Atal Bihari Vajpayee: రాజకీయ దురంధరుడు వాజ్పేయ్ వర్ధంతి.. ప్రముఖుల నివాళి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atal Bihari Vajpayee: భారత మాజీ ప్రధాని, దివంగత నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయ్ వర్ధంతి(ఆగస్టు 16) సందర్భంగా ఢిల్లీలో ప్రముఖులు నివాళులర్పించారు. వాజ్పేయి స్మారక కేంద్రం అటల్ సదైవ్ వద్ద రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని మోడీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా శ్రద్ధాంజలి ఘటించారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ తదితరులతో పాటు వాజ్పేయి దత్తత కూతురు నమితా కౌల్ భట్టాచార్య సైతం ఈ నివాళి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. వాజ్పేయి సేవలను గుర్తు చేసుకున్నారు. ఆయన ఆలోచనలు, మాటలు ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటాయన్నారు. దేశ అభివృద్ధికి అటల్జీ చేసిన సేవలను మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలన్నారు.
Delhi | President Droupadi Murmu pays floral tribute to former Prime Minister #AtalBihariVajpayee on his death anniversary, at Sadaiv Atal. pic.twitter.com/WPAkfMrHP1
Also Read
- RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
- Karnataka: త్వరలో కాంగ్రెస్ హైకమాండ్ భేటీ.. తేల్చేయనున్న కర్ణాటక పంచాయితీ!
- Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
- Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
— ANI (@ANI) August 16, 2022
Delhi | Vice President Jagdeep Dhankhar pays floral tribute to former Prime Minister #AtalBihariVajpayee on his death anniversary, at Sadaiv Atal. pic.twitter.com/dFCfKSMyAQ
— ANI (@ANI) August 16, 2022
వాజ్పేయ్ తన ముక్కుసూటి నిర్ణయాలతో రాజకీయ దురంధరుడిగా భారత రాజకీయాల్లో ఓ చెరగని ముద్ర వేశారు. రాజనీతిజ్ఞుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ అజాత శత్రువనే గుర్తింపు దక్కించుకున్న అతికొద్ది మందిలో ఈయనొకరు. సాహితి లోకానికి కవిగా, దాదాపు ఆరేళ్లపాటు భారత దేశానికి ప్రధానిగా, బీజేపీ కీలకనేతగా, అశేష జనాదరణ ఉన్న ప్రముఖుడిగా వాజ్పేయ్ గుర్తింపు పొందారు.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi pays floral tribute to former Prime Minister #AtalBihariVajpayee on his death anniversary, at Sadaiv Atal. pic.twitter.com/FKBbnrhjbe
— ANI (@ANI) August 16, 2022
Former President Ram Nath Kovind, Lok Sabha Speaker Om Birla, and BJP national president JP Nadda pay floral tributes to former Prime Minister #AtalBihariVajpayee on his death anniversary, at Sadaiv Atal. pic.twitter.com/cb15bTk7Ld
— ANI (@ANI) August 16, 2022
భారత ప్రధానిగా సేవలందించిన అటల్ బిహారీ వాజ్పేయి 93 ఏళ్ల వయసులో గతేడాది ఆగస్టు 16న తీవ్ర అనారోగ్యంతో కన్నుమూశారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన వాజ్పేయి 1996-2004 మధ్య మూడుసార్లు దేశ ప్రధానమంత్రిగా ప్రమాణం చేశారు. దాదాపు 47 ఏళ్లపాటు పార్లమెంటేరియన్గా కొనసాగిన వాజపేయి 10 పర్యాయాలు లోక్సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. పోఖ్రాన్ అణు పరీక్ష, కార్గిల్ యుద్ధం, ఢిల్లీ-లాహోర్ బస్సుయాత్ర లాంటి నిర్ణయాలతో ఆయన దేశచరిత్రలో చెరగని ముద్రవేశారు. సుపరిపాలన, ఉన్నతమైన వ్యక్తిత్వంతో వాజ్పేయ్ రాజకీయాలకు అతీతంగా అభిమానాన్ని సంపాదించుకున్నారు. బీజేపీనే కాకుండా ఇతర పార్టీల నాయకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. ‘రైట్ పర్సన్ ఇన్ రాంగ్ పార్టీ’ అంటూ కమ్యూనిస్టులు సైతం వాజ్పేయిని కీర్తించారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : బండి భగీరథ్ అరెస్ట్ పై సీఎం రేవంత్ రియాక్షన్..
-
RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
-
GT vs CSK: టాస్ గెలిచిన రుతురాజ్ గైక్వాడ్.. గిల్ సేనకు మొదట బ్యాటింగ్ సవాల్..
-
Twisha Sharma: తెలుగు నటి ట్విషా శర్మ మృతి కేసులో అత్త గారికి ప్రభుత్వం షాక్.. కీలక పదవి నుంచి తొలగింపు
-
Summer Tips: ఎండ నుంచి వచ్చాక వెంటనే ఐస్ వాటర్ తాగుతున్నారా? ప్రమాదం ఇదే
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!