Arvind Kejriwal: కేజ్రీవాల్ కోసం అంబులెన్స్ పంపిన బీజేపీ నాయకుడు.. ఎందుకంటే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ కేసులో సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నిందితుడుగా ఉన్నారు. మార్చిలో ఈడీ కేజ్రీవాల్ని అరెస్ట్ చేయగా, 50 రోజులు తీహార్ జైలులో ఉన్న తర్వాత, ఎన్నికల ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న ఆయన లొంగిపోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే, తాను అనారోగ్య కారణాలతో బాధపడుతున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు. పీఈటీ-సీటీ స్కాన్తో సహా కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోవాల్సిన నేపథ్యంలో మరో ఏడు రోజులు తన మధ్యంతర బెయిల్ పొడగించాలని కోరుతూ కేజ్రీవాల్ మే 26న సుప్రీంకోర్టు ఆశ్రయించారు. అతను జైలులో 7 కిలోల బరువు కోల్పోయాడని మరియు అతని కీటోన్ స్థాయిలు “చాలా ఎక్కువ” ఉన్నాయని పేర్కొన్నాడు.
Read Also: Kejriwal: కేజ్రీవాల్కు దొరకని ఉపశమనం.. రేపు జైల్లో సరెండర్
Also Read
- Mamata Banerjee: ‘‘నన్ను ఆపాలంటే చంపాలి’’.. మమతా దీదీ సంచలన వ్యాఖ్యలు..
- Mumbai: భారీ వర్షాలతో ఆర్థిక రాజధాని అతలాకుతలం.. 12 గంటల్లో 200 మి.మీ రికార్డ్ వర్షం
- PoK: పీఓకేలో పాక్ అణచివేత.. భారత్ జోక్యం కోరిన JAAC
- Stocks Double: రూ. లక్షకు రూ.2 లక్షలు.. రూ.3 లక్షలకు రూ.6 లక్షలు.. ఇలాంటి స్టాక్స్ మనం ఎలా మిస్సయామబ్బా..
అయితే, ఢిల్లీ సీఎం తీవ్ర అనారోగ్య కారణాలతో బాధపడుతున్నానని చెప్పడంతో, బీజేపీ సీనియర్ నేత విజయ్ గోయల్ శనివారం అంబులెన్స్ పంపించడం చర్చనీయాంశంగా మారింది. సివిల్ లైన్స్లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్తున్న అంబులెన్స్ని, గోయల్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ అంబులెన్స్ కేజ్రీవాల్ ఏదైనా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు తీసుకువచ్చానని, అక్కడ అతడికి అన్ని పరీక్షలు కేవలం రెండు గంటలలోపు చేయబడతాయని గోయల్ విలేకరులతో అన్నారు. సీఎం కేజ్రీవాల్ తన ఆరోగ్యం గురించి ఆందోళన చెందితే, నాటకాలు ఆపి తనతో పరీక్షలకు రావాలని కేంద్ర మాజీ మంత్రి అన్నారు. ప్రజల సానుభూతి పొందేందుకు కేజ్రీవాల్ ఆరోగ్య సమస్యలను చూపుతూ ‘డ్రామా’ సృష్టిస్తున్నారని గోయల్ ఆరోపించారు.
దీనికి ముందు ఆప్ నేత, ఢిల్లీ మంత్రి అతిషీ మాట్లాడుతూ.. కేజ్రీవాల్ కీటోన్ లెవల్స్ ఎక్కువగా ఉన్నాయని, ఇది మూత్రపిండాల సమస్యలు లేదా క్యాన్సర్ లక్షణం కావచ్చని వైద్యులు చెప్పారని వెల్లడించారు. మే 10న సుప్రీంకోర్టు ఎన్నికల ప్రచారం నిర్వహించుకునేందుకు కేజ్రీవాల్కి 21 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఏడు దశల పోలింగ్ జూన్ 1తో ముగుస్తుండటంతో, జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
Medigadda Barrage : మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి పెరుగుతున్న వరద.. 85 గేట్లు ఎత్తివేత
-
Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
-
IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
-
OTR: ప్రతిపక్షం ట్రాప్లో పడుతున్నామని కాంగ్రెస్ పార్టీలో చర్చ
-
OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!