Akhilesh Yadav: అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతా క్లోజ్.. బీజేపీపై ఎస్పీ నేతల ధ్వజం
- అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతా క్లోజ్
- బీజేపీపై ఎస్పీ నేతల ధ్వజం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతాను సస్పెండ్ చేశారని ఆ పార్టీ నేత ఫక్రుల్ హసన్ చాంద్ తెలిపారు. అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతాను నిలిపివేయడం ప్రజాస్వామ్యంపై దాడిగా రాసుకొచ్చారు. ‘‘దేశంలో మూడవ అతిపెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడైన అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతాను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యంపై దాడి. బీజేపీ ప్రభుత్వం దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని విధించింది. ప్రతిపక్షంలో లేవనెత్తిన ప్రతి గొంతును అణచివేయాలని చూస్తోంది.’’ అని ఎక్స్లో ఫక్రుల్ హసన్ చాంద్ పేర్కొన్నారు. ఖాతా పునరుద్ధరించకపోతే పార్టీ చట్టపరంగా ముందుకెళ్తుందని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Gold Rate Today: ధరల మోత.. ఇవాళ రూ. 550 పెరిగిన గోల్డ్ ధర.. రూ. 3 వేలు పెరిగిన వెండి
Also Read
- Assam Magic Rice: "మ్యాజిక్ బియ్యం".. మంట అవసరం లేదు.. రైస్ కుక్కర్తో పనిలేదు.. చల్లటి నీళ్లతో క్షణాల్లో అన్నం రెడీ..
- BRICS Summit 2026: అష్టదిగ్బంధనంలో ఢిల్లీ.. మూడు రోజుల పాటు కఠిన ఆంక్షలు
- BRICS Summit 2026 ఎఫెక్ట్.. ఢిల్లీలో రైళ్లకు బ్రేక్! ఈ రైళ్లు రద్దు, మరికొన్ని దారి మళ్లింపు
- BRICS Summit 2026: భారతీయ రుచుల ఘుమఘుమలు.. BRICS దేశాధినేతలకు ప్రత్యేక విందు
అయితే అఖిలేష్ ఫేస్బుక్ ఖాతాలో హింసాత్మక, లైంగిక కంటెంట్ను పోస్ట్ చేయడంపై ఖాతాను బ్లాక్ చేసినట్లు సమాచారం. అఖిలేష్కు ఫేస్బుక్లో 8 మిలియన్లకు పైగా అనుచరులుు ఉన్నారు. ఈ ఖాతాను శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హఠాత్తుగా సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఖాతా క్లోజ్ చేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Trump-Machado: నోబెల్ శాంతి గ్రహీత మచాడోకు ట్రంప్ ఫోన్.. సుదీర్ఘంగా సంభాషణ!
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. దేశంలో మూడో అతి పెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అఖిలేష్ ఖాతాను క్లోజ్ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు దెబ్బని సమాజ్వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి రాజీవ్ రాయ్ పేర్కొన్నారు. బీజేపీ ఇలా చేసి ఉంటే అది తప్పు అని చెప్పారు. ఇది అధికార పార్టీ ఆదేశం మేరకు జరిగి ఉంటే పిరికితనానికి సంకేతం అన్నారు. సోషలిస్టుల గొంతును అణచివేయడానికి ప్రయత్నించడం పొరపాటు అని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: US: అమెరికాలోని ఓ ప్లాంట్లో పేలుడు.. 19 మంది మృతి!
అయినా ఎటువంటి హెచ్చరికా.. నోటీసు లేకుండా ఫేస్బుక్ ఖాతాను ఎలా క్లోజ్ చేస్తుందని లక్నో నార్త్కు చెందిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా శుక్లా ధ్వజమెత్తారు. ఫేస్బుక్ తన పరిమితులను దాటడానికి ధైర్యం చేసిందని మండిపడ్డారు. ‘‘అఖిలేష్ యాదవ్ లక్షలాది మంది గొంతుక! ఫేస్బుక్ తన సరిహద్దులను గుర్తుంచుకోవాలి. ఇది ప్రజాస్వామ్యాన్ని నిశ్శబ్దం చేయకూడదు. సమాజ్వాదీలారా.. ఫేస్బుక్ను దాని పరిధిని గుర్తుచేయాల్సిన సమయం ఆసన్నమైంది! ఇటువంటి అహంకారాన్ని సహించబోము.’’ అని శుక్లా అన్నారు.
తాజావార్తలు
-
Masala Gutti Vankaya Recipe: బగారా రైస్, పులావ్లోకి అదిరిపోయే “మసాలా గుత్తివంకాయ” చేసేయండి ఇలా..! లొట్టలేసుకుంటూ తినేస్తారంతే.!
-
Railway Accident: కొవ్వూరు వద్ద పట్టాలు తప్పిన గూడ్స్ రైలు.. ఎక్కడికక్కడ నిలిచిపోయిన రైళ్లు..
-
Mahindra Thar 2026: ఆఫ్రోడ్ ప్రియులకు గుడ్ న్యూస్.. సరికొత్త లుక్తో మళ్లీ రాబోతున్న మహింద్రా థార్..!
-
Movie Interval: సినిమా మధ్యలో ‘ఇంటర్వెల్’ ఎందుకు వస్తుందో తెలుసా?.. పాప్కార్న్, కూల్డ్రింక్స్ కోసం కాదు.. అసలు కారణం ఏంటంటే?
-
Sandeepa Virk: మురికి టాయిలెట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్.. జైలులో బట్టలు విప్పించారు.. కన్నీళ్లు పెట్టుకున్న నటి!
ట్రెండింగ్
-
7.62mm స్లిమ్ డిజైన్, 7,100mAh బ్యాటరీతో రానున్న Nubia NaviX Ultra..!
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!