Kurasala Kannababu: ప్రచార ఆర్భాటాలు చేసుకోవడం తప్ప చేసిందేమీ లేదు..
- ఎక్కడైనా బెస్ట్ ఉంటే అది నాదేనని చెప్పుకోవడం చంద్రబాబుకు అలవాటు..
- చంద్రబాబు హయాంలో ఎన్నికల హామీలు ఎగ్గొటడం అలవాటుగా మారింది..
- జగన్ చేసిన మంచి పనులను కూడా చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారు: కన్నబాబు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kurasala Kannababu: చంద్రబాబు ఒక కాపీ నేత.. ఎక్కడైనా ఒక బెస్ట్ ఉంటే దాన్ని తీసుకుని ఇది నాదేనని చెప్పుకోవటంలో దిట్ట అని వైసీపీ మాజీమంత్రి కురసాల కన్నబాబు అన్నారు. అన్నదాత సుఖీభవ పథకం.. వైసీపీ రైతు భరోసా పథకానికి కాపీ.. రైతులను అప్పుల కోసం తిరగొద్దనే లక్ష్యంతో రైతు భరోసా పథకం తెచ్చిన జగన్.. గతంలో చంద్రబాబు హయాంలో ఎన్నికల హామీలు ఎగ్గొట్టడం అలవాటు అయింది. కానీ, జగన్ ఇచ్చిన.. ఇవ్వని హామీలు కూడా అమలు చేశారని పేర్కొన్నారు. గత ఎన్నికలకు ముందు అన్నదాత సుఖీభవ పథకం- పీఎం కిసాన్ కు అదనమని చెబుతున్నారు.. తొలి ఏడాది రైతులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారని మాజీమంత్రి కురసాల కన్నబాబు తెలిపారు.
Read Also: Sai Pallavi : హిట్ ఇచ్చిన హీరోతో సాయిపల్లవి మరో సినిమా..?
Also Read
- Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
- Southern Zonal Council Meeting: దక్షిణాది ఐక్యతే దేశ బలం.. జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు కీలక ప్రసంగం
- BC Reservation: బీసీలకు గుడ్న్యూస్.. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కోటా పెంపు.. ప్రభుత్వం ఉత్తర్వులు
- AP Junior Doctors Strike: చర్చలు విఫలం.. స్టైఫండ్ పెంపుపై పట్టు.. జూడాల సమ్మె ఉధృతం..!
అయితే, గత వైసీపీ హయంలో 53 లక్షల మందికి పథకాన్ని అమలు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం 7 లక్షల మందికి ఎగ్గొట్టారు అని మాజీ మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. 7 లక్షల మందికి తగ్గటమంటే రాష్ట్రంలో రైతులు వ్యవసాయాన్ని వదిలేశారు.. లేకుంటే వలస వెళ్లారు.. వాళ్లకు వ్యవసాయం గిట్టుబాటు కావటం లేదా.. అంటే ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా.. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 53 లక్షల మందికి 34 వేల కోట్లకు పైగా ఇచ్చారు.. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కొక్క రైతుకు 40 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Read Also: Botsa Satyanarayana: ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తారా..
ఇక, ఇప్పటి వరకు రూ. 4,685 కోట్లు మాత్రమే ఇచ్చారని కురసాల కన్నబాబు తెలిపారు. ఇవ్వాల్సిన దాని కన్నా ఇంచుమించి 17 వేలకోట్లు కోత పెట్టారు.. కూటమి ప్రభుత్వం రైతులకు మొత్తం 16,746 కోట్లు బాకీ పడింది.. గత ప్రభుత్వ హయాంలో ఈ పథకాన్ని కౌలు రైతులకు వర్తింపజేసిన ఘటన జగన్ కి దక్కింది.. భూ యజమాని హక్కులు కాపాడుతూ సీసీఆర్సీ కార్డులు తీసుకువచ్చాం.. ఇప్పుడు కౌలు రైతులకు ఈ పథకం వర్తింపజేయలేదు.. రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు.. అన్నీ సంక్షేమ పథకాలు కూడా కౌలు రైతులకు అందించిన ఘనత ఒక్క జగన్ దే.. ఏరుదాటాక తెప్ప తగలేసినట్లుగా వారిని కౌలు రైతులను చంద్రబాబు వదిలేశారని వైసీపీ నేత కన్నబాబు అన్నారు.
తాజావార్తలు
-
Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్లో రెండో రౌండ్కు అర్హత
-
India-Singapore: భారత్-సింగపూర్ మధ్య కీలక ఒప్పందాలు.. విశేషాలు ఇవే!
-
Smartphone Buying Trends: కెమెరా, బ్యాటరీ కంటే దానికే ఎక్కువ ప్రాధాన్యం.. స్మార్ట్ఫోన్ మార్కెట్లో కొత్త ట్రెండ్.. సర్వేలో ఆసక్తికర అంశాలు..
-
Pawan Kalyan: 21 సీట్ల వ్యూహం అసెంబ్లీ ఎన్నికలకే.. స్థానిక ఎన్నికల్లో జనసేన కొత్త వ్యూహం
-
OTR: ప్రభుత్వానికి సలహాలు ఇస్తున్నారా? లేక పవర్, ప్రోటోకాల్ ఎంజాయ్ చేస్తున్నారా?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?