Leopard Roaming In Mahanandi : నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానందిలో చిరుత గత 22 రోజులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తుంది. చిరుత సంచారానికి సంబంధించిన సిసిటీవీ ఫోటేజీలలో కూడా చాలానే మీడియా ద్వారా బయటికి వచ్చాయి. 22 రోజులుగా మహానంది పుణ్యక్షేత్రం చుట్టూ చిరుత చక్కర్లు కొడుతుండడంతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే చిరుతను బంధించడానికి అటవీ శాఖ అధికారులు అనేక మార్గాలను చేస్తున్నారు. మహానందిలోని విద్యుత్ సబ్ స్టేషన్, అన్నదాన సత్రం,…
Pithapuram MLA Taluka : ఎన్నికల సమయంలోనే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయం సాధిస్తాడని అందుకు సంబంధించిన ” పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా.. ” అంటూ అనేక నెంబర్ ప్లేట్లు., కొన్ని స్టిక్కర్స్ వాహనాలపై కనిపించాయి. ఎన్నికల్లో పిఠాపురం నుండి ఎమ్మెల్యేగా బరిలో దిగిన ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించాడు. అంతేకాదు కూడా ప్రభుత్వం ఏర్పడడంలో పూర్తి సహకారం అందించిన పవన్ కళ్యాణ్ కు ఏకంగా డిప్యూటీ సీఎం హోదాను…
విజయవాడ ఈస్ట్రన్ బైపాస్ రోడ్కు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అనుమతి ఇచ్చారు. చంద్రబాబు నిర్వహించిన భేటీలో అనుమతి ఇచ్చారని విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్ చిన్ని చెప్పారు. రాజధాని ఔటర్ రింగ్ రోడ్కు కూడా నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వెల్లడించారు.
ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో చంద్రబాబు సమావేశం కానున్నారు. కేంద్ర ప్రభుత్వం జులై చివరి వారంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లి.. తగిన సాయం కోరనున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, రహదారులు భవనాలశాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్రావు, ప్రభుత్వ ప్రధాన…
ఉమ్మడి కృష్ణాజిల్లాలోని ఆ టీడీపీ ఎమ్మెల్యే, మంత్రి వైసీపీ మాజీ మంత్రికి లోలోపల థాంక్స్ చెప్పుకుంటున్నారట. నీ చేష్టలు, చర్యలే ఇవాళ మమ్మల్ని ఒడ్డున పడేశాయి, ఎంత మంచివాడవు అనుకుంటున్నారట. అదేంటీ… టీడీపీ లీడర్స్ వైసీపీకీ నాయకుడికి ధాంక్స్ చెప్పడమేంటి? ఆయన వాళ్ళకు చేసిన అంత మేలేంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు ట్విస్ట్. లెట్స్ వాచ్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ సీట్లు ఉంటే అందులో 13 చోట్ల తెలుగుదేశం, రెండు సీట్లలో…
రాష్ట్ర చరిత్రలో రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోజులో 95 శాతం మేర పెన్షన్లు పంపిణీ చేసింది. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిన కూటమి ప్రభుత్వం.. సాయంత్రం ఏడుగంటల సమయానికి దాదాపు 94.15 శాతం మేర పంపిణీ పూర్తి చేసింది.
మీరు సీఎం..సీఎం అంటే నాకు భయం వేస్తోందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు సత్య కృష్ణ ఫంక్షన్ హాల్ లో పార్టీ విజయం కోసం కృషి చేసిన పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులతో వీర మహిళలతో సమావేశమయ్యారు.
ఎన్నికలకు ముందే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను అనగానే గెలుపు గుర్తుకు వచ్చిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మోడీని గెలిపించింది..జనసైనికులే అని పేర్కొన్నారు.
నెల్లూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల భవనం నుంచి దూకి ఒక వైద్యురాలు ఆత్మహత్యకు పాల్పడింది. చేజర్ల మండలం చిత్తలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యురాలిగా పనిచేస్తున్న జ్యోతి ... క్యాన్సర్ కు సంబంధించి జిల్లా వ్యాప్తంగా వైద్యులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమానికి హాజరైంది.
సాధారణంగా తన భర్త తనను మోసం చేసి మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడనే ఫిర్యాదులు ఎన్నో చూశాం. ప్రియురాలి మోజులో మోసం చేశాడనే ఫిర్యాదులు కూడా చూశాం. కానీ రెండు సార్లు పెళ్లయిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు దగ్గరుండి వివాహం జరిపించారు. శుభలేఖలు అచ్చువేయించి ఊరందరికీ విందు భోజనాలు పెట్టి భర్తకు మరో వివాహం చేశారు ఇద్దరు భార్యలు. ఈ విచిత్రమైన ఘటన అల్లూరి జిల్లాలో చోటుచేసుకుంది.