* నేడు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్. ప్రధాని నరేంద్రమోడీతో సాయంత్రం భేటీ కానున్న జగన్. * నేడు పోలవరం ప్రాజెక్టుని సందర్శించనున్న ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబు. ప్రాజెక్టు పరిశీలన అనంతరం అధికారులతో మంత్రి అంబటి సమీక్ష * ఇవాళ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు. జాతీయ జెండా ఆవిష్కరించనున్న సీఎం కేసీఆర్. హైదరాబాద్ సహా వివిధ జిల్లాల్లో అవతరణ వేడుకల్లో పాల్గొననున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, టీఆర్ఎస్ నేతలు. *విశాఖ ఆంధ్రాయూనివర్శిటీలో…
ఏపీలోని రైతులకు సీఎం జగన్ శుభవార్త అందించారు. జూన్ నెలలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను బుధవారం నాడు కలెక్టర్లు, ఎస్పీల సదస్సులో ప్రకటించారు. జూన్ 7న రైతన్నలకు 3,800 ట్రాక్టర్లు సహా 5వేలకు పైగా వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేస్తామని జగన్ వెల్లడించారు. అంతేకాకుండా జూన్ 14న రైతులకు పంటల బీమా పరిహారం చెల్లిస్తామన్నారు. జూన్ 23న అమ్మ ఒడి నిధులను విడుదల చేస్తామని జగన్ తెలిపారు. YSRCP: వచ్చే నెలలో వైసీపీ ప్లీనరీ.. భారీ ఎత్తున…
ఏపీలో అధికార పార్టీ వైసీపీ ప్లీనరీ సమావేశాలకు రంగం సిద్ధం అవుతోంది. జూలై 8, 9 తేదీల్లో పార్టీ ప్లీనరీని భారీ ఎత్తున నిర్వహించేలా వైసీపీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు పార్టీ ప్లీనరీని నిర్వహించాలని సీఎం జగన్ వైసీపీ నేతలకు ఆదేశాలు జారీ చేశారు. ఇంకా నెలరోజులు మాత్రమే సమయం ఉండటంతో వైసీపీ ప్లీనరీని ఎక్కడ నిర్వహించాలి అనే విషయంపై వైసీపీ నేతలు సమాలోచనలు చేస్తున్నారు. పార్టీ ప్రారంభించి పదేళ్లు పూర్తి కావడం, సీఎంగా జగన్…
అమరావతి: ప్రతిపక్ష పార్టీ టీడీపీపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. మహానాడు నుంచి టీడీపీ నేతలకు కడుపు మంట ఎక్కువైందని ఆయన ఎద్దేవా చేశారు. మహానాడు ఘన విజయం అంటూ వాళ్ళకి వాళ్లే బుజాలు చరుచుకుంటున్నారని చురకలు అంటించారు. టీడీపీ నేతలు ఎంతటి పతనావస్థలో ఉన్నారనేది వారి ఏడుపు వల్లే కనిపిస్తోందని సజ్జల ఆరోపించారు. ఏడుపు వాళ్ళ అధికారిక గీతం అయ్యిందని.. అసెంబ్లీ నుంచి చంద్రబాబు ఏడుపు ప్రారంభమైందని…
ఏపీలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఏసీబీ మొబైల్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు ఏసీబీ యాప్ తయారు చేసింది. ‘ఏసీబీ 14400’ పేరుతో యాప్ రూపొందించింది. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న స్పందనపై సమీక్ష కార్యక్రమంలో ఏసీబీ యాప్ను సీఎం జగన్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతి ఉండకూడదని స్పష్టంగా చెప్పామని.. ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా…
ఏపీలో జూన్ 1 సందర్భంగా పెన్షన్ల పంపిణీ జోరుగా కొనసాగుతోంది. బుధవారం తెల్లవారుజాము నుంచే వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు. సుమారు 60.75 లక్షల మంది పెన్షనర్లకు ఏపీ ప్రభుత్వం రూ.1,543.80 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పెన్షన్ల పంపిణీ వివరాలను అందజేశారు. Tulasireddy: దావోస్కి కాదు.. ఢిల్లీకి వెళ్ళి సాధించండి ఉదయం 7 గంటల వరకు 30.01 శాతం పెన్షన్ల పంపిణీ ద్వారా వాలంటీర్లు సుమారు…
విజయవాడలో ఓ ఆర్ఎంపీ వైద్యుడు తన వక్రబుద్ధిని బయటపెట్టుకున్నాడు. నగరంలో నివసిస్తున్న అమృతరావు కొంతకాలంగా జి.కొండూరు మండలంలో ఆర్ఎంపీ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే అతడు వాట్సాప్ గ్రూప్ ద్వారా మూడు రోజుల పసిపాపను అమ్మకానికి పెట్టడం స్థానికంగా కలకలం రేపింది. ఈ మేరకు ఆర్ఎంపీ డాక్టర్ అమృతరావు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. Self Destruction Note: ప్రియుడి ఆత్మహత్య.. ఖర్చుచేసిన డబ్బు కావాలని లేఖ రూ.3 లక్షలకు పసిపాపను అమ్మకానికి పెట్టినట్లు…
విశాఖ పట్నంలోని రిషికొండలో టూరిజం భవనాల నిర్మాణాలపై ఎన్జీటీ విధించిన స్టే ఎత్తివేయాలని..ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. రిషికొండలో నిర్మాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది దేశ సర్వోన్నత న్యాయస్థానం. అక్కడ చదును చేసే ప్రాంతంలో నిర్మాణాలు చేసుకునేందుకు సుప్రీం కోర్టు అనుమతి మంజూరు చేసింది. ఇప్పటికే నిర్మాణాలున్న ప్రాంతంలో యథావిథిగా నిర్మాణాలు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. రుషికొండ ప్రాజెక్ట్ కేసు విచారణ హైకోర్టుకు బదిలీ చేసింది. ట్రిబ్యునల్ పరిధి కంటే…
2022 ఏడాదికిగాను జగనన్న అమ్మఒడి, వాహనమిత్ర పథకాలను ఆర్థిక ఇబ్బందులు కారణంగా రద్దు చేయడం జరుగుతుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవం. ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ అన్నది అసలు మనుగడలోనే లేదు. ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేవిధంగా దుష్ర్పచారం చేసేవారు ఎంతటివారైనా ఉపేక్షించం, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరించారు ఏపీ సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ్ కుమార్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ సమాచార సాంకేతిక ప్రసారాల శాఖ పేరుతో 2022 జగనన్న…