బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించారు. రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి పోటీ చేసేందుకు సిద్ధమైన బండి సంజయ్.. అందులో భాగంగా తన పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లో బిజీగా ఉన్న బండి సంజయ్.. ఆ సమావేశాల అనంతరం ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా నాయకులు, కార్యకర్తలతో భేటీ కానున్నారు. అందుకోసం నియోజకవర్గాల వారీగా విస్త్రతస్థాయి…
Telangana BJP: రాష్ట్ర బీజేపీకి త్వరలో కొత్త నాయకుడు వస్తారా? ఈ ప్రశ్నకు పార్టీల నుంచి అవుననే సమాధానం వస్తోంది. బండి సంజయ్ స్థానంలో ప్రస్తుత అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డిని నియమించినప్పుడు
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, కాబోయే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించిన జెయింట్ కిల్లర్, బీజేపీ ఎమ్మెల్యే కాటపల్లి వెంకటరమణారెడ్డి ఈరోజు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ను కలిశారు.
కేసీఆర్ మూర్ఖత్వపు పాలన విరగడైనందుకు సంతోషంగా ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడి బీజేపీ పోరాడితే చివరకు కాంగ్రెస్ లాభపడిందన్నారు. ఈ సందర్భంతా బండి సంజయ్ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అభినందనలు తెలిపారు. కరీంనగర్ విషయానికొస్తే ప్రతిసారి తన ఓట్ల శాతం పెరుగుతోందన్నారు.
Bandi Sanjay Wants Re Counting in Karimnagar: కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితంపై హైడ్రామా కొనసాగుతోంది. బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్.. బీజేపీ ఎంపీ బండి సంజయ్ పై 326 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అయితే కౌంటింగ్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్న బండి సంజయ్.. రీకౌంటింగ్ కోరారు. దాంతో అధికారులు ఫలితాన్ని అధికారికంగా ప్రకటించలేదు. కౌంటింగ్లో ఏం జరుగుతుందో అర్థంకాని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న గంగుల కమలాకర్.. కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్నారు.…
Telangana Results: తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ గతంతో పోలిస్తే ఎమ్మెల్యే సీట్లను ఓట్లను పెంచుకోగలిగింది. తామే బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం అని కర్ణాటక ఎన్నికల ఫలితాల ముందు వరకు చెప్పిన బీజేపీ, కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు తర్వాత సైలెంట్ అయింది. మరోవైపు కర్ణాటక విజయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి జోష్ పెంచింది. అయితే గతంలో 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కస్థానంలోనే గెలుపొందిన బీజేపీ, ఈ సారి 8 స్థానాలను గెలుచుకుంది.
Bandi Sanjay Release Note: రేపు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ నియోజవర్గంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రారంభం కానుండగా బండి సంజయ్ సంచలన ప్రకటన ఇచ్చారు. కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ను సవాలు చేస్తూ బండి అనూహ్యంగా లేఖ విడుదల చేశారు. ‘గంగుల.. నీ సవాల్కు నేను రెడీ. భాగ్యలక్ష్మి వద్దకు కేసీఆర్ను రమ్మను. కరీంనగర్లో ఏ దేవాలయానికి రమ్మన్నా వచ్చేందుకు నేను సిద్ధం. డబ్బులు పంచలేదని…
Manda Krishna Madiga : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే మిగిలి ఉంది. దీంతో అగ్ర నేతలంతా ఆఖరి అస్త్రాలను ఓటర్ల పై ప్రయోగిస్తున్నారు.
కరీంనగర్ నగర అభివృద్ధి కొరకు స్మార్ట్ సిటీ నిధులపై చర్చకు సిద్ధమా అంటూ బండి సంజయ్కి తొడ కొట్టి సవాల్ విసిరారు మంత్రి గంగుల కమలాకర్. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ టవర్ సర్కిల్లో ప్రజలను ఉద్దేశించి గంగుల కమలాకర్ మాట్లాడారు. ఇప్పుడు పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దోపిడీ దొంగ రేపు మీ వ్యాపార సంస్థలను వేధించి మామూలు వసూలు చేస్తాడని ఆరోపించారు.
కరీంనగర్ అశోక్నగర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘ఇదిగో నా అభివృద్ధి నివేదిక.. కరీంనగర్ ప్రగతి కోసం రూ. 9 వేల కోట్ల నిధులు తీసుకొచ్చా. గంగుల… నువ్వు సాధించేదేమిటి?’ అని ప్రశ్నించారు. ఐటీ టవర్లో తొండలు గుడ్లు పెడుతున్నాయ్.. కోచింగ్ లేక బీసీ స్టడీ సర్కిల్ వెక్కిరిస్తోంది.. తీగల వంతెన వీక్లీ డ్యాన్స్ క్లబ్లా మారింది.. అంటూ ఎద్దేవా చేశారు. కబ్జాలు,…