Arvind Kejriwal: నేడు తీహార్ జైలుకు వెళ్లనున్న ఢిల్లీ సీఎం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన అవినీతి కేసులో మధ్యంతర బెయిల్ ముగియడంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేడు తీహార్ జైలుకు తిరిగి వెళ్లన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.. అయితే చివరి దశ పోలింగ్ ముగిసిన ఒక రోజు తర్వాత లొంగిపోవాలని కోర్టు తెలిపింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ కోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఊరట లభించలేదు.
Earthquake: మణిపూర్లో తెల్లవారుజామున స్వల్ప భూకంపం..
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకోవడానికి మధ్యంతర బెయిల్ను మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని కేజ్రీవాల్ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో శనివారం విచారణ జరగగా.. బెయిల్ను ఈడీ వ్యతిరేకించింది. ఆయన వాస్తవాలను తొక్కిపట్టి, తన ఆరోగ్యంతో సహా పలు విషయాల్లో తప్పుడు ప్రకటనలు చేశారని దర్యాప్తు సంస్థ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. ఈ క్రమంలో.. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పై నిర్ణయాన్ని ఈనెల 5వ తేదీకి వాయిదా వేసింది. ఆ రోజు తీర్పు వెలువరించనుంది. దీంతో.. సుప్రీం ఆదేశాల మేరకు కేజ్రీవాల్ ఈరోజు జైలు అధికారుల ముందు లొంగిపోనున్నారు. మద్యం కుంభకోణం అంశంలో మనీలాండరింగ్ కేసుపై మార్చి 21న కేజ్రీవాల్ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే..
Rudraprayag : గంటకు 1800 మంది భక్తులకు కేదార్ దర్శనం.. ఆలయ కమిటీ ప్రణాళిక
కాగా.. ఈరోజు జైలు అధికారుల ముందు లొంగిపోవడానికి మధ్యాహ్నం 3 గంటలకు తన ఇంటి నుండి బయలుదేరతానని కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాము నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని.. దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తే, సంతాపం చెందవద్దని కేజ్రీవాల్ బహిరంగ సభలో మాట్లాడారు. పాలసీ ముసాయిదా రూపకల్పనలో.. మద్యం లైసెన్స్ల కోసం తిరిగి లంచాలు కోరడంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కీలక పాత్ర పోషించారని దర్యాప్తు సంస్థ అభిప్రాయపడింది. ఆప్కి రూ. 100 కోట్ల ముడుపులు అందాయని తెలిపింది. కాగా.. ఈ ఆరోపణలను కేజ్రీవాల్ ఖండించారు. ఎన్నికలకు ముందు అరెస్టును “రాజకీయ ప్రతీకారం” అని అన్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!