UP: 9 ఏళ్లుగా లవ్.. 2 నెలల క్రితం పెళ్లి.. శవమైన భర్త.. మిస్టరీ ఏంటంటే..!
- ఉత్తరప్రదేశ్లోని బరేలీలో దారుణం
- రెండు నెలల క్రితం ప్రేమ వివాహం
- 60 రోజులకే కాటికిపోయిన భర్త
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాళ్లిద్దరూ తొమ్మిదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మొత్తానికి ప్రేమ ఫలించి రెండు నెలల క్రితం ఏడడుగులు వేశారు. ఇంతలోనే ఇద్దరి మధ్య ఏం జరిగిందో.. ఏమో తెలియదు గానీ భర్తను ఇల్లాలు కాటికి పంపేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్లోని బరేలీలో జరిగింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఇది కూడా చదవండి: Iran-US: ఇరాన్కు ఏదైనా జరిగితే.. ఆ తర్వాత సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి.. ట్రంప్కు ఖమేనీ వార్నింగ్
Also Read
- West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
- Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
- Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
- Iran-US Mediation: పాక్పై నమ్మకం లేదు.. ఇరాన్ యుద్ధంలో భారత్నే నమ్ముతున్న రష్యా
జితేంద్ర కుమార్ యాదవ్, జ్యోతి 9 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మొత్తానికి కుటుంబ సభ్యుల అంగీకారంతో నవంబర్ 25, 2025న బరేలీలో వైభవంగా వివాహం జరిగింది. అయితే జితేంద్ర కుమార్ యాదవ్ ఆన్లైన్ జూదానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో భార్య జ్యోతి బ్యాంక్ ఖాతా నుంచి 20 వేలు విత్డ్రా చేసి ఆన్లైన్లో పెట్టాడు. అవి కాస్త పోయాయి. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. చివరికి అది కాస్త హత్యకు దారి తీసింది.

జనవరి 26న జ్యోతి తన తల్లిదండ్రులకు.. సోదరుడికి ఫోన్ చేసి ఇంటికి పిలిచింది. అప్పటికే దంపతులిద్దరూ తీవ్రంగా ఘర్షణ పడుతున్నారు. ఈ నేపథ్యంలో జ్యోతి తల్లిదండ్రులు జితేంద్ర చేతులు, కాళ్లు గట్టిగా పట్టుకోగా. జ్యోతి కోపంతో భర్త గొంతు కోసేయడంతో ప్రాణాలు వదిలేశాడు. అనంతరం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని వెంటిలేటర్ గ్రిల్కు వేలాడిదీసి.. ‘‘అల్లుడు ఉరివేసుకున్నాడు.’’ అంటూ ఇరుగుపొరుగు వారిని పిలిచారు.
ఇది కూడా చదవండి: Union Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026.. ధరలు తగ్గేవి, పెరిగేవి ఏంటి..?
ఇక ఇజ్జత్నగర్ పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించారు. రిపోర్టులో హత్యగా తేలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. మరొకరు పరారీలో ఉన్నారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు నిందితురాలు భార్య జ్యోతి, మామ కాళీచరణ్, అత్తగారు చమేలిలను అరెస్టు చేశారని పోలీస్ అధికారి చెప్పారు. విచారణలో ముగ్గురూ తమ నేరాలను అంగీకరించారని.. పరారీలో ఉన్న జ్యోతి సోదరుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.
తాజావార్తలు
-
West Bengal: సువేందు దూకుడు.. ఆర్జీకర్ కేసులో ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్..
-
Karnataka: ఘోర విషాదం.. గుడికెళ్లి వస్తుండగా ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
-
T20 Captain: భారత టీ20 కెప్టెన్గా కొత్త సారథి.. సంజూ శాంసన్కు అవకాశం..?
-
JioStar vs Zee: కోర్టుకెక్కిన బాలీవుడ్ సినిమాల వివాదం.. రూ.250 కోట్ల నష్టపరిహారం?
-
Supreme Court: సుప్రీం కోర్టు పొదుపు మంత్రం.. ఇకపై వర్చువల్ విచారణకు ఆదేశం
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!