ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు కరోనా పాజిటివ్గా నిర్ధరణ అయినట్లు గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. ఈ నెల 15న పరీక్షలు జరపగా ఇవాళ కరోనా పాటిటివ్ తేలిందన్నారు. ప్రస్తుతం గవర్నర్ బిశ్వభూషన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. గవర్నర్ బిశ్వభూషణ్ను అస్వస్థతకు గురికావడంతో విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. ముందు…
ఏపీలో ఏ ఎన్నిక జరిగినా టీడీపీకి పరాభవం మాములు విషయంగా మారిపోయింది. రాజకీయాలు అన్న తర్వాత గెలుపోటములు మాములే. అయితే ఓ ఎన్నికలో పరాభవం ఎదురైతే.. తరువాత జరిగే ఎన్నికల్లో పుంజుకోవాలని ఏ రాజకీయ పార్టీ అయినా భావిస్తుంది. ఈ మేరకు వ్యూహాలకు పదును పెట్టి ప్రత్యర్థిపై పోటీకి సై అంటుంది. కానీ ఏపీలో ప్రతిపక్ష టీడీపీ మాత్రం ఓటములను సీరియస్గా తీసుకున్న దాఖలాలు కనిపించడంలేదు. 2019 అసెంబ్లీ ఎన్నికలు మొదలు.. ఇప్పటి లోకల్ బాడీ ఎన్నికల…
ఏపీలో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార పార్టీ వైసీపీ ఘనవిజయం సాధించింది. ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీని మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల వైసీపీ విజయఢంకా మోగించింది. నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలు జరిగిన 54 స్థానాల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఈ సందర్భంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. Read Also: వైఎస్ వివేకా కేసులో మరో నిందితుడు అరెస్ట్ ప్రజలు ప్రభుత్వానికి 100కు 97…
కృష్ణా జిల్లాలోని ఓ ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమంలో అపశ్రుతి చోటుచేసుకుంది. బాపులపాడు మండలం హనుమాన్ జంక్షన్ సమీపంలోని మల్లపల్లి గ్రామంలోని ఓ ఆలయంలో బుధవారం నాడు ధ్వజస్తంభం ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వాహకులు తలపెట్టారు. ఈ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. ఈ మేరకు పండితులు నిర్ణయించిన ముహూర్తం మేరకు శివాలయంలో క్రేన్ సహాయంతో ధ్వజస్తంభన ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్న సమయంలో… క్రేన్ నుంచి ధ్వజస్తంభం జారి కింద పడింది. Also Read: వైరల్… హద్దులు…
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ పూర్తిగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల కోలహలం ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్ల ఫలితాల్లో వైసీపీ పార్టీ దుమ్ము దులుపుతోంది. దర్శి మినహా దాదాపు అన్ని మున్సిపాలటీలు వైసీపీ కైవసం అయినట్లు సమాచారం అందుతోంది. అయితే..ఈ ఫలితాల్లో వైసీపీ దూసుకుపోతుంటే… ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనకు మాత్రం ఊహించని షాక్ తగిలింది. బుగ్గన రాజేంద్ర నాథ్ నివాసం ఉండే 15 వ వార్డులో వైసీపీ పార్టీ పరాజయం పాలైంది. వైసీపీ తరఫున…
కుప్పం మున్సిపాలటీ ఎన్నికల్లో టీడీపీని చిత్తు చేసి… వైసీపీ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ విజయం పై నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజా ఫుల్ జోష్ లో కనిపించారు. తన బర్త్ డే సందర్భంగా వైసీపీ గెలవడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ… ఏ ఎన్నికలు వచ్చిన వార్ వన్ సైడేనని… నలబై ఏళ్ళు ఇండ్రస్టీ అయినా చంద్రబాబు తరిమి కొట్టారని ఎద్దేవా చేశారు. కుప్పంలోనే ఇల్లు…
కృష్ణా జిల్లాలో కొండపల్లి మున్సిపాలిటీలో ఎన్నికల కౌంటింగ్ ముగిసింది. మొత్తం 29 వార్డులకు 14 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు, 14 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఒకస్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపు సొంతం చేసుకున్నాడు. దీంతో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇండిపెండెంట్ అభ్యర్థి మద్దతు కోసం అటు వైసీపీ, ఇటు టీడీపీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. Read Also: దర్శిలో టీడీపీ విజయ…
ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్తా చాటింది.. టీడీపీ డీలాపడిపోగా.. వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి… ఈ ఫలితాలపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా.. ఏ ఎన్నికలు వచ్చినా వార్ వన్సైడే అన్నారు.. ఈ ఎన్నికల్లో నలబై ఏళ్ల ఇండ్రస్టీ అయినా చంద్రబాబుని తరిమి కొట్టారని సెటైర్లు వేసిన ఆమె.. కుప్పంలోనే ఇల్లు లేని చంద్రబాబును… హైదరాబాదు ఇంటికి పరిమితం చేశారని వ్యాఖ్యానించారు… ఇకనైనా చంద్రబాబు, లోకేష్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని…
స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ హవా కొనసాగుతోంది.. మెజార్టీ మున్సిపాలిటీలు కైవసం చేసుకుంది అధికార పార్టీ.. దీంతో పార్టీ శ్రేణుల్లో జోష్ మరింత పెరిగింది.. సంబరాల్లో మునిగిపోయాయి వైసీపీ శ్రేణులు.. అయితే, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పంపై ప్రత్యేకంగా దృష్టిసారించింది.. ఇక, కుప్పంలో కూడా వైసీపీ తిరుగులేని విజయాన్ని అందుకుంది.. ఈ ఎన్నికలపై ఫలితాలపై మీడియాతో మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డి.. రాష్ట్రంలో…
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకు జరుగుతోన్న ఉప ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది.. టీడీపీ అధినేత నియోజకవర్గంలోని కుప్పంలో కూడా వైపీపీ ఘన విజయాన్ని అందుకుంది.. ఈ ఫలితాలపై ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభంజనం.. చంద్రబాబు కుప్పం కోట బద్దలు అయ్యిందన్నారు.. ఇక, టీడీపీ ఆఫీసును అద్దెకు ఇచ్చుకోవాల్సిందేనంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు హైదరాబాద్ వెళ్లి మనవడితో ఆడుకుంటే…