Arvind Kejriwal: జైలులో కేజ్రీవాల్ని కలిసిన అతిషి, రాఘవ్ చద్దా.. ఢిల్లీ నీటి సంక్షోభంపై చర్చ..
- జైలులో కేజ్రీవాల్ని కలిసిన ఆప్ నేతలు..
- ఢిల్లీ నీటి సంక్షోభంపై చర్చ..
- ప్రజల గురించే సీఎం ఆలోచిస్తున్నారన్న అతిషి..
Arvind Kejriwal: ఢిల్లీలో నీటి సంక్షోభం తారాస్థాయికి చేరింది. నీటి కోసం ప్రజలు ట్యాంకర్ల వెంట గుమిగూడిన దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీలో కొనసాగుతున్న నీరు మరియు విద్యుత్ సంక్షోభాల మధ్య, తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని మంత్రి అతిషీ, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాలు ఈ రోజు కలిశారు. సీఎం కేజ్రీవాల్ వీలైనంత త్వరగా ఢిల్లీలో నీటి సమస్యల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
‘‘కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసుతో తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ని ఈ రోజు కలిశాను. ఆయన తన కన్నా ఢిల్లీ ప్రజల గురించే ఆందోళన చెందుతున్నారు. విద్యుత్, నీటి సమస్యల గురించి ఆరా తీశారు. ఢిల్లీలో నీటి ఎద్దడిని తాను తీహార్ జైలులో చూసినట్లు చెప్పారు.’’ అని మీడియాతో అతిషి అన్నారు. వీలైనంత త్వరగా నీటి ఎద్దడిని అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలు మరియు ఏర్పాట్లు చేయాలని కేజ్రీవాల్ తమని ఆదేశించారని చెప్పారు. ఆప్ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి వారి ప్రాంతాల ప్రజలకు నీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారని అన్నారు.
Also Read
- Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
- AC Blast: ఏసీ పేలుడు 9 మంది మృతికి ఎలా కారణమైంది.? ఢిల్లీ ఘటనలో కీలక విషయాలు..
- Jabalpur Boat Tragedy: "లైఫ్ జాకెట్" ఉన్నా తల్లి బిడ్డ ఎలా మరణించారు.?
- Marriage: ‘నాకు 67 ఏళ్లు.. నా పెళ్లి కచ్చితంగా జరుగుతుంది’.. సినీ హీరో సంచలన వ్యాఖ్యలు..
Read Also: UP: టెర్రస్ పై నిద్రిస్తున్న 6ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లిన చిరుత..ప్రాణాలు వదిలిన చిన్నారి
రెండు రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్లో అగ్ని ప్రమాదం కారణంగా ఢిల్లీలో విద్యుత్ కోతల గురించి కూడా కేజ్రీవాల్ ఆరా తీశారని, భవిష్యత్తులో విద్యుత్ సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు సంబంధిత అధికారులతో సమావేశాలను నిర్వహించాలని సూచించినట్లు అతిషి చెప్పారు. జైలులో ఉండి కూడా కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలు, వారి సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని ఆమె వెల్లడించారు. బుధవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ తీహార్లో కేజ్రీవాల్ను పరామర్శించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ని మార్చిలో ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపుగా 50 రోజులు జైలులో ఉన్న తర్వాత ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మే నెలలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 20 రోజుల తర్వాత ఆయన జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోయారు. ఈ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని ఈడీ ఆరోపించింది.
తాజావార్తలు
-
Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
-
Instant Dosa : దోశ పిండి లేదా.? కేవలం నిమిషాల్లోనే అప్పటికప్పుడు వేసుకునే ఇన్స్టెంట్ క్రిస్పీ దోశ ఇలా..!
-
KKR: ద్వితియార్థంలో దూసుకుపోతున్న కేకేఆర్.. ఈ ఒక్క సూత్రమే వారి జోరుకు కారణమా..?
-
Mamata Banerjee: ఫలితాలకు ముందే దీదీ షాకింగ్ నిర్ణయం.. సీఎం నివాసం ఖాళీ..?
-
Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ ‘రాగి తీపి కుడుములు’ ఇలా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!