పీఆర్సీ విషయంలో ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించిన ఉద్యోగులు.. ఇవాళ ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం నిర్వహించారు.. విజయవాడలోని రోడ్లు.. ఉద్యోగులతో కిక్కిరిసిపోయాయి.. పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా.. ఉద్యోగుల కార్యక్రమాన్ని అడ్డుకోలేకపోయారు.. పెద్ద ఎత్తున అరెస్ట్ లు, నిర్బంధాలు కూడా వారిని ఆపలేకపోయాయి.. ఇక, ఛలో విజయవాడపై స్పందించిన స్టీరింగ్ కమిటీ సభ్యుడు బండి శ్రీనివాసరావు.. రాష్ట్రం నలుమూలల నుంచి ఛలో విజయవాడకు లక్షలాదిగా ఉద్యోగులు తరలివచ్చారని తెలిపారు.. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా ఛలో విజయవాడను…
పీఆర్సీ విషయంలో ఆందోళన బాటపట్టిన ఉద్యోగులు.. ఇవాళ ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించారు.. అయితే, సమ్మె విరమించండి.. సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఉద్యోగులను కోరారు సీఎస్ సమీర్ శర్మ… మా కుటుంబంలో కోపం ఉంటే మాట్లాడుకుంటాం.. కొన్ని ఇబ్బందులు ఉంటాయి.. వాటి మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నామన్న ఆయన.. అసలు సమ్మె చేస్తే ఏమి వస్తుందని ప్రశ్నించారు.. ఇప్పుడు ఇచ్చిన ఐఆర్ సుమారు 30 నెలల పాటు ఇచ్చాం.. ఐఆర్ అనేది ఇంట్రస్ట్ ఫ్రీ లోన్…
ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ వ్యవహారం రచ్చరచ్చగా మారిపోయింది.. ఆందోళనలో భాగంగా ఇవాళ ఛలో విజయవాడ నిర్వహించారు ఉద్యోగులు.. అయితే, ఉద్యోగుల ఆందోళనను ప్రభుత్వం తప్పుబడుతోంది.. ప్రభుత్వం ముందు నుంచి చర్చలకు సిద్ధం అని చెబుతూనే ఉన్నామన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇటువంటి ఆందోళన వల్ల బహిరంగ ఘర్షణ వాతావరణం ఏర్పడుతుంది తప్ప ఉపయోగం ఉండదన్న ఆయన.. ఛలో విజయవాడ బల ప్రదర్శన చేయటం వంటిదే అని వ్యాఖ్యయానించారు.. కోవిడ్ పరిస్థితుల నుంచి పూర్తిగా కోలుకోలేదు.. ఉన్న పరిస్థితుల్లో…
ఏపీలో ప్రభుత్వం, ఉద్యోగుల మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులు తలపెట్టిన ‘చలో విజయవాడ’ నేపథ్యంలో సర్కారు అప్రమత్తమైంది. గురువారం నాడు అత్యవసరమైతే తప్ప ఉద్యోగులకు సెలవు ఇవ్వవద్దని అధికారులకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. మరోవైపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది విజయవాడకు చేరుకున్నారు. ఉద్యోగ సంఘాల నేతలను హౌస్ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.…
ఏపీ వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జూన్ 30 నాటికి ఈ ప్రక్రియ పూర్తి కావాలని సూచించారు. జూలై 1 నాటికి వారికి కొత్త జీతాలు అందాలని స్పష్టం చేశారు. కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ… ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలపై స్పందించారు.…
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ రగడ కొనసాగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన కొత్త పీఆర్సీని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ ఉద్యోగులు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 6న అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లు కూడా ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం ఆర్టీసీ ఎండీకి ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక మెమోరాండం సమర్పించింది. Read Also: పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకునే ప్రసక్తే లేదు: సజ్జల ఆర్టీసీ ఎండీ…
వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహిస్తోన్న ఉద్యోగులు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు.. అయితే, చర్చల ద్వారా సమ్మెకు వెళ్లకుండా ఆపాలంటూ.. అన్ని జిల్లాల కలెక్టర్లు, హెచ్వోడీలకు ఆదేశాలు జారీ చేశారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు చేస్తున్నఆందోళన కార్యక్రమాలపై ఉద్యోగ సంఘాలతో మాట్లాడి వివిధ అంశాలను చర్చలు ద్వారా పరిష్కరించుకునేందుకు ఆందోళనను విరమించి ముందుకు వచ్చేలా ఉద్యోగ సంఘాలను ఒప్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలక్టర్లను ఆదేశించారు. ఆర్ధికశాఖ…
ఏపీ పీఆర్సీ రగడ సామాన్య ఉద్యోగులను తీవ్ర ఆందోళనలకు గురి చేస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వం చర్చలు అంటూనే .. తమ పని తాము చేసుకుంటూ వెళ్తున్నాయి. మరోవైపు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లు నేరవేరిస్తేనే చర్చలకు వెళ్తామంటూ భీష్మించుకుని ఉన్నారు. దీంతో సగటు ఉద్యోగులు అయోమయంలో ఉన్నారు. ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సు పెంపునకు సంబంధించి ఇంకా జీవో ఇవ్వకపోవడంతో అయోమయం నెలకొన్నది. Read Also: ఎన్జీవో హోంలో వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల భేటీ ఇప్పటికే ఆయా…
ఏపీలో రివర్స్ పీఆర్సీపై పోరాడుతున్న ఉద్యోగులు భవిష్యత్ కార్యాచరణపై చర్చించే పనిలో వున్నారు. అమరావతిలోని ఎన్జీవో హోంలో వైద్యారోగ్య శాఖ ఉద్యోగుల భేటీ అయ్యారు. పీఆర్సీ సాధన సమితి నేతల పిలుపు మేరకు ఉద్యమ కార్యాచరణను వైద్యారోగ్య శాఖలో ఏ విధంగా అమలు చేయాలన్న అంశంపై చర్చిస్తున్నారు. ఫిబ్రవరి నెల ఏడో తేదీ నుంచి వైద్యారోగ్య శాఖ సమ్మెకు వెళ్లాలా..? వద్దా..? అనే అంశంపై తర్జన భర్జన పడుతున్నారు. మిగిలిన ఉద్యోగులు సమ్మెకు వెళ్లడం ఓ ఎత్తైతే..…
సాధారణంగా నడక ముందుకు సాగుతుంది. కానీ ఏపీలో ఉద్యోగులు మాత్రం రివర్స్ గా నడిచి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. రివర్స్ పీఆర్సీ ఇచ్చారంటూ గుంటూరులో ఉద్యోగులు వెనక్కు నడిచి ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు కలెక్టరేట్ వద్ద జరిగిన ఆందోళనల్లో జనవరి నెలకు సంబంధించి తమకు పాత వేతనాలే ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీతో ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నసంగతి తెలిసిందే. పీఆర్సీ సాధన…