Rajamahendravaram: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో కల్తీ పాలు తాగి అనారోగ్యానికి గురైన ఘటనలో రోజుకో ప్రాణం గాల్లో కలుస్తోంది. తాజాగాఈ ఘటనలో మరో మహిళ మృతి చెందారు. లాలాచెరువు ప్రాంతానికి చెందిన జి. వెంకటలక్ష్మి (69) చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆమె రాజమండ్రిలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనలో ఇప్పటివరకు మృతుల సంఖ్య 9కు చేరింది.
Anakapalli: మరికొన్ని గంటల్లో 2025 ఏడాదికి బై బై చెప్పబోతున్నాం. కొన్ని గంటల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం. ఈ ఇయర్ ఎండ్లో ఏపీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వండర్ బేబీ జన్మించింది. అనకాపల్లి ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నార్మల్ డెలివరీలోనే 4.8 కిలోల బరువుతో మగ శిశువుకు తల్లి జన్మనిచ్చింది. సాధారణంగా ఇంత అధిక బరువుతో ఉన్న శిశువులకు శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రి…
Scrub Typhus: తిరుపతి చంద్రగిరి(మం) తొండవాడలో ఆరేళ్ల బాలికకు స్క్రబ్ టైఫస్ సోకింది. బాలిక కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతుంది. చంద్రగిరి సీహెచ్సీ, అనంతరం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. రక్తపరీక్షల్లో స్క్రబ్ టైఫస్ పాజిటివ్గా వైద్యులు నిర్ధారించారు. బాలిక ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యాధికారులు వెల్లడించారు. గ్రామంలో పారిశుద్ధ్య చర్యలు, వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు.
AP: ఇవాళ చలో విజయవాడ మహాధర్నా యథాతథంగా కొనసాగుతుందని సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ యాజమాన్యం తెలిపింది. మధ్యాహ్నం 12 గంటలకు విజయవాడ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహిస్తున్నాట్లు తెలిపింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహాధర్నా సాగనుంది. రూ.2700 కోట్లు వెంటనే విడుదల చేయాలని ఆషా డిమాండ్ చేస్తోంది.. ప్రభుత్వం విడుదల చేసిన రూ. 250 కోట్లతో సరిపెట్టుకోలేం అంటున్నాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్..