Home
Andhra Pradesh Latest News
Andhra Pradesh Latest News News
-
Earthquake In Ongole: ఒంగోలులో భూ ప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
Earthquake In Ongole: ఒంగోలు నగరంలో శుక్రవారం రాత్రి స్వల్ప భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ముఖ్యంగా దేవుడు చెరువు, నెల్లూరు బస్టాండ్, మామిడిపాలెం ప్రాంతాల్లో ఈ ప్రకంపనల ప్రభావం స్పష్టంగా కనిపించినట్లు స్థానికులు తెలిపారు. రాత్రి సమయంలో ఇళ్లలో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆకస్మికంగా భూమి కంపించినట్లు ప్రజలు పేర్కొన్నారు. కొంతసేపు ఇళ్లలోని ఫ్యాన్లు, కిటికీలు స్వల్పంగా కంపించడంతో చాలామంది ఇళ్ల బయటకు పరుగులు తీశారు. అయితే, ఎలాంటి… -
AP Liquor Scam Case: లిక్కర్ కేసులో నిందితులకు హైకోర్టులో ఊరట..
AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట దక్కింది. ఈ కేసులో ఈ ముగ్గురు నిందితులను అరెస్టు చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను జూన్ 24వ తేదీ వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ఇక, నిందితులు దాఖలు చేసిన… -
Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
Andhra Pradesh Fuel Crisis: ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రరూపం దాల్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాతో పాటు మరికొన్ని జిల్లాల్లో అనేక పెట్రోల్ బంకుల వద్ద ‘నో స్టాక్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ఇంధనం కోసం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో పరిస్థితి మరింత తీవ్రంగా ఉందని సమాచారం. పలు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు పూర్తిగా అయిపోవడంతో వాహనదారులు బంకుల వద్ద నిరాశగా వెనుదిరుగుతున్నారు. కొన్నిచోట్ల బంక్… -
AP Ministers Singapore Tour: సింగపూర్ చేరుకున్న ఏపీ మంత్రుల బృందం.. 7 రోజుల టూర్..
AP Ministers Singapore Tour: ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వానికి చెందిన ఏడుగురు మంత్రుల బృందం అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్ చేరుకుంది. ఈ నెల 21వ తేదీ నుంచి అంటే ఇవాళ్టి నుంచి ఈ నెల 27వ తేదీ వరకు మొత్తం ఏడు రోజుల పాటు ఈ పర్యటన కొనసాగనుంది. మంత్రుల సింగపూర్ పర్యటనకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అనుమతి ఇచ్చిన విషయం విదితమే.. సుపరిపాలన, ఆధునిక పరిపాలనా విధానాలు, ఉత్తమ పాలనా పద్ధతులు (బెస్ట్ ప్రాక్టీసెస్)… -
Anakapalli Earthquake: అనకాపల్లిలో భూప్రకంపనలు..
Anakapalli Earthquake: అనకాపల్లి జిల్లాలో అర్ధరాత్రి సమయంలో స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి.. రాత్రి 12 గంటల 30 నిమిషాల సమయంలో కొన్ని సెకన్ల పాటు ఈ ప్రకంపనలు సంభవించినట్లు ప్రజలు చెబుతున్నారు. దీంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆందోళన నెలకొంది. అనకాపల్లి పట్టణం పరిసర ప్రాంతాలతో పాటు సమీప గ్రామాల్లో కూడా ప్రకంపనల ప్రభావం కనిపించినట్లు సమాచారం. ఇళ్లలోని కొన్ని సామాగ్రి స్వల్పంగా కదిలినట్లు స్థానికులు పేర్కొన్నారు. కొంతమంది నిద్రలో ఉండగానే మంచాలు, ఫర్నిచర్ స్వల్పంగా కంపించినట్లు తెలిపారు.… -
Amaravati Fire Accidents: అమరావతిలో వరుస అగ్నిప్రమాదాలు.. సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం
Amaravati Fire Accidents: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ఇటీవల వరుస అగ్నిప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి.. అయితే, అమరావతి ప్రాంతంలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదాలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనలపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)ను ఏర్పాటు చేసింది. ఈ నెల 11వ తేదీన ఎల్ అండ్ టీ సంస్థ వద్ద, అలాగే 23వ తేదీన మేఘా ఇంజినీరింగ్ సంస్థ పరిధిలో జరిగిన అగ్నిప్రమాదాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనలపై నిజానిజాలు… -
LPG Shortage: LPG సిలిండర్ల డెలివరీపై మంత్రి నాదెండ్ల కీలక ఆదేశాలు..
