Pawan Kalyan- CM Chandrababu రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లోని నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను సీఎం చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో పరామర్శించిన ముఖ్యమంత్రి, త్వరగా కోలుకోవాలని, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలని తెలియజేశారు.
Speaker Ayanna Patrudu: నా బాధను మనసు విప్పి చెబుతున్నాను.. కొందరు ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోయినా జీతం తీసుకుంటున్నారు అని శాసన సభా స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత మాజీమంత్రి రోజాకు లేదు అని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటక మంత్రిగా రోజా గతంలో రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. ఇక, పవన్ కళ్యాణ్ సినిమా నటుడుగానే విమానాల్లోనే తిరిగారు.. ఇప్పుడు మంత్రిగా విమానాల్లో తిరిగితే తప్పేంటి అని ప్రశ్నించారు.
అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో పోలీసులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.. రషీద్ ను చంపినట్టే వెంకట ప్రసాద్ ను హత్య చేసేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నించారు.. చివరకు వెంకట ప్రసాద్ చనిపోయాడులే అని వదిలేసి వెళ్లిపోయారు.. పోలీసులు నేరస్తులతో కుమ్మక్కై బాధితుడిపైనే కేసు పెట్టారని ఆరోపించారు.