Ambati Rambabu: ఇదేం పోలీస్ వ్యవస్థ.. వైసీపీ నేతలపై దాడి చేసిన వారిని పట్టించుకోరా..?
- పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగించారు..
- వైసీపీకి చెందిన ఒక బీసీ నాయకుడిపైన కత్తితో దాడి చేశారు..
- బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేయడం విడ్డూరం: అంబాటి రాంబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం టీ. అన్నవరంలో టీడీపీ నేతల దాడిలో గాయపడి గుంటూరులో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త వెంకటప్రసాద్ ను మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో పోలీసులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.. రషీద్ ను చంపినట్టే వెంకట ప్రసాద్ ను హత్య చేసేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నించారు.. చివరకు వెంకట ప్రసాద్ చనిపోయాడులే అని వదిలేసి వెళ్లిపోయారు.. పోలీసులు నేరస్తులతో కుమ్మక్కై బాధితుడిపైనే కేసు పెట్టారని ఆరోపించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయవలసిన పోలీసులు చిన్న పెట్టి కేసు పెట్టారు.. ఈ కేసులో హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలంటే ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠీని కలవాలి.. సర్వ శ్రేష్ట త్రిపాఠీని కలవాలంటే చంద్రబాబు, లోకేష్ ల వద్దకు వెళ్లాలి.. అప్పుడు కానీ ఐజి కలవరు.. పోలీసులు నేరస్తులతో కుమ్మకు అవ్వడం ఈ సమాజానికి ప్రమాదకరమని అంబాటి రాంబాబు పేర్కొన్నారు.
Read Also: Lord Ganesh: 4,000 మంది విద్యార్థులు, 5,000 దీపాలతో అద్భుతం.. వైరల్ వీడియో
Also Read
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. టి. అన్నవరం తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ గ్రామం.. 2024 ఎన్నికల్లో వెంకట ప్రసాద్ వైసీపీ బూత్ ఏజెంట్ గా ఉన్నాడు.. వెంకట ప్రసాద్ బ్రతికి ఉంటే రాజకీయంగా తమకు ఇబ్బంది అవుతుందని టీడీపీ నాయకులు భావించారు.. కొన్నాళ్లుగా వెంకట ప్రసాద్ ను చంపాలని కుట్రపన్నారు.. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రోద్బలంతోనే వెంకట ప్రసాద్ పై దాడి జరిగింది.. చావు బ్రతుకుల మధ్య వెంకట ప్రసాద్ ఉంటే పోలీసులు ఆయనపైనే కేసు పెట్టారు.. ఇదేం పోలీస్ వ్యవస్థ అని ప్రశ్నించారు.వెంకట ప్రసాద్ పై పోలీసులు పెట్టిన కేసుపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Rohit Sharma and Virat Kohli: రోహిత్-కోహ్లీ ఫ్లాప్ షో.. తొలి వన్డేలో వరుస ఓవర్లలో పెవిలియన్ బాట
-
Off The Record: నోరు అదుపులో లేక.. మాట పొదుపు లేక ఆ తండ్రి కొడుకులు ఇరుకున పడ్డారా?
-
OTR: సింగనమల వైసీపీలో సెగలు..
-
OTR: తాడేపల్లిగూడెం వైసీపీలో ముదిరిన వర్గపోరు..
-
Trump-Iran: ట్రంప్ సంచలన ప్రకటన.. హార్ముజ్ కార్గో ఫీజు రద్దు.. ఇరాన్ నౌకలపై దిగ్బంధం అమలు
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, పానోరమిక్ సన్రూఫ్తో కొత్త Renault Duster Adventure ఎడిషన్ లాంచ్.! ధర ఎంతంటే.?
-
ఏడు నెలల్లో మూడోసారి ధరల పెంపు.. Mahindra Thar కొత్త రేట్లు ఇవే..!
-
CSK Head Coach: సీఎస్కే కొత్త కోచ్ రేసులో ముగ్గురు.. భారత్ నుంచి ఇద్దరు క్రికెట్ దిగ్గజాలు!
-
Poha: 10 నిమిషాల్లో టేస్టీ అటుకుల పులిహోర.. ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది..!
-
Ashleigh Gardner Controversy: ఆసీస్ మహిళా క్రికెటర్ల మధ్య అక్రమ సంబంధం.. భార్య ఉండగానే సహచర ప్లేయర్తో ఎఫైర్!