టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం టీడీఎల్పీ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. సమావేశం అనంతరం అసెంబ్లీకి హాజరు కాకూడదని ప్రకటించనుంది టీడీఎల్పీ. అసెంబ్లీ సమావేశాలకు వెళ్లరాదని ఇప్పటికే పొలిట్ బ్యూరోలో మెజారిటీ నేతలు అభిప్రాయపడ్డారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ కార్యక్రమాల నిర్వహణపై టీడీఎల్పీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు చంద్రబాబునాయుడు. మెజార్టీ ఎమ్మెల్యేలు మాత్రం బాబు లేకుండా వెళ్లిన లాభం లేదని భావించారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7 తేదీనుంచి జరగనున్నాయి.…
ఏపీ వార్షిక బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. ఏపీ బడ్జెట్ సమావేశాలను మార్చి 7 నుంచి నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దాదాపు మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మార్చి 7న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. 8న దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి సంతాపం తెలపనున్నారు. 9, 10 తేదీల్లో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపనున్నారు. మార్చి 11 లేదా 14 తేదీల్లో…
ఏపీలో బడ్జెట్ సమావేశాలకు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. మార్చి 7 నుంచి బడ్జెట్ సమావేశాలను ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. మార్చి నెలాఖరు వరకు సమావేశాలను నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిపాయి. సుమారు 15 నుంచి 20 రోజుల పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయని భావిస్తున్నట్లు పేర్కొన్నాయి. మార్చి 7న తొలిరోజు సమావేశాల్లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్రెడ్డి మృతి పట్ల అసెంబ్లీ సంతాపం వ్యక్తం చేయనుంది. మార్చి 8న ఉభయ సభలను ఉద్దేశించి…
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇలా వైసీపీ ప్రభుత్వం ప్రకటించడంతో ఏపీలో రాజధానిపై కలకలం రేగింది. దీంతో ఎంతో మంది రైతులు, తదితరులు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అయితే ఇటీవల నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహారించుకుంది. అయితే మూడు రాజధానుల ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, త్వరలోనే…
ఏపీలో మార్చి తొలివారంలో బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 4 లేదా 7న బడ్జెట్ సమావేశాలను ప్రారంభించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ విషయంపై త్వరలోనే స్పష్టత రానుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కీలక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త రాజధాని ఏర్పాటు, కొత్త జిల్లాలపై ప్రత్యేక బిల్లులను ప్రభుత్వం తీసుకురానున్నట్లు సమాచారం. ఉగాది నుంచి కొత్త జిల్లాలలో పరిపాలనను అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్న తరుణంలో.. ఉగాదికి ఇంకా…
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా వేశారు స్పీకర్ తమ్మినేని సీతారం… బీఏసీలో ప్రతిపక్షం అడిగిన విధంగా అసెంబ్లీ సమావేశాలు పొడిగించాం.. అయినా చర్చించటానికి అంశాలేమీ లేక టీడీపీ కావాలని డ్రామాలు ఆడి బయటకు వెళ్లి పోయిందని అధికార పార్టీ ఆరోపించింది… టీడీపీ అడిగిన 25 ప్రశ్నలకు సమాధానం ఇచ్చామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.. అయినా ఎందుకు పారిపోయారో అర్థం కాలేదని మండిపడ్డారు.. మొత్తంగా ఏడురోజుల పాటు సాగిన అసెంబ్లీ సమావేశల్లో 26…
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీకి మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై ఆయన నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో ఇకపై అసెంబ్లీలోకి సభ్యులెవ్వరూ మొబైల్ ఫోన్లు తీసుకురాకూడదని స్పీకర్ తమ్మినేని సీతారాం సూచించారు. ఇటీవల సభలో చంద్రబాబు మైక్ కట్ చేసిన సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతుండగా కొందరు టీడీపీ సభ్యులు ఫోన్లో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఏపీ స్పీకర్ సభలోకి మొబైల్ ఫోన్లు తీసుకురావడంపై నిషేధం విధించినట్లు…
ఏడో రోజు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. సభ ముందుకు రానుంది కాగ్ నివేదిక. మరోవైపు అసెంబ్లీలో సభ్యుల ఫోన్ల అనుమతికి చెక్ చెప్పారు. సభలో సభ్యులు ఫోన్లు తీసుకుని రావడానికి ఇక నుంచి అనుమతి లేదని హౌస్ లో ప్రకటించారు స్పీకర్ తమ్మినేని. చంద్రబాబు ఎపిసోడ్ సమయంలో టీడీపీ సభ్యులు సభలో వీడియో రికార్డు చేయడం వివాదాస్పదమైన నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు.
మోజార్టీ పెరిగిందనే ప్రభుత్వం కౌన్సిల్ రద్దు పై వెనుకడుగు వేసిందని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఆనాడు మెజార్టీ లేదని కౌన్సిల్ రద్దు చేస్తా మన్న ప్రభుత్వం , ఈనాడు అధికారపార్టీ మోజార్టీ పెరిగిందని మాట తప్పడం సిగ్గు చేటన్నారు.కౌన్సిల్ రద్దుచేస్తే నష్టపోయేది ప్రభుత్వ మేనని తాము గతంలోనే చెప్పామన్నారు. కౌన్సిల్ రద్దుచేయడం, తిరిగి ఏర్పాటుచేయడమనేది రాష్ట్రాల చేతిలో ఉండదు. పెద్దల సభలో ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు చేయాల న్నఆలోచన ఈ…
రాష్ర్టంలో బీసీ కులాల వారీగా జనగణన జగరడం లేదని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడి యాతో మాట్లాడారు. బీసీ కులాల వారిగా జనగణన జరకపోవడం వల్ల ఆయా వర్గాల వారి సంఖ్య ఎంతో, వారికి లభిస్తునన ప్రాతినిధ్యం ఎంతో తెలియడం లేదన్నారు. బీసీ కులాల జనగణన జరిగితే ఈ వర్గాలకు మరింత మేలు చేయటానికి అవకాశం ఉంటుంది. అంతే కాకుండా చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించేందుకు అవకాశం ఉంటుం ది.జనగణన పట్టికలో…