Kurasala Kannababu: ప్రచార ఆర్భాటాలు చేసుకోవడం తప్ప చేసిందేమీ లేదు..
- ఎక్కడైనా బెస్ట్ ఉంటే అది నాదేనని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు..
- చంద్రబాబు హయాంలో ఎన్నికల హామీలు ఎగ్గొటడం అలవాటుగా మారింది..
- జగన్ చేసిన మంచి పనులను కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు: కన్నబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurasala Kannababu: చంద్రబాబు ఒక కాపీ నేత.. ఎక్కడైనా ఒక బెస్ట్ ఉంటే దాన్ని తీసుకుని ఇది నాదేనని చెప్పుకోవటంలో దిట్ట అని వైసీపీ మాజీమంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం.. వైసీపీ రైతు భరోసా పథకానికి కాపీ.. రైతులను అప్పుల కోసం తిరగొద్దనే లక్ష్యంతో రైతు భరోసా పథకం తెచ్చిన జగన్.. గతంలో చంద్రబాబు హయాంలో ఎన్నికల హామీలు ఎగ్గొట్టడం అలవాటు అయింది. కానీ, జగన్ ఇచ్చిన.. ఇవ్వని హామీలు కూడా అమలు చేశారని పేర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు అన్నదాత సుఖీభవ పథకం- పీఎం కిసాన్ కు అదనమని చెబుతున్నారు.. తొలి ఏడాది రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారని మాజీమంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
Read Also: Sai Pallavi : హిట్ ఇచ్చిన హీరోతో సాయిపల్లవి మరో సినిమా..?
Also Read
- CM Chandrababu: మూడు రాష్ట్రాల భవిష్యత్తుకు తుంగభద్ర నాంది.. చరిత్ర సృష్టించిన సీఎంల భేటీ..
- YS Jagan: మహిళలకు మరో మోసం.. డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారు!
- Kiran Kumar Reddy: పరస్పర గౌరవమే రాజకీయాలకు బలం.. మాజీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు..
- Holiday: మొహర్రం ఏ రోజు.. సెలవు జూన్ 25నా.. జూన్ 26నా..?
అయితే, గత వైసీపీ హయంలో 53 లక్షల మందికి పథకాన్ని అమలు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం 7 లక్షల మందికి ఎగ్గొట్టారు అని మాజీ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. 7 లక్షల మందికి తగ్గటమంటే రాష్ట్రంలో రైతులు వ్యవసాయాన్ని వదిలేశారు.. లేకుంటే వలస వెళ్లారు.. వాళ్లకు వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదా.. అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా.. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 53 లక్షల మందికి 34 వేల కోట్లకు పైగా ఇచ్చారు.. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు 40 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Also: Botsa Satyanarayana: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా..
ఇక, ఇప్పటి వరకు రూ. 4,685 కోట్లు మాత్రమే ఇచ్చారని కురసాల కన్నబాబు తెలిపారు. ఇవ్వాల్సిన దాని కన్నా ఇంచుమించి 17 వేలకోట్లు కోత పెట్టారు.. కూటమి ప్రభుత్వం రైతులకు మొత్తం 16,746 కోట్లు బాకీ పడింది.. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేసిన ఘటన జగన్ కి దక్కింది.. భూ యజమాని హక్కులు కాపాడుతూ సీసీఆర్సీ కార్డులు తీసుకువచ్చాం.. ఇప్పుడు కౌలు రైతులకు ఈ పథకం వర్తింపజేయలేదు.. రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు.. అన్నీ సంక్షేమ పథకాలు కూడా కౌలు రైతులకు అందించిన ఘనత ఒక్క జగన్ దే.. ఏరుదాటాక తెప్ప తగలేసినట్లుగా వారిని కౌలు రైతులను చంద్రబాబు వదిలేశారని వైసీపీ నేత కన్నబాబు అన్నారు.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేఫ్లో గంటపాటు ప్రియుడితో కలిసి హత్యకు కుట్ర.. వెలుగులోకి వీడియోలు
-
Samantha : శోభితకు సమంత కౌంటర్.. అసలు నిజమేంటి?
-
Khamenei funeral: ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ ఆహ్వానం.. ఇరకాటంలో మోడీ సర్కార్..
-
Pradeep Ranganathan: ఆ డైరెక్టర్’తో ప్రదీప్ రంగనాథన్ స్ట్రెయిట్ తెలుగు సినిమా!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ vs ఐర్లాండ్.. ‘బేబీ బాస్’ను ఆపేందుకు ఐర్లాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ లీక్..!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!