Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Bhumana Karunakar Reddy Ys Jagan Public Support Mango Farmers Chittoor Protest

Bhumana Karunakar Reddy: జగన్ అంటే జనం.. నేటి జన ప్రవాహం కూటమి ఓటమి ఖరారు చేసింది!

Published Date :July 9, 2025 , 10:32 pm
By Sampath Kumar
  • వైఎస్ జగన్ అంటే జనం
  • దారులు అన్ని జనాలతో కిక్కిరిసిపోయాయి
  • భయానక వాతావరణం సృష్టించారు
Bhumana Karunakar Reddy: జగన్ అంటే జనం.. నేటి జన ప్రవాహం కూటమి ఓటమి ఖరారు చేసింది!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

వైఎస్ జగన్ అంటేనే జనం అని, ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారని వైసీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. మామిడి రైతుల్లో భరోసా నింపడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మేలు చేయడానికి జగన్ బంగారుపాళ్యం మార్కెట్‌ యార్డుకు వచ్చారన్నారు. దేశంలోనే మా నాయకుడు వైఎస్ జగన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ ఉన్న లీడర్ అని పేర్కొన్నారు. రైతుల్లో భరోసా కల్పించడానికి పర్యటన చేస్తే.. తమ నాయకులను గృహ నిర్బంధం చేశారని, భయానక వాతావరణం సృష్టించారని మండిపడ్డారు. నేటి జన ప్రవాహం కూటమి ఓటమి ఖరారు చేసిందని భూమన చెప్పుకొచ్చారు.

తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ‘మామిడి రైతుల్లో భరోసా నింపడానికి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మేలు చేయడానికి వైఎస్ జగన్ బంగారుపాళ్యం వచ్చారు. బంగారుపాళ్యం వెళ్లే దారులు అన్ని జనాలతో కిక్కిరిసిపోయాయి. జగన్ గారి పర్యటనకు అడుగు అడుగునా అవాంతరాలు సృష్టించారు. మా నాయకులకు నోటీసులు ఇచ్చారు. దేశంలోనే మానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ప్రజాదరణ ఉన్న లీడర్. రైతుల్లో భరోసా కల్పించడానికి పర్యటన చేస్తే.. మా నాయకులను గృహ నిర్బంధం చేశారు, భయానక వాతావరణం సృష్టించారు. బంగారుపాళ్యంలో హిట్లర్ కాలంనాటి నాజీ పాలన కనపడింది. జగన్ అంటే జనం, ఎన్ని కుట్రలు చేసినా పెద్ద ఎత్తున జనాలు తరలి వచ్చారు. ఈ రోజు జన ప్రవాహం కూటమి ఓటమి ఖరారు చేసింది. కూటమి పాలనపై ప్రజల ఆగ్రహం ఉవ్వెత్తున ఎగిసిపడింది’ అని అన్నారు.

Also Read

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ
  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్
  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం
  • Intel Alert: ఢిల్లీలో ఉగ్రదాడికి కుట్ర.. నిఘా వర్గాల హెచ్చరికతో హై అలర్ట్..
Add as a preferred
source on google

Also Read: Pawan Kalyan: బ్యాటరీ సైకిల్ నడిపిన పవన్ కళ్యాణ్.. లక్ష ప్రోత్సాహకం! వీడియో వైరల్

‘వైఎస్ జగన్ పర్యటన ఒక సెట్టింగులా ఉంది అంటూ మంత్రి అచ్చెన్నాయుడు వాఖ్యలు సరికావు. మీ మద్దతు ధరలో 4 రూపాయలలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. జగన్ మోహన్ రెడ్డి పర్యటన ఖరారు కావడంతో కిలో ఆరు రూపాయలు ఇచ్చిన అగ్రిమెంట్లు ఉన్నాయి. చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు దగ్గరికి రండి మంత్రి అచ్చెన్నాయుడు. యాభై శాతం మామిడి తోటల్లో పంట కోయలేదు. దారి పొడవునా భయపెట్టినా.. గుట్టలు, కొండలు, తుప్పలు దాటుకుని వచ్చారు. వారంతా దగా పడ్డవారే. మా కార్యకర్తలు, మామిడి రైతులును అడ్డుకుని లాఠీ చార్జి చేశారు. దెబ్బలు తింటూ ‘వందే మాతరం’ నినదించిన స్వాతంత్ర్య పోరాట స్పూర్తి ఈరోజు మామిడి రైతులలో కనిపించింది. మామిడి రైతులు కడుపు మండి రోడ్డు పక్కనే మామిడి కాయలు పారాబోశారు’ అని భూమన కరుణాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • ap
  • Bhumana Karunakar Reddy
  • Bhumana Karunakar Reddy YS Jagan
  • ycp
  • ys jagan

తాజావార్తలు

  • GT vs RR : గుజరాత్ టైటాన్స్ ఘనవిజయం.. పాయింట్ల పట్టికలో టాప్‌కు..!

  • Bengal: రాజకీయ కురువృద్ధుడ్ని ప్రతిపక్ష నేతగా నియమించిన టీఎంసీ

  • Suriya: సూర్య ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘విశ్వనాథ్ & సన్స్’ రిలీజ్ అప్పుడే!

  • PM Modi: అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్ పాలన‌తో విసిగిపోయారు.. హైదరాబాద్ టూర్‌పై మోడీ ట్వీట్

  • Agni Missile: అగ్ని మిస్సైల్ మరో స్థాయికి.. MIRV క్షిపణి పరీక్ష విజయవంతం

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions