Ambati Rambabu: ఇదేం పోలీస్ వ్యవస్థ.. వైసీపీ నేతలపై దాడి చేసిన వారిని పట్టించుకోరా..?
- పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగించారు..
- వైసీపీకి చెందిన ఒక బీసీ నాయకుడిపైన కత్తితో దాడి చేశారు..
- బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేయడం విడ్డూరం: అంబాటి రాంబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం టీ. అన్నవరంలో టీడీపీ నేతల దాడిలో గాయపడి గుంటూరులో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త వెంకటప్రసాద్ ను మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో పోలీసులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.. రషీద్ ను చంపినట్టే వెంకట ప్రసాద్ ను హత్య చేసేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నించారు.. చివరకు వెంకట ప్రసాద్ చనిపోయాడులే అని వదిలేసి వెళ్లిపోయారు.. పోలీసులు నేరస్తులతో కుమ్మక్కై బాధితుడిపైనే కేసు పెట్టారని ఆరోపించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయవలసిన పోలీసులు చిన్న పెట్టి కేసు పెట్టారు.. ఈ కేసులో హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలంటే ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠీని కలవాలి.. సర్వ శ్రేష్ట త్రిపాఠీని కలవాలంటే చంద్రబాబు, లోకేష్ ల వద్దకు వెళ్లాలి.. అప్పుడు కానీ ఐజి కలవరు.. పోలీసులు నేరస్తులతో కుమ్మకు అవ్వడం ఈ సమాజానికి ప్రమాదకరమని అంబాటి రాంబాబు పేర్కొన్నారు.
Read Also: Lord Ganesh: 4,000 మంది విద్యార్థులు, 5,000 దీపాలతో అద్భుతం.. వైరల్ వీడియో
Also Read
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
- Macharla: ఏకాంతంగా ఉన్న జంటలే టార్గెట్.. వీడియోలతో ఏఎస్ఐ అరాచకాలు..!
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. టి. అన్నవరం తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ గ్రామం.. 2024 ఎన్నికల్లో వెంకట ప్రసాద్ వైసీపీ బూత్ ఏజెంట్ గా ఉన్నాడు.. వెంకట ప్రసాద్ బ్రతికి ఉంటే రాజకీయంగా తమకు ఇబ్బంది అవుతుందని టీడీపీ నాయకులు భావించారు.. కొన్నాళ్లుగా వెంకట ప్రసాద్ ను చంపాలని కుట్రపన్నారు.. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రోద్బలంతోనే వెంకట ప్రసాద్ పై దాడి జరిగింది.. చావు బ్రతుకుల మధ్య వెంకట ప్రసాద్ ఉంటే పోలీసులు ఆయనపైనే కేసు పెట్టారు.. ఇదేం పోలీస్ వ్యవస్థ అని ప్రశ్నించారు.వెంకట ప్రసాద్ పై పోలీసులు పెట్టిన కేసుపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Off The Record : విచ్చలవిడిగా ఇసుక అక్రమాలు.. మైనింగ్ ఏడీ ఫణిభూషణ్ పై తీవ్ర ఆరోపణలు
-
Story Board : నిర్లక్ష్యానికి శిక్షల్లేవా? పిల్లల మానసిక వేదన పట్టించుకోరా?
-
Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
-
DGP CV Anand: ఉగ్ర ముప్పుపై తెలంగాణ అప్రమత్తం.. OCTOPUS యాక్షన్ ప్లాన్..!
-
Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!