Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీ కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. మధ్యంతర బెయిల్ని కోర్టు తిరస్కరించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఈడీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను కేంద్ర ప్రభుత్వం హింస్తోందని ఆప్ మంత్రి అతిశీ ఆరోపించారు. ఆమె మీడియాతో మాట్లాడారు. జైల్లో కేజ్రీవాల్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణించేందుకు మోడీ ప్రభుత్వమే కారణమని ఆమె ఆరోపించారు.
Arvind Kejriwal: లోక్సభ ఎన్నికలు ముగియడంతో సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్పై వచ్చిన ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు తీహార్ జైలులో లొంగిపోతున్నారు. అతని ఇంటి నుంచి బయలుదేరిని కేజ్రీవాల్, రాజ్ ఘాట్లో మహాత్మా గాంధీకి నివాళులు అర్పించిన తర్వాత హనుమాన్ మందిర్ని దర్శించారు
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న ఆప్ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో లొంగిపోయేందుకు తన నివాసం నుంచి బయలుదేరారు. మార్గం మధ్యలో రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీనికి నివాళులు అర్పించనున్నారు.
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఈరోజు తిరిగి తీహార్ జైలుకు వెళ్లనున్నారు. ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్కు మే 10న సుప్రీంకోర్టు 21 రోజుల బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో మధ్యంతర బెయిల్ ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు తీహార్ జైలుకు తిరిగి వెళ్లన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.. అయితే చివరి దశ పోలింగ్ ముగిసిన ఒక రోజు తర్వాత లొంగిపోవాలని కోర్టు తెలిపింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఊరట లభించలేదు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిందితుడుగా ఉన్నారు. మార్చిలో ఈడీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయగా, 50 రోజులు తీహార్ జైలులో ఉన్న తర్వాత, ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టులో చుక్కెదురైంది. ఆయన వేసిన రెండు పిటిషన్లలో ఉపశమనం లభించలేదు. సుప్రీంకోర్టు కల్పించిన మధ్యంతర బెయిల్ కొనసాగించాలని.. వైద్య పరీక్షల కోసం రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని ఆయన పిటిషన్లు వేసుకున్నారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ జూన్ 2న లొంగిపోయేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు కేజ్రీవాల్కి జూన్ 1 వరకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
శనివారంతో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు లభించిన మధ్యంతర బెయిల్ గడువు ముగుస్తుంది. సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారంలో సుప్రీంకోర్టు 21 రోజులు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. జూన్ 1వరకు బెయిల్ ఇచ్చింది.