CM Jagan: నేడు విజయవాడకు సీఎం.. పలు అభివృద్ది పనులను ప్రారంభించనున్న జగన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేడు (మంగళవారం) విజయవాడలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయల్దేరి కృష్ణలంక కనకదుర్గమ్మ వారధి దగ్గరకు చేరుకోనున్నారు. అక్కడ కొత్తగా నిర్మించిన ఇరిగేషన్ రిటైనింగ్ వాల్, రివర్ ఫ్రంట్ పార్కును ఆయన ప్రారంభించనున్నారు. అనంతరం విజయవాడ కార్పొరేషన్ పరిధిలోని పేదలకు ఇచ్చిన పట్టాలకు శాశ్వత హక్కులు కల్పించి లబ్ధి దారులకు అందజేయనున్నారు. ఆ తర్వాత తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్ చేరుకుంటారు.
Read Also: SBI : సుప్రీంకోర్టు తీర్పుతో ఆరుగంటల్లో రూ.13,075కోట్లు నష్టపోయిన ఎస్బీఐ ఇన్వెస్టర్లు
Also Read
- Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
- Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ '45' స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
- Hyderabad: పక్కా ప్లాన్తో దోపిడీలు.. హైదరాబాద్ పోలీసులకు తలనొప్పిగా మారిన నేపాలీ గ్యాంగ్లు..
- NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
అయితే, రిటైనింగ్ వాల్స్ పూర్తి కావడంతో కృష్ణలంక వాసుల ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని వైసీపీ ప్రభుత్వం చూపించింది. వారికి ఇచ్చిన మాటను సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. 2019లో కృష్ణానదికి ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరద చేరగా.. అప్పట్లో యనమలకుదురు, కృష్ణలంక, రాణీగారితోట ప్రాంతాలు ముంపు బారిన పడ్డాయి. రామలింగేశ్వర్ నగర్ నుంచి యనమలకుదురు వరకూ గత ప్రభుత్వం నిర్మించిన రిటైనింగ్ వాల్ వరదల నుంచి రక్షణ ఇవ్వకపోవడంతో.. యనమలకుదురు ఎగువనున్న ప్రాంతాలకు వరద కష్టాలు మరింత పెరిగాయి. దీంతో వరద నుంచి ప్రజలకు శాశ్వతంగా రక్షణ కల్పించేందుకు సీఎం జగన్ పూనుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన 2.26 కిలోమీటర్ల మేర ఫేజ్ -2, ఫేజ్ -3 రిటైనింగ్ వాల్స్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రెండవ దశలో 134.43 కోట్లతో 1.2 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ పూర్తి కూడా అయిపోయింది.
Read Also: Allu Arjun Fans : మితిమీరిన అభిమానం.. యువకుడి పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ దాడి..
ఇక, కోటి నగర్ నుంచి కనకదుర్గ వారధి వరకూ రిటైనింగ్ వాల్ను ప్రభుత్వం నిర్మించింది. 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా తట్టుకునేలా జగన్ సర్కార్ రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేశారు. మూడు అడుగుల వెడల్పుతో 18 మీటర్ల లోతులో ర్యాఫ్ట్ పద్ధతిలో పునాదులు వేసి.. 8.9 మీటర్ల ఎత్తులో కాంక్రీట్ రిటైనింగ్ వాల్ నిర్మించేశారు. మూడవ దశలో 235.46 కోట్లతో 1.06 కిలోమీటర్ల పొడవున రిటైనింగ్ వాల్ ను దాదాపు పూర్తి చేశారు. కనకదుర్గ వారధి నుంచి పద్మావతి ఘాట్ వరకూ రిటైనింగ్ వాల్ను నిర్మించారు.
తాజావార్తలు
-
Fuel Price Hike: పెట్రోల్, డీజిల్ మాత్రమే కాదు.. పాల నుంచి పప్పుల దాకా.. నెక్ట్స్ పెరిగేవి ఇవే..
-
RAPO23 : కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత : రామ్ పోతినేని
-
Jailer 2 : ‘జైలర్ 2’ సెట్లో విషాదం.. విద్యుత్ షాక్తో యువ కార్మికుడు మృతి!
-
Tilak Varma Gesture: రోహిత్ కోసం తిలక్ వర్మ ’45’ స్పెషల్ గెస్టర్.. వీడియో వైరల్
-
Gold and Silver Rates: భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. నేడు తులం ఎంతంటే?
ట్రెండింగ్
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!