LPG Shortage: ఆంధ్రప్రదేశ్లో ఎల్పీజీ సిలిండర్ల సరఫరాపై కీలక ఆదేశాలు జారీ చేశారు మంత్రి నాదెండ్ల మనోహర్.. రాష్ట్రంలో ఎలాంటి అంతరాయం లేదన్న ఆయన.. ప్రజలు గ్యాస్ కొరతపై భయాందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. మంత్రి మాట్లాడుతూ, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో ప్రతిరోజూ సమీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని ప్రజలకు సూచించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,00,479 ఎల్పీజీ సిలిండర్ల డెలివరీలు జరిగాయని వెల్లడించారు. అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో, ముఖ్యంగా… -
APSRTC: దివ్యాంగులకు గుడ్న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.. ఎస్కార్ట్కు 50 శాతం రాయితీ..
APSRTC: దివ్యాంగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం వారికి కల్పించింది.. అంతేకాదు.. ఇక, దివ్యాంగులతో ఎస్కార్ట్గా వచ్చేవారికి కూడా టికెట్ ధరలో 50 శాతం రాయితీ కల్పించనున్నారు.. దివ్యాంగుల సంక్షేమం, సామాజిక సమగ్రతను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం “ఇంద్రధనుస్సు” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. APSRTC విడుదల చేసిన ప్రకటన ప్రకారం, 40… -
AP Helpline: యుద్ధం కారణంగా విదేశాల్లో చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..
AP Helpline: పశ్చిమాసియాలో తలెత్తిన యుద్ధం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న రాష్ట్ర ప్రజలు సురక్షితంగా ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనిపై ఆర్టీజీఎస్ అధికారులు, ఎపీఎన్ఆర్టీ ప్రతినిధులతో క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. సౌదీ అరేబియా, దుబాయ్, ఖతార్, కువైట్ తదితర దేశాల్లోని రాష్ట్ర ప్రజలు యుద్ధం కారణంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలన్నారు. ఇందుకోసం కేంద్రంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అక్కడ చిక్కుకుపోయిన వారిని సంప్రదించి, తక్షణ సహాయం అందేలా చర్యలు… -
NDA Meeting: నేడు కూటమి నేతల కీలక భేటీ..
NDA Meeting: ఆంధ్రప్రదేశ్లో తాజా పరిణామాలు పొలిటికల్ హీట్ పెంచుతున్నాయి.. అయితే, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాల మధ్య నేడు కూటమి నేతల మధ్య అత్యంత ప్రాధాన్యత గల సమావేశం జరగనుంది. ఈరోజు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ మాధవ్ కలిసి సమావేశం కానున్నారు. ఈ భేటీకి కొంతమంది మంత్రులను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరగనున్నట్లు…
తాజావార్తలు
-
Story Board: మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
Tollywood: పర్సంటేజ్ సిస్టమ్ నుండి మినహాయింపు కోరిన 17 సినిమాల జాబితా..
-
Tawa Paneer Tikka Recipe: ఇంట్లోనే ఈజీగా రెస్టారెంట్ స్టైల్ ‘తవా పనీర్ టిక్కా’.. సీక్రెట్ రెసిపీ మీకోసం!
-
CM Revanth Reddy: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై రేవంత్ ఫైర్.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
-
Telangana Temples Revenue: ఆధ్యాత్మికతతో పాటు ఆర్థిక రికార్డులు.. 2025-26లో రూ.556 కోట్ల ఆదాయం
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..