Pooja Pal: ఉత్తరప్రదేశ్లో రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకి దారుణంగా తయారవుతున్నాయి. ఇటీవల సీఎం యోగి ఆదిత్యనాథ్ను ప్రశంసించడంతో.. సమాజవాదీ పార్టీ (సపా) నుండి బహిష్కరణకు గురైన ఎమ్మెల్యే పూజా పాల తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ తన హత్య జరిగితే దానికి బాధ్యులు మాత్రం సపా, పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ అవుతారని ఆమె స్పష్టంగా ఆరోపించారు. ఈ విషయమై పూజా పాల మాట్లాడుతూ.. నేను అసెంబ్లీలో సీఎం యోగిని ప్రశంసించాను. అహ్మద్ను మాఫియా అని…
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అంటే దేశంలోనే ఒక ప్రత్యేకమైన పాపులారిటీ ఉంది. యూపీలో సంచలన నిర్ణయాలను అమలు చేస్తూ సీఎం యోగి పాపులర్ అయ్యారు . అయితే ఇంతకాలం యోగి ఆదిత్యనాథ్ తీసుకునే నిర్ణయాలను బిజెపి కార్యకర్తలు, రాష్ట్ర ప్రజలు మెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న యూపీ అసెంబ్లీలో ఏకంగా సమాజ్ వాది పార్టీ ఎమ్మెల్యే యోగి ఆదిత్యనాథ్ ను ప్రశంసించారు. ఆయన పాలనను పొగడ్తలతో అసెంబ్లీ వేదికగా ముంచేస్తారు. మా పార్టీలో గెలిసి మేం…
Akhilesh Yadav: ఓ మసీదులో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్లు సందర్శించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ ఇద్దరు నేతలపై విరుచుకుపడుతోంది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఇటీవల పార్లమెంట్ సమీపంలోని ఒక మసీదును సంరద్శించారు. మతపరమైన ప్రాంతంలో రాజకీయా సమావేశాలు నిర్వహించడం ఏమిటని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఈ సమావేశంలో డింపుల్ యాదవ్ ధరించిన దుస్తులపై కూడా వివాదం చెలరేగింది.
Akhilesh Yadav: ఇండీ కూటమిపై సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. 2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిప ఇండి కూటమి సంకీర్ణం కొనసాగుతుంది ఆయన స్పష్టం చేశారు. అధికార పార్టీ బీజేపీపై మరోసారి విరుచుకుపడ్డారు. వక్ఫ్ బిల్లు ద్వారా మాఫియా లాగా భూమిని లాక్కోవడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
గురుగ్రామ్ భూమి కేసుకు సంబంధించి వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా బుధవారం వరుసగా రెండో రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరయ్యారైన విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా యూపీ ఎంపీ, సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ స్పందించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏర్పాటు అయ్యిందని, ఇప్పుడు అదే సంస్థ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటోందని పేర్కొన్నారు. ఈ ఈడీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్లపై ఈడీ…
లోక్సభలో వక్ఫ్ చర్చ సందర్భంగా అఖిలేష్ యాదవ్, హోంమంత్రి అమిత్ షా మధ్య చర్చ జరిగింది. ఈ చర్చ నవ్వుకు దారితీసింది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా భావించే బీజేపీ తన జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకోలేకపోతోందని అఖిలేష్ యాదవ్ విమర్శించారు. పార్లమెంట్ లో సభ్యులు మొత్తం నవ్వారు. అఖిలేష్ ప్రకటనకు అమిత్ షా స్పందించి ప్రసంగం మధ్యలో లేచి నిలబడ్డారు. అఖిలేష్ యాదవ్ నవ్వుతూ ఈ విషయం చెప్పడంతో ఆయన కూడా నవ్వుతూ సమాధానమిచ్చారు. ఇక్కడ చాలా పార్టీలు…
Akhilesh Yadav: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వీధుల్లో, రోడ్లపై నమాజ్ చేయడంపై నిషేధం విధించింది రాష్ట్ర ప్రభుత్వం. దీంతో మీరట్, సహారన్పూర్, మొరాదాబాద్లలో అనేక చోట్ల ముస్లింలు పోలీసులతో వాగ్వాదం జరగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేష్ యాదవ్ మంగళవారం సంభాల్, ఔరంగజేబు సమస్యలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. అధికార బీజేపీ పార్టీ మతపరమైన ప్రదేశాలను ప్రమాదంలో పడేస్తోందని, మతపరమైన ఉద్రిక్తతను ప్రోత్సహిస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సంభాల్, ఔరంగజేబు వంటి అంశాలను లేవనెత్తుతుందని అఖిలేష్ యాదవ్ అన్నారు.
Akhilesh Yadav: భారతదేశంలో ఉద్యోగుల పనిగంటలు అనేవి పని చేసే రంగం, ఉద్యోగం స్వభావం, కంపెనీ విధానాలు, ఇంకా ప్రభుత్వ నియమావళులపై ఆధారపడి ఉంటాయి. సాధారణంగా పూర్తి సమయం ఉద్యోగులు వారానికి 40 నుండి 48 గంటల వరకు పని చేస్తారు. అయితే, కొన్ని రంగాల్లో ముఖ్యంగా టెక్, స్టార్టప్, ఫైనాన్స్, మరికొన్ని ప్రైవేట్ రంగాల్లో, ఉద్యోగులు ఎక్కువ సమయం పని చేయడం సాధారణంగా కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వారానికి 60 నుండి 80 గంటల వరకు…
Yogi Adityanath: మహా కుంభమేళా ముగింపుకు సమయం దగ్గర పడుతోంది. ఫిబ్రవరి 26 మహా శివరాత్రితో ఈ కార్యక్రమం పూర్తవుతోంది. తాజాగా, మహా కుంభమేళాపై విపక్షాల విమర్శల నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంభమేళా అనేది ప్రజలు కోరికలు కోరుకునే ఒక నిధి అని ఆయన అన్నారు. ‘‘రాబందులకు శవాలు వచ్చాయి, పందులకు మురికి లభించింది. అయితే మంచి వ్యక్తులకు సంబంధాల అందమైన చిత్రం లభించింది. వ్యాపారులకు వ్యాపారం లభించింది. భక్తులకు శుభ్రమైన…