Akhilesh Yadav: మసీదులో అఖిలేష్ యాదవ్ మీటింగ్, డింపుల్ యాదవ్ దుస్తులపై వివాదం..
- మసీదులో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ మీటింగ్..
- డింపుల్ యాదవ్ దుస్తులపై వివాదం..
- ప్రార్థనా స్థలాన్ని రాజకీయాలకు వాడటంపై బీజేపీ ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Akhilesh Yadav: ఓ మసీదులో సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ) అధినేత ములాయం సింగ్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్లు సందర్శించడం వివాదాస్పదంగా మారింది. బీజేపీ ఇద్దరు నేతలపై విరుచుకుపడుతోంది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఇటీవల పార్లమెంట్ సమీపంలోని ఒక మసీదును సంరద్శించారు. మతపరమైన ప్రాంతంలో రాజకీయా సమావేశాలు నిర్వహించడం ఏమిటని బీజేపీ ప్రశ్నిస్తోంది. ఈ సమావేశంలో డింపుల్ యాదవ్ ధరించిన దుస్తులపై కూడా వివాదం చెలరేగింది.
Read Also: Australia: F*** Off, ఇండియన్.. ఆస్ట్రేలియాలో వ్యక్తిపై జాతివివక్ష దాడి..
Also Read
- Lucknow Tragedy: లక్నో విషాదంపై కన్నీళ్లు పెట్టుకున్న డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్
- Maharashtra: ఉద్ధవ్ ఠాక్రేకు భారీ షాక్.. షిండే గూటికి చేరిన ఆరుగురు ఎంపీలు
- Lucknow Tragedy: లక్నో కోచింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం.. 14 మంది సజీవ దహనం
- India Oil Imports: అమెరికా చమురు దిగుమతులకు బ్రేక్.. రష్యా వైపు భారత్ మొగ్గు
బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షుడు జమాల్ సిద్ధిఖీ ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు. అఖిలేష్ యాదవ్ ప్రార్థనా స్థలాన్ని అనధికారికి ఎస్పీ కార్యాలయంగా మార్చారని దుయ్యబట్టారు. “అఖిలేష్ యాదవ్ నిన్న మసీదుకు వెళ్ళాడు. ఆ మసీదు పార్లమెంట్ భవనం ముందు ఉంది. ఎస్పీ ఎంపీ నద్వీ అక్కడి ఇమామ్. మసీదు లోపల రాజకీయ సమావేశం ఎందుకు జరిగింది?” అని ప్రశ్నించారు. ఫోటోలో డింపుల్ యాదవ్ బ్లౌజ్ ధరించినట్లు కనిపిస్తోందని, ఆమె వీపు, పొట్ట కనిపిస్తోందని, డింపుల్ తలపై దుపట్టా కూడా లేదని అన్నారు. ఇది మసీదు లోపల ప్రవర్తనా నియమావళికి పూర్తిగా విరుద్ధమని, ప్రపంచవ్యాప్తంగా ఇది ఇస్లామిక్ మనోభావాలను దెబ్బతీస్తుందని అన్నారు. వీరిపై కేసు నమోదు చేశామని చెప్పారు. మసీదును ఎస్పీ నాయకులు సరదాలకు, ఉల్లాసానికి వేదిక మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో ఈ సమావేశంలో దేశవ్యతిరేక కార్యకలాపాల గురించి చర్చించారని అన్నారు.
యూపీ డిప్యూటీ సీఎం బ్రజేష్ పాఠక్ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎస్పీ రాజ్యాంగ నిబంధనల్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం మతపరమైన ప్రదేశాలను ఉపయోగిస్తున్నారని మండిపడ్డారు. అయిత, బీజేపీ ఆరోపణల్ని ఎస్పీ తీవ్రంగా ఖండించింది. ఈ వివాదం ద్వారా జాతీయ సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. బీజేపీ రాజకీయ లాభం కోసం మతాన్ని ఆయుధంగా ఉపయోగిస్తోందని అఖిలేష్ ఆరోపించారు. డింపుల్ యాదవ్ తన తలపై దుప్పట్టా కప్పుకున్నారు, ఫోటో తీస్తున్న సమయంలో జార వచ్చు అని ఎస్పీ ఎంపీ జియా ఉర్ రెహ్మాన్ బార్క్ అన్నారు.
తాజావార్తలు
-
Sanju Samson: ధోనీ, కోహ్లీని టెన్నిస్ స్టార్లతో పోల్చిన సంజూ శాంసన్.. ఆయన ఫెడరర్.. ఈయన అల్కరాజ్..!
-
World Cup 2027: ఆ కాటేరమ్మ కొడుకు అంటే గంభీర్కు ఎంతో ఇష్టం.. వరల్డ్ కప్లో స్థానం పక్కా.
-
Kunal Shah: భారతీయ టెక్ దిగ్గజానికి కీలక బాధ్యతలు.. వాట్సాప్ గ్లోబల్ సీఈఓగా కునాల్ షా నియామకం
-
AP Cabinet Meeting: రేపు ఏపీ కేబినెట్ కీలక భేటీ.. రూ.30,515 కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి కొత్త ఊపు..!
-
Veerabhadruni Rahasyam : గుడి గంట మోగితే శవం లేవాల్సిందేనా? ఓటీటీలోకి భయపెట్టే ‘వీరభద్రుని రహస్యం’
ట్రెండింగ్
-
120Hz నుంచి 144Hz డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, 48MP కెమెరాతో Ai+ కొత్త 5G ఫోన్లు లాంచ్.. ధరలు, ఫీచర్లు ఇవే!
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!