ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 24 గంటల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. వీటి ప్రభావం వల్ల మరో మూడు రోజుల పాటు పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది.
ఆంధ్రా ఊటీ అరకువ్యాలీ చలి ఉత్సవాలకు సిద్ధం అయింది. ఉర్రూతలూగించే అడ్వెంచర్స్, హెలీ రైడ్స్ ఒక పక్క.. గిరిజన సాంప్రదాయ కార్నివాల్ మరోపక్క.. ఎటు చూసిన ధూమ్ ధామ్ వాతావరణమే కనిపించనుంది. ఏజెన్సీ పర్యాటకాన్ని మరింత ప్రమోట్ చేసేందుకు అరకు ఫెస్ట్ ను అట్టహాసంగా నిర్వహిస్తోంది పర్యాటక శాఖ. జనవరి 31 నుంచి మూడు రోజులపాటు అరకు చలి ఉత్సవం నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు జరిగాయి..
ఆంధ్రా ఊటీగా పేరుగాంచిన అరకు లోయను ఇష్టపడని వారుండరు. శీతాకాలంలో ప్రకృతి అందాలను ఆస్వాధించేందుకు ఎంతో మంది అరకు వస్తుంటారు. అరకు లోయతో పాటు బొర్రా గుహలు, లంబసింగి, వంజంగి మేఘాల కొండలు లాంటి ప్రకృతి రమణీయ ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ ప్రాంతాలను సందర్శించేందుకు వేలాది మంది పర్యటకులు తరలివస్తుంటారు. ఈ క్రమంలో క్రిస్మస్, న్యూ ఇయర్ నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి. Also Read: Tollywood Industry Meeting…
అరకు పర్యాటకులకు గుడ్న్యూస్.. ఆంధ్రా ఊటీ అరకు అందాలను ఆకాశంలో నుంచి చూస్తే ఎలా వుంటుంది..!?. ఎప్పటి నుంచో ఈ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న పర్యాటకులకు ఇప్పుడు గుడ్ న్యూస్. ఇవాళ్టి నుంచి అరకు వ్యాలీలో హాట్ ఎయిర్ బెలూన్ అందుబాటులోకి వచ్చింది.
గిరిజన గ్రామాల్లో గర్భిణులకు ఇక్కట్లు తప్పడం లేదు. వైద్య సదుపాయాల కోసం నరకయాతన పడుతున్నారు. పురిటి నొప్పులు వస్తే గర్భిణిని డోలీలో మోసుకెళ్లాల్సిందే. అల్లూరి జిల్లా అరకులోయ ఏజెన్సీలో గిరిజన గ్రామానికి చెందిన గర్భిణికి నొప్పులు రావడంతో డోలీ కట్టి కిలోమీటర్ల దూరం మోసుకుంటూ వచ్చారు. మార్గ మధ్య లో 108అంబులెన్స్ రావడం తో ఎక్కించారు. ప్రస్తుతం పరిస్థితి బాగానే ఉంది అన్ని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థినుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే తెలంగాణలోని భువనగిరి సాంఘీక వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటన మరువక ముందే ఆంధ్రప్రదేశ్ లో మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా.. అల్లూరి జిల్లా అరకు లోయలో హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
జీవనాధారం తాగునీరు. ఏ జీవి అయినా ముందుగా తాగేందుకు నీటి కోసం చూస్తుంది. మనుషులైతే నీరు ఎక్కడ దొరుకుతుందోనని ఎదురుచూస్తుంటాడు. అల్లూరిసీతారామరాజు జిల్లా అరకులోయ పర్యాటకులకు స్వర్గథామం. అయితే అక్కడ వుండే స్థానికులకు మాత్రం ప్రకృతి అందాలు ఏమాత్రం ఆనందాన్ని ఇవ్వవు. తాగేందుకు నీరుంటే వారికి చాలు. అరకులోయ మండలం బస్కీపంచాయతీ రంగినిగూడ గ్రామస్తుల దుస్థితి అంతా ఇంతా కాదు. తాగేందుకు గుక్కెడు నీరు దొరక్క వారు పడుతున్న కష్టాలు అధికారులకు కనిపించడంలేదు. తాగునీటి సమస్య పరిష్కారం…
విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలి వణికిస్తుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఇప్పటికే శీతల గాలుల ప్రభావంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట చలి అధికంగా ఉండటంతో పనులకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శీతలగాలులు, దట్టమైన పొగమంచును కప్పి ఉన్న పలు పర్యాటక ప్రాంతాలు. చూడటానికి సుందరంగా ఉన్న చలి కారణంగా వాటిని పూర్తి స్థాయిలో ఆస్వాదించలేకపోతున్నారు. Also Read: మళ్లీ భారీగా పెరిగిన పసిడి ధర ఏజెన్సీలోని వరుసగా…