17 ఏళ్ల తర్వాత టీ-20 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత జట్టుకు రూ.125 కోట్ల ప్రైజ్ మనీ లభిస్తుంది. బోర్డు కార్యదర్శి జై షా జూన్ 30న ఈ విషయాన్ని ప్రకటించారు.
జై షా.. బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్.. అంతకు మించి కేంద్ర మంత్రి, బీజేపీ కీలక నేత అమిత్ షా కుమారుడు. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కనిపించిన ఓ దృశ్యం.. ఇప్పుడు కొత్తగా వివాదాలకు కేంద్రబిందువు అయింది. జై షా చుట్టూ వివాదాలు ఇప్పుడిప్పుడే ముసురుకుంటోన్నాయి.