హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను గురువారం ఉదయం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాష్ట్ర విభజనపై ఇటీవల ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం టీఆర్ఎస్ కార్యకర్తలు చేపట్టిన నిరసనల్లో పలుచోట్ల ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మోదీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోటాపోటీగా ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో జనగామలో టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణల్లో పలువురు బీజేపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. బీజేపీ కార్యకర్తలపై టీఆర్ఎస్ దాడులకు…
రాజకీయాలు అన్నాకా వివాదాలు రాకుండా ఉండవు. ఎవరో ఒకరు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటారు. తాజాగా కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే రాజకుమార్ పాటిల్ తెల్కూర్ కూడా వివాదంలో చిక్కుకున్నారు. తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఆ బీజేపీ ఎమ్మెల్యేనే అంటూ ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడం కర్ణాటకలో సంచలనంగా మారింది. అయితే రాజకుమార్ పాటిల్ తెల్కూర్ మాత్రం ఇందులో ఏ నిజం లేదని ఆమె నా మీద ఘాటు ఆరోపణలు చేస్తుందని తెలుపుతున్నారు.…
ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే నుమాయిష్ (నాంపల్లి ఎగ్జిబిషన్)కు అటంకాలు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం నాంపల్లి ఎగ్జిబిషన్కు అనుమతులు ఇవ్వకపోవడంతో సోసైటి సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విచారణ చేపట్టిన హైకోర్టు కోవిడ్ నిబంధనలతో అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్కు అనుమతులు ఇవ్వవద్దని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశంలో కరోనా, ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోందని, దేశంలో చాలా రాష్ట్రాలు నూతన సంవత్సర వేడుకలకు…
నారాయణపేటలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎవరూ ఇవ్వని పథకాలు అందిస్తున్నా అని ప్రగల్భాలు పలుకుతున్న మన సీఎం గారు..రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరు? అని ప్రశ్నించారు. మన సీఎం ఎలా ఫీల్ అవుతున్నారంటే ఒక చక్రవర్తిలా ఊహించుకుంటున్నారు. నాలుగేళ్ళ నుండి రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారు సీఎం. ఒకసారి పత్తి అంటాడు ఒకసారి సన్న వడ్లు అంటాడు కానీ రైతులకు లాభం రాలేదు. సన్న వడ్లు పండించిన వారికి ఐదు…
గుజరాత్ బీజేపీ ఎమ్మెల్యే ఆశాబెన్ పటేల్ (44) డెంగీతో బాధపడుతూ అహ్మదాబాద్లోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఆదివారం నాడు కన్నుమూశారు. గతంలో ఆశాబెన్ పటేల్ కరోనా బారిన కూడా పడ్డారు. ఇప్పుడు డెంగీ కూడా సోకడంతో ఆమె కోలుకోలేకపోయారు. ఆమె మరణ వార్తను జైడస్ ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ వీఎన్ షా ధ్రువీకరించారు. 2017లో ఉంఝా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీచేసి ఆమె విజయం సాధించారు. గతంలో ఆరు సార్లు బీజేపీ తరపున ఉంఝా స్థానం నుంచి…
కరీంనగర్ జిల్లా పరిషత్ కార్యాలయం పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు ప్రజా ప్రతినిధులు. ఒక్కసారిగా అందరూ నినాదాలు చేస్తూ పోలింగ్ కేంద్రలోకి రావడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. అధికార పార్టీ నాయకులను కండువాలు ధరించి, సెల్ ఫోన్ లను అనుమతిస్తున్నారంటూ కార్పొరేటర్ కమల్ జిత్ కౌర్ ఆగ్రహం వ్యక్తం చేసి పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. అయితే అనామకులు ఫిర్యాదు చేస్తే మమ్మల్ని అవుతారా అంటూ మంత్రి గంగుల కమలాకర్ అసహనం వ్యక్తం చేసారు. మంత్రి గంగుల మాట్లాడుతూ… చట్టాలను…
కేటీఆర్ మాటలు చెప్పడం తప్ప పనులు చేయడం శూన్యం అని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. కేటీఆర్ నాలాలు ఆక్రమణ తొలగింపులు చేయాలని అంటుంటే ఆశ్చర్యమేస్తుంది. అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు అయినా ఒక్క నాలా ఆక్రమణను తొలగించలేదు అన్నారు. ఓల్డ్ సిటీలో ఉన్న మీ ఎంఐఎం తమ్ముళ్లు భారీగా నాలాలు ఆక్రమణలు చేస్తున్నారు అని చెప్పారు. ఓల్డ్ సిటీ లో నాలాలు చెరువులు కబ్జాకు గురైనవి అన్నారు. అందుకే ఒక్క వర్షం వస్తే ఓల్డ్ సిటీ…
బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీఎల్పీ నేత రాజాసింగ్ కేటీఆర్కు ట్వీట్ చేశారు. తన నియోజకవర్గ సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మీతో చర్చించాలని అపాయింట్ మెంట్ కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరడం లేదన్నారు. సభలో మీరు గతంలో ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనను కలవవచ్చని, మాట్లాడవచ్చన్నారు. అసెంబ్లీ కార్యక్రమాల తర్వాత వందల సార్లు మీతో మాట్లాడాలని ప్రయత్నించాను. కానీ కుదరలేదు. మీకు ఫోన్ చేసినా కలవలేదు. మీ ఓఎస్డీకి ఫోన్ చేస్తే ఎప్పుడైనా…
దళితబంధు మాదిరి గిరిజనబంధు అమలు చేయాలి అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలను వంచించటానికి సీఎం కేసీఆర్ దొంగ స్కీంలను తీసుకొచ్చాడు. నవంబర్ 4న దళితబంధు అమలు చేస్తామన్న కేసీఆర్ మాటలు ఒట్టి మాటలు. రిజర్వేషన్లను అడ్డుకుని గిరిజనుల కళ్ళల్లో మట్టికొట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని తెలిపారు. మూడెకరాల భూమి దేవుడెరుగు.. సాగుచేసుకుంటోన్న పోడు భూములను లాక్కుంటున్నాడు. ధరణి పోర్టల్ వలన సొంత భూముల మీద హక్కులు కోల్పోతున్నాం. సమాజంలో అత్యంత…
కేంద్రప్రభుత్వంపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు స్పందించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతోనే సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గత ఏడేళ్లుగా కేసీఆర్కు ఎప్పుడు కోపం వచ్చినా బీజేపీని తిట్టడం ఆయనకు ఫ్యాషన్ అయిపోయిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఎక్కడా వరి కొనుగోలు చేయబోమని చెప్పలేదని.. కేవలం బాయిల్డ్ రైస్ మాత్రమే కొనుగోలు చేయం అని చెప్పిందని రఘునందన్రావు గుర్తుచేశారు. ఎవరు తప్పు చేసినా…