ప్రత్యేకమైన వాసన, రుచికి ప్రసిద్ధి చెందిన వెల్లుల్లి, మన భారతీయ వంటశాలలలో చాలా వరకు కనిపించే ఒక సాధారణ పదార్ధం. పొటాషియం, జింక్, మెగ్నీషియం మరియు ఫాస్పరస్, విటమిన్లు సి, కె, నియాసిన్, థయామిన్ మరియు ఫోలేట్ వంటి అనేక ఖనిజాలు కూడా వెల్లుల్లిలో పుష్కలంగా లభిస్తాయి. మీ రోజువారీ ఆహారంలో వెల్లుల్లిని చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. బరువు తగ్గడానికి వెల్లుల్లి: వెల్లుల్లిలో యాంటీ ఫంగల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్…
కేసీఆర్ బస్సు యాత్రలో చేతివాటం.. డిప్యూటీ మేయర్ బంగారం, కౌన్సిలర్ డబ్బు చోరీ.. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి మరో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. దీంతో రాష్ట్రంలోని జాతీయ పార్టీల నేతలతో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న బీజేపీ నేతలు వివిధ రాష్ట్రాల సీఎంలతో ప్రచారం చేయిస్తున్నారు. అలాగే ఆయా ప్రాంతాల్లో స్టార్ ప్లానర్లతో ప్రచారం చేయిస్తున్నారు. ఇందులో భాగంగా.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారు. రోడ్ షోలో…
కాంగ్రెస్పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన “నోట్లతో నిండిన టెంపో” వ్యాఖ్యలకు ధీటుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు గురువారం మాట్లాడుతూ.. డీ-మానిటైజేషన్ విఫల ప్రయత్నమని ప్రధాని మోదీ భావిస్తున్నారా? అని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇటీవల తెలంగాణలో పర్యటించిన సమయంలో కాంగ్రెస్కు అదానీ, అంబానీలు టెంపోల నిండుగా డబ్బు పంపుతున్నారని ప్రధాని మోదీ అన్నారని, ఆయన మాట ప్రకారం కాంగ్రెస్కి వాళ్లు అంతగా డబ్బు పంపుతుంటే ఈడీ, సీబీఐ, ఐటీలు ఎందుకు మౌనంగా ఉన్నాయని…
గతంలో ఎన్నడూ లేని విధంగా బీర్ మరియు మద్యం సరఫరా కొరతను పరిష్కరించేందుకు జోక్యం చేసుకోవాలని తెలంగాణ వైన్ డీలర్స్ అసోసియేషన్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది. కమీషనర్, ప్రొహిబిషన్ & ఎక్సైజ్కి ఒక పిటిషన్లో, అసోసియేషన్ ఇలా పేర్కొంది, “తెలంగాణ అంతటా మద్యం మరియు బీర్ సరఫరా కొరత యొక్క క్లిష్టమైన సమస్య, ముఖ్యంగా రిటైలర్లను ప్రభావితం చేస్తుంది. మార్చి 2024 నుండి, మా డిపోలకు స్టాక్ల సరఫరా క్రమంగా తగ్గుతోంది, ఇది…
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రైతుల నోట్లో మట్టికొట్టాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల దుష్ట రాజకీయ పన్నాగాలకు రైతులు బలవుతున్నారని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో మండిపడ్డారు. అసలే వర్షాలు లేక రైతులు తీవ్రమైన బాధలో ఉంటే.. కనీస మానవత్వం లేకుండా స్వార్ధరాజకీయాల కోసం రైతుల నోటికాడ బుక్కను లాక్కోవడం ఏంటని ఆయన నిలదీశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం…
మేడిగడ్డ బ్యారేజీకి మరింత నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎస్ఏ మధ్యంతర నివేదిక ఇచ్చింది. మేడిగడ్డలో ఏడో బ్లాక్కు మాత్రమే నష్టం వాటిల్లిందా, మిగిలిన బ్లాకుల పరిస్థితి ఏంటన్నది తెలుసుకోవడానికి పలు పరీక్షలు చేయాల్సి ఉంది. తుది నివేదికను జూన్లో అందజేస్తారని నీటిపారుదల శాఖ అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలోని నిపుణుల కమిటీ ఈ బ్యారేజీలను పరిశీలించడంతోపాటు నీటిపారుదల శాఖ అధికారులు, ఏజెన్సీలతో చర్చించింది. పూర్తి నివేదిక…
ఏపీలో ఈ నెల 6, 8 తేదీల్లో మోడీ పర్యటన ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచారం జోరు పెంచుతున్నారు. ఇటీవల నామినేషన్ ప్రక్రియ సైతం ముగిసింది. ఈ నేపథ్యంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఏపీకి రానున్నారు. ఈ నెల 6, 8 తేదీల్లో మోడీ పర్యటన ఉన్నట్లు బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ తెలిపారు. రెండవ దశ ప్రచార పర్యటనలో భాగంగా…
‘హలో…మీ అబ్బాయి రేప్ కేసులో చిక్కుకున్నాడు. అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తున్నాం. మీరు అతన్ని విడిపించాలనుకుంటే వెంటనే ఈ నంబర్కు కాల్ చేయండి. మీకు కూడా అలాంటి ఫోన్ కాల్స్ వస్తున్నట్లయితే, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు కాలర్ చెప్పినట్లుగా వింటే మాత్రం.. మీ బ్యాంక్ ఖాతా ఖచ్చితంగా ఖాళీ అవుతుంది. అంతేకాకుండా.. సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది. అవును, దేశంలో ఇలాంటి మోసం ఘటనలు చాలానే జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా ఢిల్లీ ఎన్సీఆర్తో పాటు…
తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్, సిద్దిపేట గడ్డ సిద్దిపేటకి కేసీఆర్, హరీష్ రావు ఏం చేశారని రేవంత్ చెబుతున్నారని, కళ్ళుండి సీఎం రేవంత్ రెడ్డి చూడలేకపోతున్నారా అర్థం కావట్లేదన్నారు హరీష్ రావు. జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి అవార్డులు లేకుండా సిద్దిపేట లేదని, సిద్దిపేట అభివృద్ధి కాలేదని సీఎం రేవంత్ పచ్చి అబద్దాలు మాట్లాడారన్నారు హరీష్. తెలంగాణ రావడానికి కారణం కేసీఆర్, సిద్దిపేట గడ్డ అని, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడంటే కారణం సిద్దిపేట అని ఆయన…
అంబేడ్కర్ స్పూర్తితో మోడీ పాలన సాగిస్తున్నారని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. మరోసారి అధికారంలోకి వచ్చాక గ్రామ గ్రామానికి రాజ్యాంగాన్ని తీసుకెళ్తాం.. అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు కిషన్ రెడ్డి. అంబేడ్కర్ పంచ తీర్థ స్థలాలను అభివృద్ధి చేశామని, పార్లమెంట్ లో తొలిసారి అంబేడ్కర్ ఫోటో పెట్టింది అటల్ జీ.. బీజేపీ అని ఆయన అన్నారు. ఇక్కడ కూడా అంబేడ్కర్ ఫోటో పెట్టాలని ధర్నాలు చేసి.. లాఠీలతో కొట్టించారని, సబ్ కా సాథ్.. సబ్…