UP: 9 ఏళ్లుగా లవ్.. 2 నెలల క్రితం పెళ్లి.. శవమైన భర్త.. మిస్టరీ ఏంటంటే..!
- ఉత్తరప్రదేశ్లోని బరేలీలో దారుణం
- రెండు నెలల క్రితం ప్రేమ వివాహం
- 60 రోజులకే కాటికిపోయిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాళ్లిద్దరూ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మొత్తానికి ప్రేమ ఫలించి రెండు నెలల క్రితం ఏడడుగులు వేశారు. ఇంతలోనే ఇద్దరి మధ్య ఏం జరిగిందో.. ఏమో తెలియదు గానీ భర్తను ఇల్లాలు కాటికి పంపేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జరిగింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Iran-US: ఇరాన్కు ఏదైనా జరిగితే.. ఆ తర్వాత సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ట్రంప్కు ఖమేనీ వార్నింగ్
Also Read
- Bengaluru: నీట్ రీ ఎగ్జామ్కు హాజరుకాని ముగ్గురు అభ్యర్థులు.. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ వాగ్యుద్ధం
- West Bengal Budget 2026: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. డీఏ 20% పెంపు
- Uddhav Thackeray: పాపం ఉద్ధవ్ ఠాక్రే.. పొలిటికల్ షాక్ నుంచి కోలుకోవడం సాధ్యమేనా?
- Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
జితేంద్ర కుమార్ యాదవ్, జ్యోతి 9 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మొత్తానికి కుటుంబ సభ్యుల అంగీకారంతో నవంబర్ 25, 2025న బరేలీలో వైభవంగా వివాహం జరిగింది. అయితే జితేంద్ర కుమార్ యాదవ్ ఆన్లైన్ జూదానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్య జ్యోతి బ్యాంక్ ఖాతా నుంచి 20 వేలు విత్డ్రా చేసి ఆన్లైన్లో పెట్టాడు. అవి కాస్త పోయాయి. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చివరికి అది కాస్త హత్యకు దారి తీసింది.

జనవరి 26న జ్యోతి తన తల్లిదండ్రులకు.. సోదరుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. అప్పటికే దంపతులిద్దరూ తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతి తల్లిదండ్రులు జితేంద్ర చేతులు, కాళ్లు గట్టిగా పట్టుకోగా. జ్యోతి కోపంతో భర్త గొంతు కోసేయడంతో ప్రాణాలు వదిలేశాడు. అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని వెంటిలేటర్ గ్రిల్కు వేలాడిదీసి.. ‘‘అల్లుడు ఉరివేసుకున్నాడు.’’ అంటూ ఇరుగుపొరుగు వారిని పిలిచారు.
ఇది కూడా చదవండి: Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026.. ధరలు తగ్గేవి, పెరిగేవి ఏంటి..?
ఇక ఇజ్జత్నగర్ పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించారు. రిపోర్టులో హత్యగా తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు నిందితురాలు భార్య జ్యోతి, మామ కాళీచరణ్, అత్తగారు చమేలిలను అరెస్టు చేశారని పోలీస్ అధికారి చెప్పారు. విచారణలో ముగ్గురూ తమ నేరాలను అంగీకరించారని.. పరారీలో ఉన్న జ్యోతి సోదరుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆ బ్యాటింగ్ స్టైలే వైభవ్కు శాపమా..? ఊహించని ప్రమాదంలో సూర్యవంశీ..
-
JD Vance: స్విట్జర్లాండ్లో జేడీ వాన్స్కు అవమానం.. పట్టించుకోని ఇరాన్ బృందం.. వీడియోలు వైరల్
-
Walking After Meals: భోజనం తర్వాత నడవాలా? ఎంతసేపు నడిస్తే ఆరోగ్యానికి మేలు?
-
Film Reviews: రివ్యూలతో సినిమాను చంపేస్తారా? సీఎంకి డైరెక్టర్ ఫిర్యాదు!
-
YS Jagan Pulivendula Tour: 3 రోజుల పాటు పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!