Trump Video: దావోస్లో ఆసక్తికర పరిణామం.. అసిమ్ మునీర్ వైపు వేలు చూపిస్తూ నవ్వుకున్న ట్రంప్-షెహబాజ్
- దావోస్లో ఆసక్తికర పరిణామం
- అసిమ్ మునీర్ వైపు వేలు చూపిస్తూ నవ్వుకున్న ట్రంప్-షెహబాజ్
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దావోస్ వేదికగా ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఏర్పాటైంది. ట్రంప్ అధ్యక్షతన ఈ శాంతి మండలి ఏర్పాటైంది. ఈ బోర్డులోకి 50 దేశాలను ఆహ్వానించగా.. 35 దేశాలు చేరాయి. ఇక దావోస్లో సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: US-Canada: అమెరికా-కెనడా మధ్య ఉద్రిక్తతలు.. బోర్డ్ ఆఫ్ పీస్ ఆహ్వానాన్ని వెనక్కి తీసుకున్న ట్రంప్
Also Read
- Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
- Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
- US-Iran: ఒప్పందానికి దగ్గరగా ఉన్నాం.. ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- Donald Trump: భారత నౌకలపై డ్రోన్ దాడి.. ఇరాన్పై ట్రంప్ సంచలన ఆరోపణలు
బోర్డ్ ఆఫ్ పీస్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ట్రంప్ ఎడమ వైపు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూర్చున్నారు. ఈ సందర్భంగా ట్రంప్కు షరీఫ్ షేక్హాండ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ చెవిలో గుసగుసలాడారు. ఈ క్రమంలో అసిమ్ మునీర్ ఎక్కడా? అని ట్రంప్ అడిగినట్లు ఉన్నారు. వెంటనే స్టేజ్ ముందు కూర్చున్న అసిమ్ మునీర్ను ఫరీఫ్ చూపించారు. ట్రంప్ కూడా అసిమ్ మునీర్ చూసి.. వేలు చూపించి గుర్తుపట్టారు. ఈ సందర్భంగా షరీఫ్-ట్రంప్ నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో పాకిస్థాన్తో ట్రంప్కు ఎలాంటి సంబంధాలు ఉన్నాయో అర్థమవుతోంది.
భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్థాన్తో ట్రంప్ సంబంధాలు పెంచుకున్నారు. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ను వైట్హౌస్కు పిలిచి ప్రత్యేక విందు కూడా ఇచ్చారు. అనంతరం ఐక్యరాజ్యసమితి సదస్సులో పాల్గొనేందుకు న్యూయార్క్ వెళ్లినప్పుడు కూడా మరోసారి షరీఫ్, మునీర్ ట్రంప్ను కలిశారు.
గాజాలో పరిపాలన కోసం ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్’ ఏర్పాటు చేశారు. ఈ శాంతి మండలిలో చేరాలని భారత్ సహా 50 దేశాలను పిలిచారు. అయితే తొలుత ఇజ్రాయెల్ వ్యతిరేకించినా.. అనంతరం అంగీకారం తెలిపారు. ఇక ముస్లిం దేశాలు స్వాగతించాయి. ఇక యూరోపియన్ దేశాలైతే తిరస్కరించాయి. ఇదిలా ఉంటే కెనడాను ఆహ్వానించి తిరిగి వెనక్కి తీసుకున్నారు. ఇక ఈ బోర్డులో భారత్ చేరలేదు. ఇక ఈ బోర్డులో పాకిస్థాన్ చేరడంతో సోషల్ మీడియాలో పంచ్లు పేలుతున్నాయి.
Showbaz pointing at Asim Munir in the audience to show Trump where is the boss sitting pic.twitter.com/s9HlvoY4e7
— Gabbar (@GabbbarSingh) January 22, 2026
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!