Vasantha Krishna Prasad: మైలవరంలో ఎమ్మెల్యే వసంత కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vasantha Krishna Prasad: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్బై చెప్పిన మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. ఈ సారి తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే టీడీపీ కండువా కప్పుకున్నారు వసంత.. అయితే, అప్పటికే ఆ స్థానంలో గ్రౌండ్ వర్క్ ప్రిపేపర్ చేసుకున్న మాజీ మంత్రి, సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఓవైపు బొమ్మసాని సుబ్బారావు మరోవైపు టికెట్ ఆశిస్తున్నారు.. ఈ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. నేను ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి అని మీరు అనుకోవద్దు.. నన్ను, ఉమాని కాదని మూడో వ్యక్తిని పెట్టినా తెలుగుదేశం పార్టీ గెలుపే ధ్యేయంగా పనిచేద్దాం అన్నారు.. అభ్యర్థిగా పార్టీ ఎవరిని ప్రకటించినా రేపు ప్రచార వాహనంపై అంతే దీటుగా పని చేస్తాను అని స్పష్టం చేశారు.
Read Also: Guntur kaaram: ఇదెక్కడి వింత!.. ఇప్పుడు సాంగ్ రిలీజ్ చేయడమేంటి?
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
నేను తెలుగుదేశం పార్టీలో చేరి మీలో ఒకడిగా మీతో కలిసి నడవడానికి మీ దగ్గరకు వచ్చాను అన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.. తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టించలేదనే గతంలో వైసీపీ నాయకులు కొందరు నాతో విభేదించారన్న ఆయన.. తప్పు లేనప్పుడు అనవసరంగా కేసులు పెట్టడాన్ని నేను ఒపతపుకోనని చెప్పాను అన్నారు. ఇక, నాకు, దేవినేని ఉమాకు మధ్య 20 సంవత్సరాల నుండి రాజకీయ విభేదాలు ఉన్నాయని గుర్తుచేసుకున్నారు. అయితే, వైసీపీలో ఉన్నప్పుడు ఉమాకి వ్యతిరేకంగా మాట్లాడాను.. అంతే తప్ప ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తను నేను దూషించలేదన్నారు. 2024 ఎన్నికలు చాలా కీలకం, తెలుగుదేశం పార్టీకి చావు బ్రతుకుల సమస్యగా అభివర్ణించారు. అంగబలం, అర్థబలంతో పాటు అధికారం చేతిలో ఉండడంతో మరో మారు అధికారంలోకి రావడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని విమర్శలు గుప్పించారు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్.
తాజావార్తలు
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
-
Ramayana : ‘రామాయణ’ మహా అద్భుతం.. జూలై 24న ట్రైలర్!
-
Tollywood: ఆ రెండు బిగ్ మూవీస్ రిలీజ్ ఎప్పుడు?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!