తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.. తన సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పర్యటించే ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాలు ఏర్పాటుచేశాయి ఆ పార్టీ శ్రేణులు.. రామకుప్పం మండలం కొల్లుపల్లెలో వైసీపీ జెండాలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు, అంతేకాదు దారి పొడువునా వైసీపీ తోరణాలు కట్టారు.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు.. పోలీసుల సహకారంతోనే…
వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తానంటున్నారు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు.. అయితే, ఏ పార్టీ నుంచి పోటీ అనేది కొద్ది రోజుల్లో తెలియజేస్తా అంటున్నారు.. అంతే కాదు.. తాను ఒక్క నియోజక వర్గానికి పరిమితం కాకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా నేను చేరే పార్టీకి మేలు జరిగేలా కృషి చేస్తానన్నారు.
ఉత్తర బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ రోజు వాయువ్య బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్ళేకొలది నైరుతి దిశగా వంగి ఉంటుందని.. ఉత్తర మధ్య అంతర్భాగ తమిళనాడు మరియు పొరుగున ప్రాంతాల్లో ఉన్నఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్లు మరియు 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని భారత వాతావరణ శాఖ, వాతావరణ కేంద్రం, అమరావతి వెల్లడించింది.. దీని ప్రభావంతో.. రాబోయి మూడు…
CM Jagan: ప్రకాశం జిల్లా పర్యటనలో గ్రానైట్ పరిశ్రమలపై సీఎం జగన్ వరాలు కురిపించారు. గ్రానైట్ పరిశ్రమల విషయంలో మహానేత వైఎస్ఆర్ హయాంలో మాదిరిగానే స్లాబ్ విధానాన్ని మళ్లీ తాము తీసుకువస్తున్నామని.. ఈరోజే జీవో నంబర్ 58 విడుదల చేశామని సీఎం జగన్ ప్రకటించారు. ప్రకాశం జిల్లాలో ఎక్కువ గ్రానైట్ పరిశ్రమలు ఉండటంతో సింగిల్ బ్లేడ్కు రూ.27వేలు, మల్లీ బ్లేడ్కు నెలకు రూ.54వేలు ఇచ్చేలా స్లాబ్ సిస్టమ్ తీసుకువస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. గ్రానైట్ పరిశ్రమల నడ్డి…
CPS Employees: కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్)ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని సీపీఎస్ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టనున్నారు. ఈ మేరకు సెప్టెంబర్ 1న లక్ష మంది ఉద్యోగులతో చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. శాతవాహన కాలేజీ గ్రౌండ్స్లో బహిరంగ సభ నిర్వహణకు, ఏలూరు రోడ్డు, బీఆర్టీఎస్ రోడ్లలో ఏదో ఒక చోట ర్యాలీకి అనుమతి ఇవ్వాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సీపీఎస్ రద్దు అంశంపై…
Srisailam Dam: ఇటీవల వరదలతో పోటెత్తిన కృష్ణమ్మ శాంతించింది. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శ్రీశైలం డ్యాం రేడియల్ క్రస్ట్ గేట్లను మంగళవారం నాడు అధికారులు మూసివేశారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్ నుంచి 1.21 లక్షల క్యూసెక్కులు, సుంకేశుల జలాశయం నుంచి 21,725 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. అటు శ్రీశైలం కుడి, ఎడమ గట్ల జల విద్యుత్ కేంద్రాల నుంచి 64,243 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్కు అధికారులు…
What’s Today: • ప్రకాశం జిల్లా చీమకుర్తిలో నేడు సీఎం జగన్ పర్యటన.. చీమకుర్తిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి కాంస్య విగ్రహాలను ఆవిష్కరించనున్న సీఎం జగన్.. అనంతరం బహిరంగ సభలో మాట్లాడనున్న సీఎం జగన్ • తిరుమల: ఈరోజు ఉదయం 10 గంటలకు లక్కీడిప్ ద్వారా ఆన్లైన్లో శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల చేయనున్న టీటీడీ • నేడు గుంటూరు రూరల్ మండలం దాసు పాలెంలో గడపగడపకు…
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత, ఎమ్మెల్సీ అనంతబాబుకు మధ్యంతర బెయిల్ను పొడిగించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. అనంతబాబు తల్లి అనారోగ్య కారణాలతో ఆదివారం మృతి చెందగా.. ఈ నేపథ్యంలో తన తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేలా తనకు బెయిల్ మంజూరు చేయాలన్న అనంతబాబు విజ్ఞప్తితో.. 3 రోజుల పాటు బెయిల్ మంజూరు చేస్తూ రాజమహేంద్రవరం కోర్టు పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది.. ఇక, ఈ నెల 25…