ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వ పని చేస్తోంది. ఇందులో బాగంగా రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ సరుకుల పంపిణీలో నూతన విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ప్రతి రేషన్ షాప్ వద్ద ‘క్యూఆర్ కోడ్’ పోస్టర్లను ఏర్పాటు చేసింది. రేషన్ కార్డు దారులు ఆ క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి.. తమ అభిప్రాయాలు, ఫిర్యాదులు తెలియచేయవచ్చు. అభిప్రాయాలు, ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన వెబ్ ఫారమ్లో సరైన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది.…
అఖండ గోదావరి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో అభివృధి చేస్తాం అని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. రాజమండ్రిలో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకోవడం ఆనందదాయకమన్నారు. 2035 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 30 లక్షల మంది పర్యాటకులు వచ్చేలా చేస్తామన్నారు. రాజమండ్రిని వారసత్వ సాంస్కృతిక రాజధానిగా గుర్తింపుకు చర్యలు తీసుకుంటాం అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈరోజు ఉదయం రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి టూరిజం ప్రాజెక్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రలు…
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఛలోక్తులు విసిరారు. మనం తగ్గాలి కానీ.. బుచ్చయ్య చౌదరి తగ్గరు అని అన్నారు. తనకు ఇష్టమైన నాయకులలో ఒకరు బుచ్చయ్య చౌదరి అని పవన్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం పవన్ మాట్లాడుతూ.. బుచ్చయ్య చౌదరిని ప్రశంసించారు. రాజమహేంద్రవరం అంటే గుర్తుకొచ్చేది గోదావరి తీరమని, అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం తనకు ఆనందంగా…
ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్లో దర్శనమిచ్చారు. డిప్యూటీ సీఎం అయ్యాక మొదటిసారి డిఫరెంట్ లుక్లో కనిపించారు. ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి అయినప్పటి నుంచి వైట్ కుర్తా ఫైజామాలోనే పవన్ ఎక్కువగా కనిపించారు. చాలా రోజులు తర్వాత ఈరోజు రాజమహేంద్రవరంలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్ శంకుస్థాపనకు షర్ట్, ఫ్యాంట్ వేసుకొచ్చారు. షర్ట్, ఫ్యాంట్తో టక్ చేసుకొచ్చిన పవన్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. Also Read: Akhanda Godavari Project:…
చారిత్రక నగరం రాజమహేంద్రవరంలో ‘అఖండ గోదావరి’ టూరిజం ప్రాజెక్ట్కు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కలిసి శంకుస్థాపన చేశారు. పుష్కర ఘాట్ వద్ద రూ.94.44 కోట్ల వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్ట్ను చేపట్టారు. శంకుస్థాపన కార్యక్రమంలో ఏపీ మంత్రి కందుల దుర్గేశ్, బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు. అఖండ గోదావరి ప్రాజెక్ట్తో రాజమహేంద్రవరం ఇకపై పర్యాటక శోభను సంతరించుకోనుంది. సుమారు రూ.140 కోట్లతో మూడు కీలక అభివృద్ధి పనులకు…
పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై కక్షతో సొంత కొడుకుని పురుగుల మందు తాగించి తండ్రి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది. గణపవరం మండలం జల్లి కాకినాడకు చెందిన చూడదశి చంద్రశేఖర్, స్వరూపలకు ఆరేళ్ల సాత్విక్, సృజన ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్వరూప గతంలో దుబాయ్లో ఉద్యోగం చేసి స్వగ్రామం చేరుకుంది. వచ్చే నెలలో తిరిగి దుబాయ్ వెళ్లేందుకు స్వరూప సిద్ధం అవ్వడంతో అందుకు చంద్రశేఖర్ నిరాకరించాడు. స్వరూప దుబాయ్ వెళితే కొడుకు ఏడేళ్ల…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని కొణిదెల గ్రామానికి వెళ్లనున్నారు. కొణిదెల గ్రామంలో పవన్ తన సొంత నిధులతో వాటర్ ట్యాంక్ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు. భూమి పూజ కార్యక్రమంలో జనసేన ఎమ్మెల్యేలతో పాటు నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య పాల్గొననున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కొణిదెల గ్రామ పర్యటన నేపథ్యంలో పోలీసు అధికారులు బందోబస్త్ ఏర్పాటు చేశారు. పవన్ ఇంటి పేరు ‘కొణిదెల’ అన్న విషయం తెలిసిందే. జనసేన…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్పై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. పల్నాడు జిల్లా పర్యటన సందర్భంగా వాహనం ఢీకొని చీలి సింగయ్య మృతి చెందిన కేసులో జగన్ రెండో నిందితుడిగా ఉన్నారు. తనపై నల్లపాడు పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని బుధవారం క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. గురువారం హైకోర్టు క్వాష్ పిటిషన్పై విచారణ చేపట్టనుంది. ఈ కేసులో వైఎస్ జగన్ పిటిషన్తో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి…
రాజమండ్రి (రాజమహేంద్రవరం) ప్రజల చిరకాల వాంఛగా ఉన్న ‘అఖండ గోదావరి’ ప్రాజెక్ట్కు నేడు శంఖుస్థాపన జరగనుంది. గురువారం ఉదయం 10 గంటలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్ తదితరులు.. ప్రాజెక్ట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. దాంతో ఇకపై రాజమండ్రి పర్యాటక శోభను సంతరించుకోనుంది. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా.. రాజమండ్రి నగరం, చుట్టుపక్కల ప్రాంతాలను తీర్చిదిద్దేందుకు అఖండ గోదావరి ప్రాజెక్ట్కు…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పల్నాడు జిల్లా రెంటపాళ్ల పర్యటనలో చిలీ సింగయ్య మృతి కేసులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు. వైసీపీ అధినేత పిటిషన్ను గురువారం (జూన్ 26) విచారిస్తామని ఏపీ హైకోర్టు తెలిపింది. సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ ఏ2గా ఉన్నారు. Also Read: CM Chandrababu: హైదరాబాద్ కంటే.. ఇంకా కొత్త తరహాలో అమరావతిని అభివృద్ధి చేస్తాం! వైఎస్ జగన్…