Ambati Rambabu: ఇదేం పోలీస్ వ్యవస్థ.. వైసీపీ నేతలపై దాడి చేసిన వారిని పట్టించుకోరా..?
- పల్నాడు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు బరితెగించారు..
- వైసీపీకి చెందిన ఒక బీసీ నాయకుడిపైన కత్తితో దాడి చేశారు..
- బాధితులపైనే పోలీసులు కేసు నమోదు చేయడం విడ్డూరం: అంబాటి రాంబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ambati Rambabu: పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం టీ. అన్నవరంలో టీడీపీ నేతల దాడిలో గాయపడి గుంటూరులో చికిత్స పొందుతున్న వైసీపీ కార్యకర్త వెంకటప్రసాద్ ను మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్రహ్మనాయుడు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాలో పోలీసులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.. రషీద్ ను చంపినట్టే వెంకట ప్రసాద్ ను హత్య చేసేందుకు తెలుగుదేశం నేతలు ప్రయత్నించారు.. చివరకు వెంకట ప్రసాద్ చనిపోయాడులే అని వదిలేసి వెళ్లిపోయారు.. పోలీసులు నేరస్తులతో కుమ్మక్కై బాధితుడిపైనే కేసు పెట్టారని ఆరోపించారు. నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేయవలసిన పోలీసులు చిన్న పెట్టి కేసు పెట్టారు.. ఈ కేసులో హత్యాయత్నం కేసుగా నమోదు చేయాలంటే ఐజి సర్వ శ్రేష్ట త్రిపాఠీని కలవాలి.. సర్వ శ్రేష్ట త్రిపాఠీని కలవాలంటే చంద్రబాబు, లోకేష్ ల వద్దకు వెళ్లాలి.. అప్పుడు కానీ ఐజి కలవరు.. పోలీసులు నేరస్తులతో కుమ్మకు అవ్వడం ఈ సమాజానికి ప్రమాదకరమని అంబాటి రాంబాబు పేర్కొన్నారు.
Read Also: Lord Ganesh: 4,000 మంది విద్యార్థులు, 5,000 దీపాలతో అద్భుతం.. వైరల్ వీడియో
Also Read
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్ప్రెస్లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
- Palnadu Police Crime: పల్నాడులో క్రిమినల్స్గా మారిపోయిన పోలీసులు.. వరుస ఘటనలు.. తాజాగా లాయర్ హత్య..
మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ.. టి. అన్నవరం తెలుగుదేశం పార్టీకి రిగ్గింగ్ గ్రామం.. 2024 ఎన్నికల్లో వెంకట ప్రసాద్ వైసీపీ బూత్ ఏజెంట్ గా ఉన్నాడు.. వెంకట ప్రసాద్ బ్రతికి ఉంటే రాజకీయంగా తమకు ఇబ్బంది అవుతుందని టీడీపీ నాయకులు భావించారు.. కొన్నాళ్లుగా వెంకట ప్రసాద్ ను చంపాలని కుట్రపన్నారు.. ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రోద్బలంతోనే వెంకట ప్రసాద్ పై దాడి జరిగింది.. చావు బ్రతుకుల మధ్య వెంకట ప్రసాద్ ఉంటే పోలీసులు ఆయనపైనే కేసు పెట్టారు.. ఇదేం పోలీస్ వ్యవస్థ అని ప్రశ్నించారు.వెంకట ప్రసాద్ పై పోలీసులు పెట్టిన కేసుపై న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G: సామ్ సంగ్ గెలాక్సీ A27 5G రిలీజ్.. 5,000mAh బ్యాటరీ, 6.7-ఇంచెస్ AMOLED డిస్ప్లే
-
Sitanshu Kotak: “వైభవ్ కోసం పాతోళ్లను తీసేయలేం”.. బుడ్డోడి ప్లేయింగ్-11 ఛాన్స్పై కోచ్ సంచలన ప్రకటన..
-
Nandini Reddy: ‘మా ఇంటి బంగారం’ షూటింగ్లోనే సమంత ప్రెగ్నెంట్.. ఆ సీక్రెట్ నాకు మాత్రమే తెలుసు!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!
-
Varanasi: వారణాసిపై ఒక్క హింట్ కూడా ఇవ్వలేదు బాబోయ్.. నెట్ఫ్లిక్స్ వీపీ మోనికా ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!