అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఓ మెతుకు పట్టుకుంటే చాలు! డిస్నీప్లస్ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 26న గ్రాండ్ గా మొదలైన ‘బిగ్ బాస్ – నాన్ స్టాప్’ షో కంటెస్టెంట్స్ ను చూడగానే ఇది ఆకట్టుకునే కార్యక్రమం కాదనేది వీక్షకులకు అర్థమైపోయింది. గతంలో బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి, ఆరేడు వారాల లోపే బయటకు వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ ను తిరిగి తీసుకు రావడం వెనుక ఆంతర్యం ఏమిటో నిర్వాహకులకే తెలియాలి. బహుశా వీరంతా…
బిగ్ బాస్ అన్ని సీజన్లయందు ఆరవ సీజన్ వేరయా.. అంటే నిజమేననిపించక మానదు. 24 గంటల లైవ్ స్ట్రీమింగ్.. ఛాలెంజర్స్, వారియర్స్ మధ్య గొడవలు..ఈసారి ఈ కంటెస్టెంట్లను కూడా వివాదాలతో బాగా పరిచయం ఉన్నవారందరిని ఏరికోరి ఒకేదగ్గర పెట్టి మరిన్ని వివాదాలను తీసుకొస్తున్నారు బిగ్ బాస్ మేకర్స్.. ఈ సీజన్ మొదలైన వరం రోజుల్లోనే కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలైపోయాయి. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ హౌస్ ని రణరంగంగా మార్చేశారు. ఇక గతరాత్రి ఎపిసోడ్ లో…
కింగ్ నాగార్జున తన ఫ్యామిలీతో కలిసి నటించడం అనేది మనం సినిమాతో మొదలైంది. ఆతర్వాతచేసిన సినిమాలలో చైతుతోనే నాగ్ కనిపించాడు. ఇటీవల బంగార్రాజు చిత్రంలో నాగ్, చైతూల స్క్రీన్ ప్రజెన్స్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక దీంతో ఫ్యాన్స్ అఖిల్ తో కూడా ఒక మల్టీస్టారర్ చేయమని నాగ్ ని అడుగుతున్నారట. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం త్వరలోనే నాగ్, అఖిల్ మల్టీస్టారర్ రానున్నదట. ఇటీవల మలయాళంలో హిట్ అయిన బ్రో డాడీ సినిమాను…
అక్కినేని ఫ్యామిలీ ప్రస్తుతం కోడళ్ల వేటలో పడిందా.. ? అంటే నిజమే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అక్కినేని ఫ్యామిలిలో మొదటి పెళ్లి అచ్చి రాలేదని అందరికి తెల్సిన విషయమే.. అక్కినేని వారసులు నాగ చైతన్య విడాకుల.. అఖిల్ నిశ్చితార్థం క్యాన్సిల్ అవ్వడం.. ఇలా మొదటి పెళ్లి ఈ వారసులకు సెట్ కాలేదని తెలుస్తోంది. ఇక ఇద్దరు వారసుల బాధ్యతను నెత్తిమీద వేసుకున్న నాగ్.. ఇద్దరి కెరీర్ ని ఒక గాడిన పడేశాడు. చైతూ ప్రస్తుతం హీరోగా నిలదొక్కుకున్నాడు.…
బంపర్ ఆఫర్ చిత్రంతో తెలుగుతెరకు పరిచయమిన బ్యూటీ బిందు మాధవి. ఈ సినిమాతో భారీ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తరువాత అడపాదడపా తెలుగు సినిమాలో కనిపించి మెప్పించిన అమ్మడికి విజయాలు మాత్రం అందలేదు. తెలుగమ్మాయిగా తమిళ్ లో పరిచయమై అక్కడ మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్న బిందు ఈసారి తెలుగు ప్రేక్షకుల మనసులను గెలవాలని గట్టి నిర్ణయమే తీసుకోంది. బిగ్ బాస్ ఓటిటీ ద్వారా గట్టి కంబ్యాక్ ఇవ్వడానికి రెడీ అయ్యిపోయింది. తాజాగా బిందుకు…
హైదరాబాద్ శివారు చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలో తన తండ్రి, దివంగత ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీద అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటు కు అక్కినేని నాగార్జున ముందుకు వచ్చారు. ఎం.పీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి చెంగిచర్లలో శంకుస్థాపన కార్యక్రమంలో నాగార్జున కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అక్కినేని నాగార్జున, అమల, కుమారులు నాగ చైతన్య, నిఖిల్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. అటవీ పార్కు అభివృద్దికి ముఖ్యమంత్రి…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 ఎంతటి ప్రేక్షకాదరణ చూరగొందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కంటెస్టెంట్ల్ మధ్య గొడవలు, రొమాన్స్, టాస్క్ లు అబ్బో ఒకటని ఏముంది గంటసేపు ఇంటిల్లిపాదినీ కూర్చోపెట్టి ఎంటర్ టైన్మెంట్ ని అందిస్తోంది. ఇక తాజాగా సీజన్ 6 తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది బిగ్ బాస్. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ఈసారి గంట కాదు 24 గంటలు లైవ్ స్ట్రీమింగ్ లో బిగ్ బాస్ ని చూడొచ్చు..…
అక్కినేని నాగచైతన్య-సమంత విడాకులు తీసుకున్నారు.. వారి కెరీర్పై ఫోకస్ పెడుతూ.. తర్వాత ప్రాజెక్టులను ఎంపిక చూసుకుంటూ ముందుకు సాగుతున్నారు.. కానీ, టాలీవుడ్లో ఈ వ్యవహారం ఇప్పటికీ హాట్ టాపిక్గా సాగుతోంది.. చై-సామ్లో ఎవరు ముందుకు విడాకుల ప్రతిపాదన తీసుకొచ్చారు..? ఈ సెలబ్రిటీ కపుల్ విడిపోవడానికి కారణం ఇదేనా..? నాగ చైతన్యతోనే ప్లాబ్లమ్ స్టార్ట్ అయ్యిందా..? సమంతే విడాకుల కోసం పట్టుబట్టిందా? ఇలా అనేక కథనాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూనే ఉన్నాయి.. తాజాగా, ఈ వ్యవహారంపై…
అక్కినేని నాగ చైతన్య- సమంత విడాకుల గొడవ ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. నిత్యం వారి విడాకులపై ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట.. గతేడాది విడాకులు తీసుకొని విడిపోయారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి అక్కినేని నాగార్జుననే కారణం అని, ఆయన వలనే ఈ జంట మధ్య విబేధాలు వచ్చాయని పలు యూట్యూబ్ ఛానెల్స్ , సోషల్ మీడియాలో వైరల్ చేశాయి. కొన్ని విషయాల్లో సామ్ పనులు, నాగ్ కి…
సినిమా టికెట్ల ధరల వివాదం ఆంధ్రప్రదేశ్లో కాక రేపింది.. ఓవైపు సినిమా పరిశ్రమకు చెందినవారి కామెంట్లు.. మరోవైపు.. అధికార వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు చేసిన వ్యాఖ్యలు.. క్రమంగా ఏపీ సర్కార్, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ పెంచుతున్నాయనే విమర్శలు వినిపించాయి.. ఇప్పట్లో ఈ సమస్య పరిష్కారం కాదేమో అనే అనుమానాలు కూడా కలిగాయి.. అయితే, సినీ పెద్దలు వివాదానికి తెరదింపే ప్రయత్నాలు చేశారు.. ఇదే సమయంలో.. ఏపీ సీఎం వైఎస్ జగన్.. మెగాస్టార్ చిరంజీవిని…