విజయవాడ పశ్చిమ టికెట్ కోసం టీడీపీ - జనసేన మధ్య ముసలం మొదలైంది.. టీడీపీ నేతలు బాద్దా వెంకన్న, జలీల్ ఖాన్పై జనసేన పశ్చిమ ఇంఛార్జ్ పోతిని మహేష్ విమర్శలు గుప్పించారు. ఐదేళ్లు వీరంతా ఎక్కడున్నారు? అంటూ ఫైర్ అయ్యారు. గాలిబ్ షా ఆస్తులు , జుమ్మా మసీదు ఆస్తులు కొట్టేసింది ఎవరు? అని ప్రశ్నించారు. కులాలు, మతాల ముసుగులో రాజకీయాలు చేస్తామంటే ప్రజలు నమ్ముతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టైటిలింగ్ యాక్ట్ చట్టం ఇంకా అమలు చేయలేదని.. ఈ చట్టంపై అడ్వకేట్స్ కొన్ని అభ్యంతరాలు చెబుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. రాష్ట్రంలో త్వరితగతిన రీ సర్వే పూర్తి అవుతుందని ఆయన ప్రకటించారు. ఇంకా రూల్స్ తయారు చేయలేదు , అసెంబ్లీ చర్చించలేదని.. న్యాయవాదుల సలహాలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
Srikalahasthi Temple: శ్రీకాళహస్తీ ఆలయంలో అర్ధరాత్రి కలకలం రేగింది.. ఓ బాలుడు అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన ఘటన రచ్చగా మారింది.. ఆలయం మూసివేసిన తరువాత 13 సంవత్సరాల వయసులో ఉన్న మైనర్ బాలుడు ఆలయ ప్రహరీ గోడ నుండి నిచ్చెన ద్వారా ఆలయంలోకి ప్రేవేశించాడు.. తిరిగి అదే గోడ దూకుతుండగా కార్ పార్కింగ్ వద్ద బాలుడ్ని గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చారు భక్తులు. ఆలయ సీసీ కెమెరాలో సైతం బాలుడు ఆలయంలో తిరుగుతున్న దృశ్యాలు రికార్డు…
గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్పై నాలుగు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది విజయవాడలోని ప్రజా ప్రతినిధుల కోర్టు.. వంశీపై నాలుగు కేసుల్లో విచారణ చేస్తున్న ప్రజా ప్రతినిధుల కోర్టు.. ఆయన కోర్టుకు హాజరు కాకపోవడంతో అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది న్యాయస్థానం..