Kandula Durgesh: జబర్దస్త్లో డాన్స్ చేసిన రోజా.. పవన్ గురించి మాట్లాడే అర్హత లేదు!
- జబర్దస్త్లో డాన్స్ చేసిన రోజా.. మంత్రిగా ఏం అభివృద్ధి చేసింది?..
- పవన్ కళ్యాణ్ను విమర్శించే అర్హత ఆర్కే రోజాకు లేదు..
- మీకు కబ్జాలు, దొంగ వ్యాపారాలు ఉంటే.. పవన్ కళ్యాణ్కు సినిమాలే ఉన్నాయి: మంత్రి దుర్గేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kandula Durgesh: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలపై వైసీపీ తప్పుడు ప్రచారంపై మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పీపీపీ పద్ధతిలో చేపట్టిన కాలేజీల నిర్మాణం నిర్ణీత సమయంలోగా పూర్తి అవుతుందని పేర్కొన్నారు. ప్రైవేట్ వ్యక్తులపై పూర్తి అజమాయిషీ చేసే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది అన్నారు. ఇక, వైసీపీ హయాంలో నిర్మించిన ఏ ఒక్క భవనం కూడా పూర్తి చేయలేదు అని ఆరోపించారు. అలాగే, విశాఖలోని రుషికొండపై ఆదాయం వచ్చే రిసార్ట్స్ ను పడగొట్టి రాజప్రసాదాలు నిర్మించారు అని ఎద్దేవా చేశారు. అయితే, పీపీపీ మోడ్ ను ప్రతిపక్ష నేతలు అర్థం చేసుకోవాలి అని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు.
Read Also: Aishwarya : సోషల్ మీడియాకు గుడ్ బై చెప్పేసిన గ్లామరస్ బ్యూటీ.. కారణం ఇదే
Also Read
అలాగే, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను విమర్శించే అర్హత మాజీమంత్రి రోజాకు లేదు అని మంత్రి దుర్గేష్ తెలిపారు. పర్యాటక మంత్రిగా రోజా గతంలో రాష్ట్రానికి చేసిందేమి లేదన్నారు. ఇక, పవన్ కళ్యాణ్ సినిమా నటుడుగానే విమానాల్లోనే తిరిగారు.. ఇప్పుడు మంత్రిగా విమానాల్లో తిరిగితే తప్పేంటి అని ప్రశ్నించారు. జబర్దస్త్ లో డాన్స్ వేసి రోజా చేసింది ఏమిటి?.. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే తప్పేంటి అన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ 90 శాతం ప్రజలకు సేవ చేస్తుంటే కేవలం 10 శాతం మాత్రమే సినిమాలకు కేటాయిస్తున్నారని పేర్కొన్నారు. మీలా కబ్జాలు, దొంగ వ్యాపారాలు ఉన్నాయా.. పవన్ కళ్యాణ్ కు సినిమాలు మాత్రమే ఉన్నాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు.
ఇక, రాష్ట్రంలో 10 వేల 644 కోట్ల రూపాయలతో 15 నెలల్లో.. పర్యాటక రంగానికి పెట్టుబడులు సాధించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. 8080 మందికి వీటి ద్వారా ఉపాధి లభించింది.. రూ. 698 కోట్లతో ఇప్పటికే 88 ప్రాజెక్టులను ప్రారంభించామన్నారు. వీటి ద్వారా 3, 554 మందికి ఉపాధి లభిస్తుంది అన్నారు. దేశంలో పర్యాటక అభివృద్ధిలో పది రాష్ట్రాల్లో ఒకటిగా ఆంధ్రప్రదేశ్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. ఐదేళ్లలో 25 వేల కోట్లు పర్యాటక పెట్టుబడులు ఆకర్షించాలని చూస్తున్నాం.. రాష్ట్రంలో టూరిస్టుల కోసం హోటల్స్ పెంచాలని నిర్ణయించాం.. తూర్పు గోదావరిలో కోకో హబ్బుగా తయారు చేస్తామని మంత్రి దుర్గేష్ అన్నారు.
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?