చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ విషాద ఘటన జరిగింది.. గంగవరం మండలం చిన్నమనాయనిపల్లి గణేష్ నిమజ్జన సమయంలో చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు.. కాకర్లకుంట చెరువులో ఈ ఘటన జరిగింది.. మృతులు అదే గ్రామానికి చెందిన 27 ఏళ్ల భార్గవ్, 26 సంవత్సరాల చరణ్ గా గుర్తించారు పోలీసులు.
* నేటితో ముగియనున్న రాహుల్ గాంధీ ఓటర్ అధికార్ యాత్ర.. బీహార్లో 16 రోజుల పాటు సాగిన రాహుల్ యాత్ర.. మొత్తం 25 జిల్లాల్లో, 110 నియోజక వర్గాల్లో 1,300 కి.మీ మేర సాగిన యాత్ర.. నేడు పట్నాలో బహిరంగ సభతో ముగియనున్న రాహుల్ యాత్ర * పంజాబ్ కు మరో రెండురోజుల పాటు రెడ్ అలర్ట్.. 25 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా పంజాబ్ లో అత్యధిక వర్షపాతం.. ఉప్పొంగుతున్న సటుజ్, బియాస్, రవి నదులు..…
మంత్రి నారా లోకేష్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్(SVP) లో భాగస్వామ్యం కావాలని ప్రత్యేక ఆహ్వానం పంపింది ఆస్ట్రేలియన్ హైకమిషన్. మానవ వనరులు, సాంకేతిక, ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ప్రశంసించిన ఆస్ట్రేలియా ప్రభుత్వం.. ఈ మేరకు స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావా లని ఆస్ట్రేలియా ప్రభుత్వం మంత్రి నారా లోకేష్ ను కోరింది. గత 20 ఏళ్లలో భారతదేశంలోని ప్రముఖ రాజకీయ…
గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఐదు నెలల్లో 30మంది మృతిచెందారు. దీంతో వైద్యారోగ్య శాఖ వరుస మరణాలపై దృష్టి పెట్టింది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు గ్రామంలో పర్యటిస్తున్నారు. ఎపిడిమిక్ బృందంతోపాటు గుంటూరు మెడికల్ కాలేజీకి చెందిన ఎస్.పి.ఎం., మైక్రో బయాలజీ వైద్యబృందం పర్యటిస్తోంది. మృతుల కుటుంబాలనుంచి బ్లడ్ శాంపిల్స్ సేకరించారు. మరణాలకు దోమకాటా… లేక మరే ఇతర కారణమా అన్న కోణంలో శాంపిల్స్ సేకరించారు. బ్లడ్ శాంపిల్స్, నీటి పరీక్షల ఫలితాలు…
ఎమ్మెల్యేల మీద వరుస హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఈ కేసులో ఎవరిని ఇరికిస్తారో చూడాలని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి... నాటకాల రాయుళ్లు అందరూ ఒక్కో డ్రామా వేస్తున్నారు.. అందులో ర్యాంకింగ్ ఇస్తే శ్రీధర్ రెడ్డికి నంబర్ వన్ స్థానం వస్తుందని ఎద్దేవా చేశారు.. రౌడీ గ్యాంగ్లను పెంచిపోషించింది శ్రీధర్ రెడ్డి కాదా..? అని నిలదీశారు.. పెరోల్ విషయంలో అడ్డంగా బుక్ అయ్యారు కాబట్టే.. దానిని డైవర్ట్ చేస్తున్నారని విమర్శించారు..
తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రపతి అనుమతి ఇచ్చినా.. తెలుగుదేశం నాయకుడు పొట్టి రవిని తాడిపత్రికి రానివ్వలేదని గుర్తుచేశారు.. అయితే, పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకుండా పెద్దారెడ్డి వల్ల నష్టపోయిన బాధితులే అడ్డుకుంటారని పేర్కొన్నారు.. అధికారం అడ్డం పెట్టుకొని పెద్దారెడ్డి చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు చాలా ఉన్నాయన్న ఆయన.. మహిళలు అని చూడకుండా టీడీపీ మహిళా కౌన్సిలర్లను పరిగెత్తించి కొట్టిన ఘనత పెద్దారెడ్డిది…
కృష్ణమ్మ కుప్పం చేరుకుంది.. కుప్పం నియోజకవర్గంలోని చివరి భూముల వరకు చేరింది.. దీంతో, కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద కృష్ణమ్మకు జలహారతి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. హంద్రీ - నీవా కాల్వల విస్తరణ పనుల ద్వారా కుప్పం చివరి భూములకు చేరాయి కృష్ణా జలాలు..
రాజ్యాధికారం కోసం సొంత ఇంట్లో కుటుంబ సభ్యులను చంపే సంప్రదాయం మా ఇంట్లో లేదు అని వ్యాఖ్యానించారు కోటంరెడ్డి.. రౌడీ షీటర్లు నా తమ్ముడు గిరిధర్ రెడ్డి అనుచరులు అని ఓ మీడియా రాసిందని మండిపడ్డారు.. విద్యార్ది దశలోనే ఎన్నో పోరాటాలు చేశాను. రౌడీలకు, గుండాలకు భయపడనన్న ఆయన.. వైఎస్ జగన్ ని ధిక్కరించి వీధుల్లోకి వచ్చి పోరాటం చేశాను.. 16 నెలలు అధికారాన్ని వదులుకుని టీడీపీలో చేరాను. వైస్సార్సీపీకి సవాల్ విసిరుతున్నా.. ఎన్ని దుష్ప్రచారాలు చేసినా..…