Akhilesh Yadav: అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతా క్లోజ్.. బీజేపీపై ఎస్పీ నేతల ధ్వజం
- అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతా క్లోజ్
- బీజేపీపై ఎస్పీ నేతల ధ్వజం
సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతాను సస్పెండ్ చేశారని ఆ పార్టీ నేత ఫక్రుల్ హసన్ చాంద్ తెలిపారు. అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతాను నిలిపివేయడం ప్రజాస్వామ్యంపై దాడిగా రాసుకొచ్చారు. ‘‘దేశంలో మూడవ అతిపెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడైన అఖిలేష్ యాదవ్ ఫేస్బుక్ ఖాతాను సస్పెండ్ చేయడం ప్రజాస్వామ్యంపై దాడి. బీజేపీ ప్రభుత్వం దేశంలో అప్రకటిత అత్యవసర పరిస్థితిని విధించింది. ప్రతిపక్షంలో లేవనెత్తిన ప్రతి గొంతును అణచివేయాలని చూస్తోంది.’’ అని ఎక్స్లో ఫక్రుల్ హసన్ చాంద్ పేర్కొన్నారు. ఖాతా పునరుద్ధరించకపోతే పార్టీ చట్టపరంగా ముందుకెళ్తుందని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Gold Rate Today: ధరల మోత.. ఇవాళ రూ. 550 పెరిగిన గోల్డ్ ధర.. రూ. 3 వేలు పెరిగిన వెండి
Also Read
- Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. 'మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం'.. అంటూ ఆగ్రహం!
- White Towel: ప్రభుత్వ కార్యాలయాల్లో కుర్చీలపై తెల్ల టవల్ ఎందుకు?.. దీని వెనుక ఉన్న స్టోరీ ఇదే!
- Affair Doubt: ఏడేళ్ల క్రితం లవ్ మ్యారేజ్.. భార్య వీడియో కాల్లో ఉండగా సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త.. అది చూసి..
- Operation Sindoor: భారత్ దెబ్బకు వణికిపోయిన ఉగ్రవాదులు.. ఇప్పటికీ అజ్ఞాతంలోనే మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్లు మసూద్ అజార్, హఫీజ్ సయీద్!
అయితే అఖిలేష్ ఫేస్బుక్ ఖాతాలో హింసాత్మక, లైంగిక కంటెంట్ను పోస్ట్ చేయడంపై ఖాతాను బ్లాక్ చేసినట్లు సమాచారం. అఖిలేష్కు ఫేస్బుక్లో 8 మిలియన్లకు పైగా అనుచరులుు ఉన్నారు. ఈ ఖాతాను శుక్రవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో హఠాత్తుగా సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఖాతా క్లోజ్ చేయడంపై ఆ పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Trump-Machado: నోబెల్ శాంతి గ్రహీత మచాడోకు ట్రంప్ ఫోన్.. సుదీర్ఘంగా సంభాషణ!
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి.. దేశంలో మూడో అతి పెద్ద పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న అఖిలేష్ ఖాతాను క్లోజ్ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థకు దెబ్బని సమాజ్వాదీ పార్టీ జాతీయ కార్యదర్శి రాజీవ్ రాయ్ పేర్కొన్నారు. బీజేపీ ఇలా చేసి ఉంటే అది తప్పు అని చెప్పారు. ఇది అధికార పార్టీ ఆదేశం మేరకు జరిగి ఉంటే పిరికితనానికి సంకేతం అన్నారు. సోషలిస్టుల గొంతును అణచివేయడానికి ప్రయత్నించడం పొరపాటు అని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: US: అమెరికాలోని ఓ ప్లాంట్లో పేలుడు.. 19 మంది మృతి!
అయినా ఎటువంటి హెచ్చరికా.. నోటీసు లేకుండా ఫేస్బుక్ ఖాతాను ఎలా క్లోజ్ చేస్తుందని లక్నో నార్త్కు చెందిన సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే పూజా శుక్లా ధ్వజమెత్తారు. ఫేస్బుక్ తన పరిమితులను దాటడానికి ధైర్యం చేసిందని మండిపడ్డారు. ‘‘అఖిలేష్ యాదవ్ లక్షలాది మంది గొంతుక! ఫేస్బుక్ తన సరిహద్దులను గుర్తుంచుకోవాలి. ఇది ప్రజాస్వామ్యాన్ని నిశ్శబ్దం చేయకూడదు. సమాజ్వాదీలారా.. ఫేస్బుక్ను దాని పరిధిని గుర్తుచేయాల్సిన సమయం ఆసన్నమైంది! ఇటువంటి అహంకారాన్ని సహించబోము.’’ అని శుక్లా అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : పెద్దల చదువుకు పెద్ద పీట.. వయోజనుల్లో అక్షరాస్యత పెంపుపై ప్రత్యేక శ్రద్ధ..
-
Supreme Court: సీఎం మమత తీరుపై సుప్రీంకోర్టు ఫైర్.. ‘మీ చర్య ప్రజాస్వామ్యానికే ప్రమాదం’.. అంటూ ఆగ్రహం!
-
TGSRTC : సమ్మె విరమించి యధావిధిగా విధుల్లోకి హాజరుకావాలి.. ఆర్టీసీ ఎండీ సూచన
-
Vivo X300 Ultra, Vivo X300 FE: కెమెరా కింగ్గా రాబోతున్న Vivo X300 సిరీస్.. రిలీజ్ డేట్ ఫిక్స్
-
CM Chandrababu: వర్మ తీరుపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అసహనం..
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?