ప్రసంగించడం ఓ కళ అయితే దానికి కేరాఫ్ అడ్రస్ ఆయన. సభ ఏదైనా చమత్కారం జోడించి శ్రోతలు చూపు తిప్పుకోలేనంత అందంగా మాట్లాడే వ్యక్తి. పోఖ్రాన్ అణుప్రయోగంతో దేశాన్ని పవర్ఫుల్ గా తీర్చిదిద్ది అగ్రరాజ్యానికి మనమేం తక్కువ కాదని నిరూపించిన నాయకుడు. ఆయనే బీజేపీ నేత, స్వాతంత్ర సమరయోధులు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్. ఈరోజు ఆయన 98వ జయంతి.
భారతదేశం భూమిలో ఒక ముక్క కాదు, ఇది సజీవ దేశం అని చెప్పిన అటల్ బీహారి వాజపేయి బయోపిక్ కోసం బాలీవుడ్లో రంగం సిద్ధమయ్యింది. భనుశాలి ప్రొడక్షన్స్ పై వినోద్ ఈ మూవీని జూన్ నెలలో అనౌన్స్ చేశారు. అప్పటినుంచి అటల్ బిహారీ వాజపేయిగా ఎవరు నటిస్తున్నారు అనే విషయం బీ-టౌన్ లో ఆసక్తికరంగా మారింది. ఈ సస్పెన్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ, మిర్జాపూర్ ఫేమ్ పంకజ్ త్రిపాఠి లైం లైట్ లోకి వచ్చాడు. వాజపేయిగా…
భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయ్ వర్థంతి సందర్భంగా దేశం మొత్తం ఆయనకు నివాళులర్పిస్తోంది.. ఆయన సేవలను స్మరిస్తోంది.. 1924 డిసెంబర్ 25న మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్లో జన్మించిన అటల్ బిహారీ వాజ్పేయ్.. 2018 ఆగస్టు 16న కన్నుమూశారు.. భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నేత ఆయన.. మొదటిసారిగా రెండవ లోక్సభకు ఎన్నికయ్యారు. మధ్యలో 3వ, 9వ లోక్సభలకు తప్పించి 14వ లోక్ సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం…
దేశవ్యాప్తంగా కార్గిల్ వీరులకు నివాళులు అర్పిస్తున్నారు. భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు ప్రయత్నించిన పాకిస్తాన్ కు కార్గిల్ యుద్ధం ద్వారా ధీటైన జవాబు చెప్పింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్ పై 1999లో కార్గిల్ యుద్ధంలో గెలుపొందిన సందర్భంగా ప్రతీ ఏడాది జూలై 26న కార్గిల్ విజయ్ దివాస్ గా జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కార్గిల్ వీరులకు నివాళులు అర్పించారు.
అటల్ బిహారీ వాజపేయి నిష్కళంక దేశభక్తుడే కాదు… ప్రధానిగా దేశానికి సేవ చేసిన గొప్ప రాజకీయనాయకులు. 1924 డిసెంబర్ 24న గ్వాలియర్ లోని మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన వాజపేయి గ్వాలియర్ లో ఉన్నత విద్యను అభ్యసించారు. యుక్తవయసులో ఆర్యసమాజ్ లో చేరిన వాజపేయి ఆ తర్వాత ఆర్.ఎస్.ఎస్. ప్రభావానికి లోనై ప్రచారక్ గా బాధ్యతలు స్వీకరించారు. పాత్రికేయునిగా విశేష సేవలు అందించిన ఆయన ఆ తర్వాత భారతీయ జనసంఘ్, బీజేపీ పార్టీలలో అతున్నత పదవులను అధిష్టించారు.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోఖ్రాన్ అణు పరీక్షపై ట్వీట్ చేశారు. నేషనల్ టెక్నాలజీ డే సందర్భంగా పోఖ్రాన్ అణు పరీక్షలను గుర్తు చేశారు. 1998లో నిర్వహించిన పోఖ్రాన్ అణు పరీక్ష విజయవంతానికి కారణం అయిన శాస్త్రవేత్తలకు, వారి కృషికి థాంక్స్ చెప్పారు ప్రధాని మోదీ. శాస్త్రవేత్తల కృషి వల్లే 1998 అణు పరీక్షలు విజయవంతం అయ్యాయని ఆయన ట్వీట్ చేశారు. అప్పటి ప్రధాని అటల్ బీహారీ వాజ్ పేయి ధైర్యం చూపారంటూ.. అటల్ జీ నాయకత్వానికి…
మనదేశ రాజకీయాల్లో ప్రధానమంత్రులది కీలక స్థానం. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న వేళ ప్రధానమంత్రుల మ్యూజియం ప్రారంభమయింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి భారత్కు ప్రధాన మంత్రులుగా సేవలందించిన వారి జీవిత విశేషాలను వివరించేలా ఢిల్లీలో ఏర్పాటు చేసిన మ్యూజియంను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ప్రసంగించారు. ప్రతి యుగంలో, ప్రతి తరంలో ప్రజాస్వామ్యాన్ని మరింత సాధికారికంగా, ఆధునికంగా మార్చడానికి నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉంది. మారుమూల పల్లె నుంచి, పేదరికం నుంచి, రైతు కుటుంబం నుంచి ప్రధాని పదవిని…