ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్లలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. వరదల కారణంగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఇప్పటికే పెద్ద ఎత్తున నష్టం వాటిల్లింది. ఉప్పొంగుతున్న నదులు, భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలను విపత్తు అంచుకు నెట్టివేస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాలు యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి.
Uttarakhand: ఉత్తరాఖండ్లో పెన ప్రమాదం సంభవించింది. చమోలీలో బుధవారం జరిగిప ప్రమాదంలో పదిమంది మృతి చెందారు. ఇక్కడ నమామి గంగే ప్రాజెక్టుకు సంబంధించిన మురుగునీటి శుద్ధి కర్మాగారంలో ట్రాన్స్ఫార్మర్ పేలడంతో కరెంట్ వ్యాపించి పలువురు కాలి బూడిదయ్యారు.