సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (మంగళవారం) విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి కృష్ణలంక కనకదుర్గమ్మ వారధి దగ్గరకు చేరుకోనున్నారు. అక్కడ కొత్తగా నిర్మించిన ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ పార్కును ఆయన ప్రారంభించనున్నారు.
తెలుగుదేశంపార్టీ-జనసేన-బీజేపీ మధ్య పొత్తుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. అయితే, పొత్తుల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.. పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు కేటాయించాలన్న ప్రతిపాదనలకు మూడు పార్టీ నేతల ఏకాభిప్రాయానికి వచ్చారు.. అందులో 10 అసెంబ్లీ, 6 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుంది.. ఇక, 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసేందుకు రెడీ అయ్యింది..