Telangana Cyber Crime : తెలంగాణలో సైబర్ నేరాల నియంత్రణ కోసం పోలీసులు చేపట్టిన భారీ ఆపరేషన్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో వేల సంఖ్యలో అనుమానాస్పద బ్యాంకు ఖాతాలను పరిశీలించగా, కోట్ల రూపాయల సైబర్ మోసాలకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తెలంగాణలో తొలిసారిగా ఒకేసారి నిర్వహించిన ఈ సమన్వయ ఆపరేషన్లో మొత్తం 137 పోలీసు బృందాలు పాల్గొన్నాయి. 512 మంది పోలీసు సిబ్బందితో కూడిన ఈ బృందాలు…
భారత్లో ఇప్పటికే బ్యాంకులకు కోట్లకు కోట్లు ఎగవేసి విదేశాల్లో తలదాచుకున్న వ్యాపారవేత్తల లిస్ట్ పెద్దదే.. ఇప్పుడు మరో భారీ మోసం వెలుగు చూసింది.. 17 బ్యాంకులను ముంచిన ముగ్గురు వ్యాపారవేత్తలు, ఏకంగా రూ.34,615 కోట్లకు మోసం చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.. ఇక, రంగంలోకి దిగిన సీబీఐ.. దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్), మాజీ సీఎండీ కపిల్ వాధావన్, డైరెక్టర్ ధీరజ్ వాధావన్, సుధాకర్ శెట్టిపై కేసు నమోదు చేసింది.. ఏకకాలంలో 12 ప్రాంతాల్లో సోదాలు…