Bangladesh clashes: బంగ్లాదేశ్ భగ్గుమంటోంది. మరోసారి నిరసనలతో ఆ దేశం అట్టుడుకుతోంది. ఆదివారం రాజధాని ఢాకాలో నిరసనకారులు చేపట్టిన కార్యక్రమాలు హింసకు కారణమయ్యాయి. నిరసనకారులు పోలీసులు, అధికార అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలకు మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. ఈ ఘర్షణల్లో 93 మందికి పైగా మరణించారు.
Bangladesh clashes: బంగ్లాదేశ్ వ్యాప్తంగా మరోసారి ఘర్షణలు చెలరేగాయి. ఇటీవల రిజర్వేషన్లకు వ్యతిరేకంగా అక్కడి విద్యార్థులు, ప్రజలు ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారడంతో 200 మందికి పైగా మృతి చెందారు. ఇదిలా ఉంటే పోలీసులు అణిచివేతకు వ్యతిరేకంగా మరోసారి ఆ దేశంలో నిరసనలు మిన్నంటాయి. ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేయాలనే డిమాండ్తో నిరసనకారులు రోడ్డెక్కారు. రాజధాని ఢాకాలో నిరసనకారులు, విద్యార్థులు పోలీసులకు, అధికార అవామీ లీగ్ కార్యకర్తలకు మధ్య ఘర్షణలు జరిగాయి.…
Mamata Banerjee: ఇటీవల బంగ్లాదేశ్ అల్లర్లను ఉద్దేశిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై బంగ్లాదేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్ తన నిరసనను దౌత్యమార్గాల ద్వారా తెలియజేసినట్లు విదేశీవ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం చెప్పింది.
Bangladesh Protest : బంగ్లాదేశ్లో దిగజారుతున్న పరిస్థితులపై మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యపై భారతదేశంలో వివాదం ఆగలేదు..బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా దీనిపై స్పందించింది.
Bangladesh: రిజర్వేషన్లపై నిరసనలు బంగ్లాదేశ్లో ఉద్రిక్తంగా మారాయి. 1970లలో బంగ్లాదేశ్ స్వాతంత్య్రంలో పాల్గొన్న సమరయోధుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం కోటా కల్పించడాన్ని వ్యతిరేకిస్తూ, అక్కడి యూనివర్సిటీ విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. ఈ నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి.
Bangladesh Protests: బంగ్లాదేశ్లో రిజర్వేషన్లపై జరగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో బంగ్లాదేశ్ స్వాతంత్య్ర పోరాటయోధుల కుటుంబాలకు చెందిన వారికి 30 శాతం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ, పలు వర్సిటీల విద్యార్థులు, ప్రజలు నిరసనలు చేపట్టారు. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి.