Arvind Kejriwal: జైలులో కేజ్రీవాల్ని కలిసిన అతిషి, రాఘవ్ చద్దా.. ఢిల్లీ నీటి సంక్షోభంపై చర్చ..
- జైలులో కేజ్రీవాల్ని కలిసిన ఆప్ నేతలు..
- ఢిల్లీ నీటి సంక్షోభంపై చర్చ..
- ప్రజల గురించే సీఎం ఆలోచిస్తున్నారన్న అతిషి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీలో నీటి సంక్షోభం తారాస్థాయికి చేరింది. నీటి కోసం ప్రజలు ట్యాంకర్ల వెంట గుమిగూడిన దృశ్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఢిల్లీలో కొనసాగుతున్న నీరు మరియు విద్యుత్ సంక్షోభాల మధ్య, తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని మంత్రి అతిషీ, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాలు ఈ రోజు కలిశారు. సీఎం కేజ్రీవాల్ వీలైనంత త్వరగా ఢిల్లీలో నీటి సమస్యల్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
‘‘కేంద్ర ప్రభుత్వం తప్పుడు కేసుతో తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ని ఈ రోజు కలిశాను. ఆయన తన కన్నా ఢిల్లీ ప్రజల గురించే ఆందోళన చెందుతున్నారు. విద్యుత్, నీటి సమస్యల గురించి ఆరా తీశారు. ఢిల్లీలో నీటి ఎద్దడిని తాను తీహార్ జైలులో చూసినట్లు చెప్పారు.’’ అని మీడియాతో అతిషి అన్నారు. వీలైనంత త్వరగా నీటి ఎద్దడిని అధిగమించేందుకు అవసరమైన అన్ని చర్యలు మరియు ఏర్పాట్లు చేయాలని కేజ్రీవాల్ తమని ఆదేశించారని చెప్పారు. ఆప్ ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలోకి వెళ్లి వారి ప్రాంతాల ప్రజలకు నీరు అందించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారని అన్నారు.
Also Read
Read Also: UP: టెర్రస్ పై నిద్రిస్తున్న 6ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లిన చిరుత..ప్రాణాలు వదిలిన చిన్నారి
రెండు రోజుల క్రితం ఉత్తర్ ప్రదేశ్లో అగ్ని ప్రమాదం కారణంగా ఢిల్లీలో విద్యుత్ కోతల గురించి కూడా కేజ్రీవాల్ ఆరా తీశారని, భవిష్యత్తులో విద్యుత్ సంక్షోభం తలెత్తకుండా ఉండేందుకు సంబంధిత అధికారులతో సమావేశాలను నిర్వహించాలని సూచించినట్లు అతిషి చెప్పారు. జైలులో ఉండి కూడా కేజ్రీవాల్ ఢిల్లీ ప్రజలు, వారి సమస్యల గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని ఆమె వెల్లడించారు. బుధవారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ తీహార్లో కేజ్రీవాల్ను పరామర్శించారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్ని మార్చిలో ఈడీ అరెస్ట్ చేసింది. దాదాపుగా 50 రోజులు జైలులో ఉన్న తర్వాత ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మే నెలలో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 20 రోజుల తర్వాత ఆయన జూన్ 2న తీహార్ జైలులో లొంగిపోయారు. ఈ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ప్రధాన సూత్రధారి అని ఈడీ ఆరోపించింది.
తాజావార్తలు
-
Rajesh Sharma : ఫౌజీ షూటింగ్లో రాజేష్ శర్మకు విషపురుగు కాటు?.. అసలు నిజం బయటపెట్టిన పీఏ!
-
Viral Video: ‘గ్రౌండ్లో పరుగెత్తలేను.. నేను ముసలివాడిని అయిపోయాను’: ఎంఎస్ ధోనీ
-
Jofra Archer: “ఇది ఐపీఎల్ కాదు”.. టీమిండియా ఘోర పతనంపై జోఫ్రా ఆర్చర్ సంచలన వ్యాఖ్యలు!
-
Fake Condoms: “కండోమ్”లను కూడా వదలని చైనా.. ఏకంగా 2 లక్షల నకిలీ మాల్ స్వాధీనం..
-
Telangana Farmers: తెలంగాణ రైతులకు శుభవార్త.. రూ.10లతో యూరియా బుకింగ్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..