Biggest Banking Fraud: భారత్లో భారీ బ్యాంకు మోసం.. రూ.34,615 కోట్ల స్కామ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్లో ఇప్పటికే బ్యాంకులకు కోట్లకు కోట్లు ఎగవేసి విదేశాల్లో తలదాచుకున్న వ్యాపారవేత్తల లిస్ట్ పెద్దదే.. ఇప్పుడు మరో భారీ మోసం వెలుగు చూసింది.. 17 బ్యాంకులను ముంచిన ముగ్గురు వ్యాపారవేత్తలు, ఏకంగా రూ.34,615 కోట్లకు మోసం చేయడం ఇప్పుడు కలకలం రేపుతోంది.. ఇక, రంగంలోకి దిగిన సీబీఐ.. దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డీహెచ్ఎఫ్ఎల్), మాజీ సీఎండీ కపిల్ వాధావన్, డైరెక్టర్ ధీరజ్ వాధావన్, సుధాకర్ శెట్టిపై కేసు నమోదు చేసింది.. ఏకకాలంలో 12 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.. ముంబైకి చెందిన ప్రైవేట్ కంపెనీపై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండస్ట్రియల్ ఫైనాన్స్ బ్రాంచ్ నుండి అందిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసింది సీబీఐ. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్టియంను నిందితులు రూ.34,615 కోట్లు మోసం చేశారని అభియోగాలు మోపారు..
Read Also: Covid 19: తెలంగాణలో భారీగా కొత్త కేసులు
Also Read
- Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
- Murder Case: 'నీలాంటి భర్తలు వెయ్యి మంది దొరుకుతారు'.. ఆ ఒక్క మాటతో జరిగిన ఘోరం, హైకోర్టు కీలక తీర్పు
- Rajasthan: బాలికపై అత్యాచార ఘటనలో బుల్డోజర్ యాక్షన్.. 4 హోటళ్లు ధ్వంసం
- Chennai Crime: ప్రియురాలికి ఐఫోన్ గిఫ్ట్ కోసం చైన్ స్నాచింగ్.. పోలీసుకు పట్టించిన చొక్కా..!
ఈ అతిపెద్ద స్కామ్పై ఈ నెల 20న కేసు నమోదు చేసిన సీబీఐ.. 50 మందికిపైగా అధికారుల బృందంతో ఇవాళ ముంబైలోని 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది.. ఇందులో అమరిల్లిస్ రియల్టర్స్కు చెందిన సుధాకర్ శెట్టి, ఎనిమిది మంది ఇతర బిల్డర్లు ఉన్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కూడిన 17 బ్యాంకుల కన్సార్టియాన్ని రూ.34,615 కోట్ల మేర మోసం చేసేందుకు కుట్ర పన్నారనే అభియోగాలు వారిపై మోపారు.. 2010 నుంచి 2018 మధ్యలో ఆయా బ్యాంకుల నుంచి దాదాపు రూ.42,871 కోట్ల వరకు రుణాలు తీసుకుని దుర్వినియోగం చేసినట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొంది సీబీఐ. ఇక, వాస్తవాలను దాచేస్తూ కుట్రపూరితంగా వ్యవహరించారని.. ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేమని చేతులు ఎత్తేశారని సీబీఐ తన ప్రకటనలో పేర్కొంది.. 2019 మే నెల నుంచి రుణాలను తిరిగి చెల్లించడాన్ని డీహెచ్ఎఫ్ఎల్ నిలిపివేసిందని, ఫలితంగా బ్యాంకులు ఆయా లోన్లను మొండి బకాయిలుగా ప్రకటించాయని పేర్కొంది. ఆ కంపెనీ డైరెక్టర్లు కపిల్ వాధ్వాన్, ధీరజ్ వాధ్వాన్ కుట్రపూరిత చర్యలతో బ్యాంకులకు దాదాపు రూ.34,615 కోట్లు నష్టం జరిగిందని వివరించింది. ఈ భారీ స్కామ్లో దీవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, కపిల్ వాధావన్, ధీరజ్ రాజేష్ కుమార్ వాధావన్, సుధాకర్ శెట్టి, అమరిల్లిస్ రియల్టర్స్, గుల్మార్గ్ రియల్టర్స్, Skylark Buildcon, దర్శన్ డెవలపర్స్, సిగ్టియా కన్స్ట్రక్షన్, క్రియేటోజ్ బిల్డర్స్, టౌన్షిప్ డెవలపర్స్, శిశిర్ రియాలిటీ, సన్బ్లింక్ రియల్ ఎస్టేట్ సహా పలు ప్రాంతాల్లో ఈరోజు సోదాలు నిర్వహించిన సీబీఐ అధికారుల బృందాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu Kuppam Tour: కుప్పంలో సీఎం బిజీ షెడ్యూల్.. 23 వేల ఉద్యోగాల లక్ష్యంగా భారీ పరిశ్రమలకు శ్రీకారం
-
Vaibhav Sooryavanshi: దయచేసి వైభవ్ను ఆడించండి.. బీసీసీఐకి ఎవరన్నా చెప్పండ్రా బాబు.. దిగ్గజాల కామెంట్స్ వైరల్!
-
Telegram, Signal: వాట్సాప్ యూజర్నేమ్ వివాదం.. టెలిగ్రామ్, సిగ్నల్కు కేంద్రం నోటీసులు.. కారణమేంటి?
-
T20 World Cup 2026: సెమీస్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. ఫైనల్లో ఆస్ట్రేలియాతో ఇంగ్లండ్ ఢీ!
-
Kambham Road Accident: పెళ్లి ఇంట్లో పెను విషాదం.. ఇద్దరు అన్నలు సహా నలుగురు మృతి.. పెళ్లి కూతురుకి తీవ్రగాయాలు..
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!