ఏపీలో రోజు కరోనా కేసులు పెరుగుతూ… తగ్గుతూ వస్తున్నాయి. ఇక తాజా బులిటెన్ ప్రకారం గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 24,659 శాంపిల్స్ పరీక్షించగా.. 174 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అయితే ఈరోజు కరోనా కారణంగా ఎవరు మరణించలేదు. ఇక, ఇదే సమయంలో 301 మంది కోవిడ్ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 3,01,78,784 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,71,244 కు పెరిగింది.. ఇక, 20,54,553 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14,426 మంది కోవిడ్ బాధితులు మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్ కేసులు 2,265 గా ఉన్నాయని ఏపీ ప్రభుత్వం పేర్కొంది.