కేంద్ర ప్రభుత్వం గెజిట్లు విడుదల చేసినా.. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి… జల జగడంపై స్పందించిన ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి… చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే నీటి కేటాయింపులు జరిగేవన్న ఆయన.. తెలుగు రాష్ట్రాల్లో సాగు నీటి ప్రాజక్టులపై మాట్లాడే నైతిక హక్కు ఏ పార్టీకి లేదన్నారు.. బ్రిజేష్ ట్రిబ్యునల్ అనేక సార్లు నీటిని కేటాయిస్తామన్నా ప్రాజక్టులను పూర్తి చేసిన పాపాన…
నిన్న మొన్నటిదాకా అంటీ ముట్టనట్టున్నాడు. ఇప్పుడు జస్ట్.. చిన్న పిలుపురాగానే అటెండెన్స్ వేయించుకున్నాడట. ఓ దశలో కండువా మార్చేస్తారనే టాక్ కూడా నడిచింది. అంతలోనే ఊహించనంత మార్పు.. దీంతో ఆ మాజీ మంత్రిపై నియోజకవర్గంలో రకరకాల ఊహాగాహానాలు చక్కర్లు కొడుతున్నాయట. రాజకీయాలు అనూహ్యంగా మారిపోతుంటాయి. ఏ నాయకుడు ఎప్పుడు ఏ కండువా కప్పుకుంటాడో.. ఊహించలేని పరిస్థితి. కొందరిపై ఏళ్ల తరబడి ఊహాగానాలు వినిపిస్తూనే ఉంటాయి. కానీ, పార్టీ మారరు. వేరే జెండా ఎత్తరు. ఉన్న పార్టీలోనే ఎత్తు…
ఏపీలో కరోనా కేసులు సంఖ్య రోజు రోజుకు తగ్గుతూ వస్తోంది. తాజాగా ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 86,280 సాంపిల్స్ పరీక్షించగా.. 2,527 మందికి పాజిటివ్గా తేలింది.. మరో 19 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 2,412 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 19,46,749 కి పెరగగా.. కోలుకున్నవారి సంఖ్య 19,09,613 కి చేరింది..…
అక్కడ సైకిల్ పార్టీ గతమెంతో ఘనం.. వర్తమానం అయోమయం. దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీకి ఓ ఆఫీస్ లేదు… ఆఖరికి నగర అధ్యక్షుడు కూడా లేడు. ఇద్దరు నేతలు పట్టుకోసం చేసే ప్రయత్నాల్లో సైకిల్ దారి తప్పుతోందట. మేయర్ ఎన్నికలో హ్యాట్రిక్ కొట్టిన చరిత్ర నుండి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోందట. గతమంతా ఘనం. వర్తమానం ప్రశ్నార్థకం అన్నట్టు మారింది..రాజమండ్రిలో టిడిపి పరిస్థితి. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వరుసగా మూడు సార్లు మేయర్ పీఠాన్ని దక్కించుకుని హ్యాట్రిక్ సాధించిన…
కరోనా కట్టడి కోసం విధించిన నైట్ కర్ఫ్యూను మరోసారి పొడిగించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుతవం… రాష్ట్రంలో కరోనా కేసులు, తాజా పరిస్థితి, తీసుకోవాల్సిన కట్టడి చర్యలపై మంగళవారం సీమక్ష నిర్వహించిన సీఎం వైఎస్ జగన్.. నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.. దీంతో.. ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ ప్రభుత్వం.. రాత్రి కర్ఫ్యూని ఈ నెల 30వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది ఏపీ ప్రభుత్వం… కాగా, ప్రస్తుతం నైట్ కర్ఫ్యూను రాత్రి 10 గంటల…
గత కొన్ని రోజులగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణంలో భారీ మార్పులు చోటు చేసుకోవడంతో పాటుగా రుతుపవనాలు చురుగ్గా సాగుతుండటంతో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్ లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం కురుస్తున్నది. ఈ వర్షానికి రోడ్లు, పలు కాలనీలు జలమయం అయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తున్నది. దీంతో వాగులు వంకలు, జలాశయాలు నిండుకుండలా మారాయి. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. Read:…
పోలవరం నిర్వాసితుల సమస్యలపై ఆంధ్రప్రదేశ్, కేంద్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది జాతీయ గిరిజన కమిషన్… పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసంపై రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే సీతంశెట్టి వెంకటేశ్వర్లు జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశారు.. దీనిపై స్పందించిన కమిషన్.. 15 రోజుల్లో వాస్తవాలతో కూడిన నివేదిక ఇవ్వాలి, లేకపోతే సమాన్లు జారీ చేస్తామని పేర్కొంది.. పోలవరం నిర్వాసితులకు నష్ట పరిహారం, పునరావాసం కల్పించకుండా తరలించడంపై స్పందించిన జాతీయ గిరిజన కమిషన్.. ఈ మేరకు ఏపీ,…
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధించి.. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత.. తెలుగుదేశం పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. మరో సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి గుడ్బై చెప్పి.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు.. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో.. వైసీపీలో చేరారు టీడీపీ సీనియర్ నేత, గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఎస్.ఎం.జియావుద్దిన్.. ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా షేక్,…
ఆంధ్రప్రదేశ్లో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో 88,149 శాంపిల్స్ పరీక్షించగా.. 2,498 మందికి కరోనా పాజిటివ్గా తేలింది.. మరో 24 మంది కరోనా బాధితులు ప్రాణాలు వదిలారు… తాజా మృతుల్లో చిత్తూరులో ఐదుగురు, ప్రకాశం జిల్లాలో నలుగురు, నెల్లూరు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు చొప్పున, అనంతపురం, తూర్పు గోదావరి, గుంటూరులో ఇద్దరు చొప్పున, కృ ష్ణ, కర్నూలు, శ్రీకాకుళంలో…