Annamalai: బీజేపీతో అన్నామలైకి ఎక్కడ చెడింది, కారణాలేంటి.?
- బీజేపీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్న అన్నామలై.
- ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతో కీలక సమావేశాలు.
- పార్టీలో కొనసాగాలని ఒప్పించే ప్రయత్నాల్లో బీజేపీ నాయకత్వం.
- అన్నాడీఎంకే పొత్తుపై అసంతృప్తి ప్రధాన కారణమనే ప్రచారం.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: బీజేపీతో తెగదెంపులు చేసుకునేందుకే అన్నామలై సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన తన రాజీనామా ఇచ్చేందుకు మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఇప్పటికే, జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్, అమిత్ షా, బీఎల్ సంతోష్ వంటి అగ్రనేతలతో భేటీ అయ్యారు. తన రాజీనామా ఇప్పటికే సమర్పించినట్లు వాదనలు వినిపిస్తున్నాయి. మరోవైపు అన్నామలై పార్టీలో కొనసాగేలా ఒప్పించేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు. బుధవారం వరకు ఆయన ఢిల్లీలోనే ఉండనున్నారు.
బీజేపీకి తమిళనాడులో ఆశాకిరణంగా కనిపించిన అన్నామలై, రాష్ట్రంలో పార్టీని పటిష్టం చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. పాదయాత్రతో గ్రామాల నుంచి పట్టణాల వరకు బీజేపీకి ఊపు తెచ్చారు. అయితే, ఎన్నికల ముందు అగ్ర నాయకత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలతో అన్నామలై అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే సొంత పార్టీ ఏర్పాటు చేసి, రాజకీయాల్లో ముందుకు సాగాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Also Read
- Trump: టర్కీకి బయల్దేరే ముందు ఓవల్ ఆఫీస్లో ఏం జరిగింది.. ఇరాన్పై ట్రంప్ యుద్ధానికెళ్లడానికి కారణమిదేనా?
- US-Iran War: ఇరాన్లో భారత్-చైనాలను దెబ్బతీసిన అమెరికా..
- Hardeep Singh Puri: త్వరలో చౌకగా E85! ఇథనాల్తో ఇంజిన్ దెబ్బతింటుందన్న పుకార్లు నమ్మొద్దు
- El Nino: ఎల్నినోతో వర్షాలుండవన్నారు.. ఇప్పుడెందుకు భారత్ను ముంచెత్తున్నాయి.. కారణమేంటి?
అన్నాడీఎంకేతో పొత్తుతో అసంతృప్తి:
కర్ణాటక కేడర్ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై, ‘‘సింగం’’గా పేరు తెచ్చుకున్నారు. 2020లో బీజేపీలో చేరారు. అనతికాలంలోనే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈయన హాయాంలో బీజేపీ ఓట్ బ్యాంక్ గణనీయంగా పెరిగింది. కానీ, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకోవడంతోనే అన్నామలై అసంతృప్తికి గురయ్యారు. ఇదే సమయంలో, పొత్తులో భాగం కావాలంటే అన్నామలైని జాతీయాధ్యక్షుడి పదవి నుంచి తొలగించాలని ఎడప్పాడి పళనిస్వామి బీజేపీపై ఒత్తిడి తెచ్చినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే అన్నామలైని తొలగించి నైనార్ నాగేంద్రన్ను బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా నియమించింది.
ఇంత చేసినా అన్నాడీఎంకే ఈ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. ఇదే కాకుండా బీజేపీ మొత్తం 234 సీట్లలో కేవలం ఒక స్థానం మాత్రమే సాధించింది. పార్టీ ఓటు శాతం కూడా గణనీయంగా తగ్గిపోయింది. ఇదే సమయంలో విజయ్ టీవీకే పార్టీ తమిళనాడు రాజకీయాల్లో ప్రధాన శక్తిగా అవతరించింది. ఈ పరిణామాల నేపథ్యంలోనే అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఆయన ఏర్పాటు చేసే కొత్త పార్టీ ద్రావిడ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా, జాతీయవాద రాజకీయాలు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తాజావార్తలు
-
Vaibhav Vs Archer: చెప్పినట్లే వైభవ్ను బోల్తా కొట్టిస్తున్న ఆర్చర్.. మరోసారి దొరికిపోయిన సూర్యవంశీ..
-
Mohan Naik : మాజీ ఇంజనీర్ మోహన్ నాయక్ కేసులో బిగ్ ట్విస్ట్
-
IND Vs ENG: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమ్లో రెండు మార్పులు..
-
OTR: కేంద్ర మంత్రి ముందే ప్రశ్నల వర్షం.. బిల్డప్ కోసమేనా..?
-
OTR: తాడిచర్ల-2 బొగ్గు బ్లాక్ కేటాయింపుపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో బూట్ల దుర్వాసనకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
IP69K రేటింగ్, 9000mAh బ్యాటరీతో లాంచ్ కానున్న REDMI Note 17 Pro..!
-
TGSRTCలో 1,500 కండక్టర్ పోస్టులు.. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగం.!
-
Jio నుంచి గేమ్ ఛేంజింగ్ ప్లాన్.. 1,000+ టీవీ ఛానెల్స్, 150 ప్రీమియం ఛానెల్స్ కేవలం రూ.55కే.!
-
Viral News: చిన్న పొదుపుతో తీరిన పెద్ద కల.. రూ.10 నాణేలతో రూ.1.10 లక్షల బైక్ కొనుగోలు.!