మెడికల్ కాలేజీల వివాదంపై స్పందిస్తూ.. అసలు, పీపీపీ, ప్రైవేటీకరణపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైద్యం, విద్య ప్రభుత్వ రంగంలోనే ఉండాలని స్పష్టం చేశారు రాఘవులు..
వైఎస్ జగన్మోహన్రెడ్డికి సవాల్ విసిరారు ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. ఆరోగ్య శాఖ పై చర్చ కు తాను సిద్ధంగా ఉన్నానని, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలోనైనా ఇక ఎక్కడైనా చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు.
వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం తగదని అంటున్నారు అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్.. వైద్య కళాశాలలను ప్రభుత్వం నడపటానికి ఇబ్బంది ఏమిటి..? అంటూ ప్రశ్నించారు.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు వన్ ప్లస్ వన్ గన్మెన్ను కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. 2014 నుంచి 2019 వరకు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా ఉన్నారాయన. ఆ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడంతో సెక్యూరిటీని ఉపసంహరించుకున్నారు. అయితే ... తాజాగా తనకు భద్రతా కారణాల రీత్యా ప్రొటెక్షన్ కావాలని ప్రభుత్వాన్ని అడిగారట మాజీ ఎమ్మెల్యే. ఏం... ఉన్నట్టుండి ఆయనకు ఏం ఆపద ముంచుకొచ్చింది?
రాష్ట్రం మెత్తం ఒక లెక్క, మా జిల్లా తీరు మరో లెక్క అంటున్నారు సిక్కోలు వైసీపీ ద్వితీయ శ్రేణి లీడర్స్. ఇక్కడ పార్టీకి బలమైన నాయకత్వం, క్యాడర్ బేస్ ఉంది. కానీ... సమన్వయం చేసుకోవడంలోనే చతికిలపడుతున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే...ఇప్పుడప్పుడే కోలుకునే ఛాన్స్ కూడా ఉండబోదని పార్టీ వర్గాలో అంటున్నాయి. ఒకటి రెండు నియెజకవర్గాలు మినహా... ఉమ్మడి జిల్లాలోని దాదాపు అన్నిచోట్ల గ్రూప్స్ గోల ఉంది. పార్టీ కష్ట కాలంలో ఉన్నా..
212 మంది ఆంధ్రులు నేపాల్ లో 12 లొకేషన్ లలో ఉన్నారు. ఖాట్మండ్ లో ఎక్కువ మంది ఉన్నారు. టైం టు టైం మానటిరంగ్ జరుగుతోంది. ఖాట్మాండ్ నుంచి ప్రత్యేక విమానంలో రేపు ఆంధ్రుల ను నేపాల్ నుంచి తీసుకు వస్తాం.. ఆ ఫ్లైట్ శ్రీకాకుళం.. కడప లో ల్యాండ్ అవుతుందన్నారు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి నారా లోకేష్.. మేమేమీ మెడికల్ కాలేజీలు అమ్మడం లేదన్న ఆయన.. ఎందుకు ఈ ప్రభుత్త హయాంలో 5 ఏళ్లలో మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేదు..? అని ప్రశ్నించారు.. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ అని.. ఇందులో పబ్లిక్ భాగస్వామ్యం ఉంటుందన్నారు..