PM Modi: భారత ఆయుధాలు టెర్రరిస్టులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి..
- తమిళనాడుకు యూపీఏ కన్నా ఎక్కువ నిధులు ఇచ్చాం..
- భారత ఆయుధాలు టెర్రరిస్టులకు రాత్రిపూట నిద్రలేకుండా చేస్తున్నాయి..
- ఆపరేషన్ సిందూర్లో మెడ్ ఇన్ ఇండియా ఆయుధాలు సత్తా చాటాయి..
- తమిళనాడులో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: తమిళనాడు అభివృద్ధి మా ప్రధాన నిబద్ధత అని ప్రధాని నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. తూత్తుకూడి ఏయిర్పోర్ట్ కొత్త టెర్మినల్ని ఆయన శనివారం ప్రారంభించారు. గత దశాబ్ధంతో పోలిస్తే, ఎన్డీయే నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కన్నా ఎక్కువ నిధుల్ని తమిళనాడుకు ఇచ్చిందని అన్నారు. ఒకప్పుడు తూత్తుకూడి ప్రసిద్ధ ముత్యాలు భారతదేశ ఆర్థిక శక్తికి చిహ్నంగా ఉండేవని చెప్పారు. ఈ ముత్యాలనే తాను బిల్ గేట్స్కి గిఫ్ట్గా ఇచ్చానని గుర్తు చేశారు.
Read Also: HHVM: ఢిల్లీ ఏపీ భవన్ లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు ప్రదర్శన!
Also Read
- Sana Malik: పాకిస్తాన్లోని ఇస్లామిక్ చట్టాన్ని భారత్ లో అమలు చేయాలి.. ఎమ్మెల్యే సనా మాలిక్ సంచలన వ్యాఖ్యలు
- Ketan Agarwal Murder: 6 నెలల ప్లానింగ్.. 2004 ఫోన్ కాల్స్, 238 గంటల టాక్ టైమ్.. వణుకు పుట్టిస్తున్న మర్డర్ స్కెచ్..
- PM Modi: వెనెజువెలాకు భారత్ అండ.. సహాయ సహకారాలు అందిస్తామన్న ప్రధాని మోడీ..
- Ayodhya: రామాలయ నిధుల వివాదంలో కొత్త ట్విస్ట్.. PMOకు సైతం లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్!
రూ. 550 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 2000 మెగావాట్ల కుడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్ట్ ట్రాన్స్మిషన్ లైన్ రాబోయే ఏళ్లలో దేశానికి స్వచ్ఛమైన విద్యుత్ని అందిస్తుందని అన్నారు. తమిళనాడులో తమ ప్రభుత్వం నిర్మించిన రైల్వే ప్రాజెక్టులు దక్షిణ తమిళనాడు ప్రాంతంలోని అనేక మందికి ప్రయోజనం చేకూరుస్తోందని చెప్పారు. మధురై నుంచి బోడినాయకనూర్ విద్యుదీకరణ వల్ల వందేభారత్ వంటి రైలు నడవడానికి మార్గం ఏర్పడిందని చెప్పారు. దేశంలో మొట్టమొదటి వర్టికల్ బ్రిడ్జ్ని పంబన్లో నిర్మించామని చెప్పారు.
ఇటీవల ఆపరేషన్ సిందూర్లో భారత ఆయుధాలు మేడ్ ఇన్ ఇండియా సత్తానున చాటాయని చెప్పారు. భారత ఆయుధాలు టెర్రరిస్టుల యజమానులకు రాత్రిపూట నిద్ర లేకుండా చేస్తున్నాయని చెప్పారు. బ్రిటన్తో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల 99 శాతం భారతీయ ఉత్పత్తులకు పన్ను లేకుండా చేసిందని, ఇది తమిళనాడు యువత, చిన్న పరిశ్రమలకు ప్రయోజనం చేకూరస్తుందని చెప్పారు. మహాకవి శ్రీ సుబ్రమణ్య భారతీయార్ కు తన నియోజకవర్గం కాశీతో సంబంధాలు ఉన్నాయని, కాశీ-తమిళ సంగం వంటి కార్యక్రమాల ద్వారా మన ఉమ్మడి సాంస్కృతిక వారసత్వాన్ని నిరంతరం బలోపేతం చేస్తున్నామని చెప్పారు.
#WATCH | Thoothukudi, Tamil Nadu: Prime Minister Narendra Modi says "Today, the Government of India is strongly emphasising Make in India and Mission Manufacturing. You all recently witnessed the power of Make in India during Operation Sindoor. The weapons made in India played a… pic.twitter.com/VIdqO72JGd
— ANI (@ANI) July 26, 2025
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!