సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్కు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీలోని కీలక నేతలు షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రాజీనామా చేసి బీజేపీకి గూటికి చేరిపోయారు.
ముస్లిం వివాహాలు, విడాకుల చట్టాన్ని రద్దు చేసేందుకు అస్సాం ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఇక, అస్సాం ప్రభుత్వ నిర్ణయంపై రాష్ట్రంలో విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ విషయంపై ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు.
Assam: అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం వివాహ చట్టాన్ని రద్దు చేసింది. ఈ నిర్ణయం అతిపెద్ద చర్చకు దారి తీసింది. ఇది రాష్ట్రంలో యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలుకు ముందడుగుగా పరిగణించబడుతోంది.
Amritpal Singh: ఖలిస్తానీ నేత, వివాదాస్పద వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్పాల్ సింగ్, అతని అనుచరులు అస్సాంలోని అత్యంత భద్రత కలిగిన జైలులో ఉన్నారు. అస్సాంలోని దిబ్రూగఢ్ సెంట్రల్ జైలో భారీ భద్రత కలిగిన జైలులో భద్రత ఉల్లంఘన వెలుగులోకి వచ్చింది. వేర్పాటువాద నేత, అతని 9 మంది సహచరులు ఉన్న సెల్ నుంచి స్పై కెమెరాలు, స్మార్ట్ ఫోన్, కీప్యాడ్ ఫోన్, పెన్ డ్రైవ్స్, బ్లూటూత్ హెడ్ ఫోన్స్, స్పీకర్లు, స్మార్ట్ వాచ్…
2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను అస్సాం ప్రభుత్వం సోమవారం 2.9 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ను సమర్పించింది. 774.47 కోట్ల లోటును బడ్జెట్ అంచనా వేసింది. ఇందులో కొత్త పన్ను ఏదీ ప్రతిపాదించలేదు.
INDIA bloc: 2024 లోక్సభ ఎన్నికల ముందు ఇండియా కూటమిలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కాంగ్రెస్ తీరుపై గుర్రుగా ఉంది. బెంగాల్లో పొత్తు ఉండదని ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కూడా కాంగ్రెస్తో పొత్తు ఉండదని ప్రకటించింది.
PM Modi: ప్రధాని నరేంద్రమోడీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. అస్సాంలో పలు అభివృద్ధి కార్యక్రమాల కోసం వెళ్లిన ప్రధాని, అక్కడ ర్యాలీలో మాట్లాడారు. స్వాతంత్ర్యానంతరం అధికారంలో ఉన్న వారు ప్రార్థనా స్థలాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోలేకపోయారని, తమ సంస్కృతిని, గతాన్ని చూసి సిగ్గు పడ్డారని ఆదివారం అన్నారు. రాజకీయ, సొంత ప్రయోజనాల కోసం తమ స్వంత సంస్కృతి మరియు చరిత్ర గురించి సిగ్గుపడే ధోరణిని ప్రారంభించారని,
Kerala: కేరళలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఆకలి బాధతో ఉన్న ఓ వ్యక్తి చనిపోయిన పిల్లిని పచ్చి మాంసం తిన్నాడు. ఈ ఘటనను చూసిన ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. దిగ్భ్రాంతికరమైన ఈ ఘటన ఉత్తర కేరళ జిల్లాలోని కుట్టిప్పురంలో జరిగింది. అస్సాంకు చెందిన ఓ వ్యక్తి రోజుల తరబడి ఆహారం లేక పిల్లి పచ్చి మాంసాన్ని తింటూ కనిపించాడు.
Himanta Biswa Sarma: అస్సాం సీఎం, బీజేపీ నేత హిమంత బిశ్వ సర్మ, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీల మధ్య మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. ‘భారత్ జోడో న్యాయ యాత్ర’లో భాగంగా అస్సాం లోకి ప్రవేశించినప్పటి నుంచి ఇద్దరి మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చెలరేగుతూ ఉన్నాయి. ఇటీవల సీఎం హిమంత మాట్లాడుతూ.. యాత్రలో రాహుల్ గాంధీ తన ‘బాడీ డబుల్’ ఉపయోగించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.