో పోటీ చేస్తుంటే, మిగిలిన 70 స్థానాలను తన మిత్రపక్షాలకు కేటాయించింది. కూటమిలో ఉన్న కాంగ్రెస్కు 28 సీట్లు, డీఎండీకేకు 10 సీట్లు, వీసీకేకు 8 సీట్లు, సీపీఐ, సీపీఎంలకు చెరో 5 స్థానాలు, ఎండీఎంకేకు 4 స్థానాలు కేటాయించింది.… -
Sharath Kumar : విజయ్ రాజకీయ నాయకుడే కాదు.. హిందువులమని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు!
చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో సినీ నటుడు, బీజేపీ నేత శరత్ కుమార్ తమిళనాడు రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మదురై తిరుపరంకుండ్రం దీపం వివాదం మొదలుకొని, రాబోయే 2026 అసెంబ్లీ ఎన్నికల వరకు పలు అంశాలపై ఆయన కుండబద్దలు కొట్టారు. మదురై తిరుపరంకుండ్రం దీపం వెలిగించే విషయంలో తలెత్తిన వివాదంపై శరత్ కుమార్ స్పందిస్తూ.. ప్రస్తుత సమాజంలో హిందువుల పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేశారు. “నేడు హిందువులుగా ఉన్నవారు తాము హిందువులమని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారని,… -
PM Modi: తమిళనాడులో ప్రధాని మోడీ ‘‘పొంగల్’’ వేడుకలు.. ఎన్నికల ముందు కీలక పరిణామం..
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ ఈసారి తమిళనాడులో ‘‘పొంగల్’’ పండగ వేడుకలు జరుపుకునే అవకాశం ఉందని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 13 నుంచి 15 వరకు మూడు రోజుల పాటు ఆయన పర్యటించే ఛాన్స్ ఉంది. ఈ పర్యటనలో రైతులతో కలిసి పొంగల్ జరుపుకోనున్నారు. 2026తో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మోడీ పర్యటన కీలకంగా మారే అవకాశం ఉంది. ఇది గ్రామీణ ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు సాంస్కృతిక ఏకీకరణను పెంపొందించే… -
RSS: తమిళ హిందువులు చాలు.. “సుబ్రమణ్య స్వామి ఆలయ” వివాదంపై మోహన్ భగవత్..
RSS: తమిళనాడులో తిరుప్పరంకుండ్రంలోని ‘‘సుబ్రమణ్య స్వామి’’ ఆలయ దీపం వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కొండపై ఉన్న ఆలయ స్తంభం వద్ద దీపం వెలిగించాలని మద్రాస్ హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ, డీఎంకే ప్రభుత్వం మాత్రం కొండ కింద ఉన్న దీపం వెలిగించేందుకే అనుమతి ఇచ్చింది. మరోవైపు, కుమారస్వామి భక్తులు మాత్రం కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఇటీవల ఉద్రిక్తతలు చెలరేగాయి. ఇదిలా ఉంటే, ఈ తీర్పు చెప్పిన న్యాయమూర్తి స్వామినాథన్ను తొలగించాలని కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, డీఎంకేలు కలిసి… -
PM Modi: భారత ఆయుధాలు టెర్రరిస్టులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి..
PM Modi: తమిళనాడు అభివృద్ధి మా ప్రధాన నిబద్ధత అని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. తూత్తుకూడి ఏయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ని ఆయన శనివారం ప్రారంభించారు. గత దశాబ్ధంతో పోలిస్తే, ఎన్డీయే నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కన్నా ఎక్కువ నిధుల్ని తమిళనాడుకు ఇచ్చిందని అన్నారు. ఒ
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!