Kandula Durgesh: జబర్దస్త్లో డాన్స్ చేసిన రోజా.. పవన్ గురించి మాట్లాడే అర్హత లేదు!
- జబర్దస్త్లో డాన్స్ చేసిన రోజా.. మంత్రిగా ఏం అభివృద్ధి చేసింది?..
- పవన్ కళ్యాణ్ను విమర్శించే అర్హత ఆర్కే రోజాకు లేదు..
- మీకు కబ్జాలు, దొంగ వ్యాపారాలు ఉంటే.. పవన్ కళ్యాణ్కు సినిమాలే ఉన్నాయి: మంత్రి దుర్గేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kandula Durgesh: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలపై వైసీపీ తప్పుడు ప్రచారంపై మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పీపీపీ పద్ధతిలో చేపట్టిన కాలేజీల నిర్మాణం నిర్ణీత సమయంలోగా పూర్తి అవుతుందని పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తులపై పూర్తి అజమాయిషీ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అన్నారు. ఇక, వైసీపీ హయాంలో నిర్మించిన ఏ ఒక్క భవనం కూడా పూర్తి చేయలేదు అని ఆరోపించారు. అలాగే, విశాఖలోని రుషికొండపై ఆదాయం వచ్చే రిసార్ట్స్ ను పడగొట్టి రాజప్రసాదాలు నిర్మించారు అని ఎద్దేవా చేశారు. అయితే, పీపీపీ మోడ్ ను ప్రతిపక్ష నేతలు అర్థం చేసుకోవాలి అని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు.
Read Also: Aishwarya : సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసిన గ్లామరస్ బ్యూటీ.. కారణం ఇదే
Also Read
- JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. 'జై కొట్టు' వీడియో వైరల్!
- Pawan Kalyan Birthday: అమలాపురం గడ్డ పవన్ అభిమానుల అడ్డా.. పవర్ స్టార్ పుట్టినరోజు మాకు పండుగే!
- YS Jagan: 'నాన్నా.. మిమ్మల్ని ఎప్పటికీ మిస్ అవుతూనే ఉంటాను'.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్!
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
అలాగే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత మాజీమంత్రి రోజాకు లేదు అని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటక మంత్రిగా రోజా గతంలో రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. ఇక, పవన్ కళ్యాణ్ సినిమా నటుడుగానే విమానాల్లోనే తిరిగారు.. ఇప్పుడు మంత్రిగా విమానాల్లో తిరిగితే తప్పేంటి అని ప్రశ్నించారు. జబర్దస్త్ లో డాన్స్ వేసి రోజా చేసింది ఏమిటి?.. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే తప్పేంటి అన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ 90 శాతం ప్రజలకు సేవ చేస్తుంటే కేవలం 10 శాతం మాత్రమే సినిమాలకు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. మీలా కబ్జాలు, దొంగ వ్యాపారాలు ఉన్నాయా.. పవన్ కళ్యాణ్ కు సినిమాలు మాత్రమే ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
ఇక, రాష్ట్రంలో 10 వేల 644 కోట్ల రూపాయలతో 15 నెలల్లో.. పర్యాటక రంగానికి పెట్టుబడులు సాధించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. 8080 మందికి వీటి ద్వారా ఉపాధి లభించింది.. రూ. 698 కోట్లతో ఇప్పటికే 88 ప్రాజెక్టులను ప్రారంభించామన్నారు. వీటి ద్వారా 3, 554 మందికి ఉపాధి లభిస్తుంది అన్నారు. దేశంలో పర్యాటక అభివృద్ధిలో పది రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. ఐదేళ్లలో 25 వేల కోట్లు పర్యాటక పెట్టుబడులు ఆకర్షించాలని చూస్తున్నాం.. రాష్ట్రంలో టూరిస్టుల కోసం హోటల్స్ పెంచాలని నిర్ణయించాం.. తూర్పు గోదావరిలో కోకో హబ్బుగా తయారు చేస్తామని మంత్రి దుర్గేష్ అన్నారు.
తాజావార్తలు
-
Vedika Pinto: లక్ష్య సరసన ‘ముసాఫిర్ కేఫ్’ బ్యూటీ.. ‘రాఖ్’ డైరెక్టర్తో సైకలాజికల్ లవ్ స్టోరీ!
-
JanaSena Youth Wing Theme Song: జనసేన పార్టీ యువజన విభాగం గేయం ఆవిష్కరణ.. ‘జై కొట్టు’ వీడియో వైరల్!
-
KTR: ‘దరిద్రం దండయాత్ర’కు 1000 రోజులు.. కాంగ్రెస్పై కేటీఆర్ ఫైర్!
-
Toxic: సొంత గడ్డపైనే యశ్కు షాక్.. ‘టాక్సిక్’ వసూళ్లు చూసి ట్రేడ్ వర్గాలు అవాక్కు!
-
Sonu Sood: నేపాల్ విధ్వంసం చూసి చలించిపోయిన సోనూ సూద్.. బాధితులకు అండగా నిలవాలని విజ్ఞప్తి
ట్రెండింగ్
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!