కేసీఆర్ కు రైతుల ఉసురు తగలడం ఖాయం.. ఈటల
నారాయణపేటలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎవరూ ఇవ్వని పథకాలు అందిస్తున్నా అని ప్రగల్భాలు పలుకుతున్న మన సీఎం గారు..రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు కారణం ఎవరు? అని ప్రశ్నించారు. మన సీఎం ఎలా ఫీల్ అవుతున్నారంటే ఒక చక్రవర్తిలా ఊహించుకుంటున్నారు. నాలుగేళ్ళ నుండి రైతుల జీవితాలతో ఆటలాడుతున్నారు సీఎం. ఒకసారి పత్తి అంటాడు ఒకసారి సన్న వడ్లు అంటాడు కానీ రైతులకు లాభం రాలేదు.
సన్న వడ్లు పండించిన వారికి ఐదు పైసలు బిళ్ళ లాభం రాలేదు. ఇప్పుడు వడ్లు పండించొద్దు అంటాడు దానికి కారణం కేంద్రం అని అంటారు. ఇక్కడ వచ్చిన పంటను మిల్లింగ్ చేసే కెపాసిటీ మన మిల్లులకు లేదు. మమ్మల్ని ఆదుకోండి అని మిల్లర్లు అడుకుంటున్నా వారిని పట్టించుకోరు. రాష్ట్రంలో ఒక క్వింటాలు వడ్లకు 10కిలోల తరుగు తీస్తున్నారు. దేశంలో ఉప్పుడు బియ్యం కొనే పరిస్థితులు లేవని రెండున్నర సంవత్సరాల నుండి ప్రత్యుత్తరాలు నడుస్తుంటే అప్పుడు ఒప్పుకొని ఇప్పుడు వద్దు అంటున్నాడు.
Also Read
- Gujarat Election Results: గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. అన్ని కార్పొరేషన్లు కైవసం
- China Floods: చైనాను ముంచెత్తిన భారీ వరదలు.. కొట్టుకుపోయిన కార్లు
- WHCD Shooter: నిందితుడి హిట్ లిస్ట్లో కాష్ పటేల్ లేకపోవడానికి కారణమిదే! వెలుగులోకి కీలక విషయాలు
- Mumbai: దారుణం.. కల్మా పఠించలేదని ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై దాడి.. రంగంలోకి ఏటీఎస్
ఈయన పరిస్థితి ఎలా ఉందంటే రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్టు ఉంది. ఎన్నో కోట్ల పథకాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎండాకాలం వడ్లు కొనడానికి అభ్యంతరం ఏమిటి? అన్ని పథకాలు కేంద్రం ఇస్తుందని అమలు చేస్తున్నావా?ఇప్పటికైనా చెంపలేసుకొని వడ్లు కొనుగోలు చేయకపోతే పుట్టగతులు ఉండవు. 75శాతం ప్రజలు మీ పాలన బాగాలేదు అని సర్వే లో తెలుస్తోంది.తెలంగాణ రైతుల ఉసురు తగులుతుందన్నారు ఈటల.
తాజావార్తలు
-
UAE vs Saudi Arabia: ఉప్పు నిప్పుగా యూఏఈ, సౌదీ అరేబియా.. గల్ఫ్లో పవర్ స్ట్రగుల్..
-
PBKS vs RR: స్టోయినిస్ తుఫాన్ ఇన్నింగ్స్.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం.!
-
Payal Rajput: రిపోర్టర్ ప్రశ్నకు ఏడుస్తూ ఈవెంట్ నుంచి వెళ్లిపోయిన పాయల్ రాజ్పుత్
-
The Lalit Hotel: ఢిల్లీలోని లగ్జరీ హోటల్కు వెయ్యి కోట్ల పెనాల్టీ! ఎందుకో తెలుసా?
-
S-400 air defence system: పాకిస్తాన్కు చుక్కలే.. మరో ఎస్-400 భారత్ రాబోతోంది
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో